దేశాన్ని పట్టిపీడిస్తున్న టీకాల కొరతను అధిగమించేందుకు భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీ తన ఉత్పత్తి కోవ్యాగ్జిన్ ఫార్ములాను షేర్ చేసుకుంటున్నట్లు సమాచారం. అందరికీ టీకాను వీలైనంత వేగంగా ఇవ్వాలంటే కోవ్యాగ్జిన్, కోవీషీల్డ్ టీకాల ఫార్ములను ఇతర ఫార్మా కంపెనీలతో పంచుకోవటం ఒకటే మార్గమని దేశంలో అన్నీవర్గాల నుండి డిమాండ్లు పెరిగిపోతున్నాయి.
కోవీషీల్డ్ టీకా ఫార్ములను ఇతర కంపెనీలతో షేర్ చేసుకోవటానికి సీరమ్ కంపెనీ అంగీకరించే అవకాశంలేదు. ఎందకంటే ఇదిపూర్తిగా ప్రైవేటు సంస్ధ కాబట్టే. ఇదే సమయంలో కోవాగ్జిన్ టీకా ఫార్ములను యాజమాన్యం భారత్ బయోటెక్ ఇతర కంపెనీలతో పంచుకునే అవకాశంఉంది. ఎందుకంటే ఇందులో భారత ప్రభుత్వం వాటాకూడా ఉంది. కోవ్యాగ్జిన్ టీకా ఉత్పత్తిలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ అండ్ రీసెర్చి (ఐసీఎంఆర్) పాత్రకూడా ఉంది.
అందుకనే ఈ విషయమై భారత్ బయెటెక్ యాజమాన్యంతో మాట్లాడి కేంద్రప్రభుత్వం ఫార్ముల షేరింగ్ కు ఒప్పించింది. దీంతో హైదరాబాద్ లోనే ఉన్న మరో రెండు ఫార్మా కంపెనీలు ఇండియన్ బయోలాజికల్, భారత్ బయోలాజికల్ కంపెనీలో కూడా కోవ్యాగ్జిన్ టీకాలు తయారు కానున్నాయి. ఇవేకాకుండా ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలో కూడా కోవ్యాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేసే విషయాన్ని కేంద్రం+భారత్ బయోటెక్ యాజమాన్యాలు మాట్లాడుతున్నాయట.
ఉత్పత్తి సామర్ధ్యం పెంచుకోలేనపుడు, టీకాల డిమాండ్ ను తట్టుకోలేనపుడు కోవ్యాగ్జిన్ ఫార్ములను ఇతర కంపెనీలతో పంచుకుని ఉత్పత్తి చేయించాలన్న జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడికి సూచన చేసిన విషయం తెలిసిందే. కారణం ఏదైనా టీకాల ఉత్పత్తి పెంచటానికి కేంద్రం తీసుకున్న చొరవ అభినందనీయమనే చెప్పాలి. అన్నీ అనుకున్నట్లు జరిగితే దేశీయంగా అభివృద్ధి చేసిన టీకాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది.
This post was last modified on May 14, 2021 10:55 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…