Trends

డోసుల మధ్య గ్యాప్ ఎందుకు పెంచుతున్నారో తెలుసా ?

టీకాలు మార్కెట్లోకి వచ్చిన కొత్తలో మొదటిడోసు వేసుకున్న వారికి 30 రోజులు కాగానే రెండో డోసు వేసేశారు. అంటే అప్పట్లో వ్యాక్సినేషన్ విషయంలో జనాలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎప్పుడైతే టీకాలు వేసుకునే వయసును 45 ఏళ్ళకు తగ్గించటం, కరోనా సెకెండ్ వేవ్ తీవ్రత మొదలవ్వటంతో జనాలకు టీకాలపై దృష్టిమళ్ళింది. దాంతో వ్యాక్సినేషన్ కోసం ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. డిమాండ్ ఎప్పుడైతే పెరిగిపోయిందో ఉత్పత్తిలేకపోవటంతో టీకాల కొరత పెరిగిపోయింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దేశంలో కోవీషీల్డ్, కోవ్యాగ్జిన్ టీకాలను ఉత్పత్తిచేస్తున్నవి రెండే కంపెనీలు. ఈ రెండింటికీ డిమాండ్ కు తగ్గట్లుగా ఉత్పత్తి చేసే సామర్ధంలేదన్నది వాస్తవం. మన రాష్ట్రం లెక్క తీసుకుంటే సుమారు 7 కోట్ల డోసులు కావాలి. రెండు కంపెనీలకు కలిపి నెలకు ఉత్పత్తి సామర్ధ్యం సుమారు 8 కోట్ల డోసులు మాత్రమే. ఈ 8 కోట్ల డోసులనే దేశంలోని అన్నీ రాష్ట్రాలకు పంచాలి.

అంటే మన రాష్ట్ర అవసరాలు తీరాలంటేనే ఎన్ని నెలలు పడుతుందో తెలీదు. దాదాపు ఇదే పరిస్దితి అన్నీ రాష్ట్రాల్లోను కనబడుతోంది. డిమాండ్ కు తగ్గట్లుగా ఉత్పత్తి పెంచలేకపోతోంది కాబట్టే టీకాలు వేయించుకునే రెండు డోసుల మధ్య గ్యాప్ ను కేంద్రప్రభుత్వం పెంచేస్తోంది. కోవీషీల్డ్ టీకా విషయంలో మాత్రం రెండు డోసుల మధ్య గ్యాప్ మొదటేమో 28 రోజులన్నారు. తర్వాత ఆరువారాలన్నారు. ఆ తర్వాతేమో 6-8 వారాలన్నారు. ఈమధ్యనే గ్యాప్ ను 8 వారాల నుండి 12 వారాలకు పెంచిన కేంద్రం తాజాగా 12-16 వారాలకు గ్యాప్ పెంచేసింది.

కేవలం వ్యాక్సిన్ల ఉత్పత్తి సాధ్యం కావటంలేదు కాబట్టే గ్యాప్ ను పెంచేస్తోందని అర్ధమైపోతోంది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని టీకాల ఉత్పత్తి విషయంలో ఫార్ములాను సామర్ధ్యాన్ని అన్నీ కంపెనీలతోను పంచుకునుంటే ఇపుడీ కొరత వచ్చుండేది కాదు. కనీసం విదేశీకంపెనీలను దేశంలోకి అనుమతించి ఉన్నా ఇన్ని సమస్యలుండేవి కావు. ఫార్ములను షేర్ చేసుకోక, విదేశీకంపెనీలను అనుమతించకపోవటంతో టీకాల కొరత దేశాన్ని పట్టి పీడిస్తోంది.

This post was last modified on May 14, 2021 10:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘బుడగ పేలుతుంది… బంగారం కొనొద్దు’

సెన్సెక్స్ మాదిరి బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళుతున్న వైనం ఇటీవల కాలంలో చోటు చేసుకుంటుంది. ఉదయం ఉన్న ధర…

1 minute ago

అర్ధరాత్రి అల్లకల్లోలం చేసిన కోహ్లీ

భారత్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆఫ్ లైన్ లోనే కాదు…

32 minutes ago

అర‌వింద స‌మేత తరువాత బాధపడ్డ హీరోయిన్

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అత్యుత్త‌మమైన‌, విభిన్న‌మైన చిత్రాల్లో అర‌వింద స‌మేత ఒక‌టి. అందులో కీల‌క పాత్ర‌లు పోషించిన ఆర్టిస్టులంద‌రికీ మంచి…

4 hours ago

ఎవ‌రా హీరోయిన్… ద‌ర్శ‌కుడికి మినిస్ట‌ర్ల ఫోన్లు

సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ కెరీర్లో చూడాల‌ని ఉంది, ఒక్క‌డు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌తో పాటు సైనికుడు, వ‌రుడు, నిప్పు లాంటి దారుణ‌మైన…

6 hours ago

10 వేల కెపాసిటీ బ్యాటరీతో ఫోన్ వచ్చేసింది

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో రియల్‌మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్‌ను విడుదల చేసింది.…

11 hours ago

వెండి కూడా బంగారానికి చేరువయ్యేలా..

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…

12 hours ago