Trends

ఫార్ములా షేరింగుకు రెడీ అయిన కోవ్యాగ్జిన్ యాజమాన్యం

దేశాన్ని పట్టిపీడిస్తున్న టీకాల కొరతను అధిగమించేందుకు భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీ తన ఉత్పత్తి కోవ్యాగ్జిన్ ఫార్ములాను షేర్ చేసుకుంటున్నట్లు సమాచారం. అందరికీ టీకాను వీలైనంత వేగంగా ఇవ్వాలంటే కోవ్యాగ్జిన్, కోవీషీల్డ్ టీకాల ఫార్ములను ఇతర ఫార్మా కంపెనీలతో పంచుకోవటం ఒకటే మార్గమని దేశంలో అన్నీవర్గాల నుండి డిమాండ్లు పెరిగిపోతున్నాయి.

కోవీషీల్డ్ టీకా ఫార్ములను ఇతర కంపెనీలతో షేర్ చేసుకోవటానికి సీరమ్ కంపెనీ అంగీకరించే అవకాశంలేదు. ఎందకంటే ఇదిపూర్తిగా ప్రైవేటు సంస్ధ కాబట్టే. ఇదే సమయంలో కోవాగ్జిన్ టీకా ఫార్ములను యాజమాన్యం భారత్ బయోటెక్ ఇతర కంపెనీలతో పంచుకునే అవకాశంఉంది. ఎందుకంటే ఇందులో భారత ప్రభుత్వం వాటాకూడా ఉంది. కోవ్యాగ్జిన్ టీకా ఉత్పత్తిలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ అండ్ రీసెర్చి (ఐసీఎంఆర్) పాత్రకూడా ఉంది.

అందుకనే ఈ విషయమై భారత్ బయెటెక్ యాజమాన్యంతో మాట్లాడి కేంద్రప్రభుత్వం ఫార్ముల షేరింగ్ కు ఒప్పించింది. దీంతో హైదరాబాద్ లోనే ఉన్న మరో రెండు ఫార్మా కంపెనీలు ఇండియన్ బయోలాజికల్, భారత్ బయోలాజికల్ కంపెనీలో కూడా కోవ్యాగ్జిన్ టీకాలు తయారు కానున్నాయి. ఇవేకాకుండా ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలో కూడా కోవ్యాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేసే విషయాన్ని కేంద్రం+భారత్ బయోటెక్ యాజమాన్యాలు మాట్లాడుతున్నాయట.

ఉత్పత్తి సామర్ధ్యం పెంచుకోలేనపుడు, టీకాల డిమాండ్ ను తట్టుకోలేనపుడు కోవ్యాగ్జిన్ ఫార్ములను ఇతర కంపెనీలతో పంచుకుని ఉత్పత్తి చేయించాలన్న జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడికి సూచన చేసిన విషయం తెలిసిందే. కారణం ఏదైనా టీకాల ఉత్పత్తి పెంచటానికి కేంద్రం తీసుకున్న చొరవ అభినందనీయమనే చెప్పాలి. అన్నీ అనుకున్నట్లు జరిగితే దేశీయంగా అభివృద్ధి చేసిన టీకాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది.

This post was last modified on May 14, 2021 10:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

1 hour ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

2 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

2 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

2 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

2 hours ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

3 hours ago