Trends

ఫార్ములా షేరింగుకు రెడీ అయిన కోవ్యాగ్జిన్ యాజమాన్యం

దేశాన్ని పట్టిపీడిస్తున్న టీకాల కొరతను అధిగమించేందుకు భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీ తన ఉత్పత్తి కోవ్యాగ్జిన్ ఫార్ములాను షేర్ చేసుకుంటున్నట్లు సమాచారం. అందరికీ టీకాను వీలైనంత వేగంగా ఇవ్వాలంటే కోవ్యాగ్జిన్, కోవీషీల్డ్ టీకాల ఫార్ములను ఇతర ఫార్మా కంపెనీలతో పంచుకోవటం ఒకటే మార్గమని దేశంలో అన్నీవర్గాల నుండి డిమాండ్లు పెరిగిపోతున్నాయి.

కోవీషీల్డ్ టీకా ఫార్ములను ఇతర కంపెనీలతో షేర్ చేసుకోవటానికి సీరమ్ కంపెనీ అంగీకరించే అవకాశంలేదు. ఎందకంటే ఇదిపూర్తిగా ప్రైవేటు సంస్ధ కాబట్టే. ఇదే సమయంలో కోవాగ్జిన్ టీకా ఫార్ములను యాజమాన్యం భారత్ బయోటెక్ ఇతర కంపెనీలతో పంచుకునే అవకాశంఉంది. ఎందుకంటే ఇందులో భారత ప్రభుత్వం వాటాకూడా ఉంది. కోవ్యాగ్జిన్ టీకా ఉత్పత్తిలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ అండ్ రీసెర్చి (ఐసీఎంఆర్) పాత్రకూడా ఉంది.

అందుకనే ఈ విషయమై భారత్ బయెటెక్ యాజమాన్యంతో మాట్లాడి కేంద్రప్రభుత్వం ఫార్ముల షేరింగ్ కు ఒప్పించింది. దీంతో హైదరాబాద్ లోనే ఉన్న మరో రెండు ఫార్మా కంపెనీలు ఇండియన్ బయోలాజికల్, భారత్ బయోలాజికల్ కంపెనీలో కూడా కోవ్యాగ్జిన్ టీకాలు తయారు కానున్నాయి. ఇవేకాకుండా ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలో కూడా కోవ్యాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేసే విషయాన్ని కేంద్రం+భారత్ బయోటెక్ యాజమాన్యాలు మాట్లాడుతున్నాయట.

ఉత్పత్తి సామర్ధ్యం పెంచుకోలేనపుడు, టీకాల డిమాండ్ ను తట్టుకోలేనపుడు కోవ్యాగ్జిన్ ఫార్ములను ఇతర కంపెనీలతో పంచుకుని ఉత్పత్తి చేయించాలన్న జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడికి సూచన చేసిన విషయం తెలిసిందే. కారణం ఏదైనా టీకాల ఉత్పత్తి పెంచటానికి కేంద్రం తీసుకున్న చొరవ అభినందనీయమనే చెప్పాలి. అన్నీ అనుకున్నట్లు జరిగితే దేశీయంగా అభివృద్ధి చేసిన టీకాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది.

This post was last modified on May 14, 2021 10:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

3 minutes ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

3 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

4 hours ago

అమరావతిపై జగన్‌కు 5 ప్రశ్నలు..!

అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…

6 hours ago

జ‌గ‌న్ రోడ్డున ప‌డేస్తే.. కూట‌మి ఆదుకుంది!

వైసీపీ అధినేత జ‌గ‌న్ హ‌యాంలో ఓ కుటుంబం రోడ్డున ప‌డింది. కేవ‌లం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించి…

6 hours ago

కోనసీమకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…

6 hours ago