Trends

డోసుల మధ్య గ్యాప్ ఎందుకు పెంచుతున్నారో తెలుసా ?

టీకాలు మార్కెట్లోకి వచ్చిన కొత్తలో మొదటిడోసు వేసుకున్న వారికి 30 రోజులు కాగానే రెండో డోసు వేసేశారు. అంటే అప్పట్లో వ్యాక్సినేషన్ విషయంలో జనాలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎప్పుడైతే టీకాలు వేసుకునే వయసును 45 ఏళ్ళకు తగ్గించటం, కరోనా సెకెండ్ వేవ్ తీవ్రత మొదలవ్వటంతో జనాలకు టీకాలపై దృష్టిమళ్ళింది. దాంతో వ్యాక్సినేషన్ కోసం ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. డిమాండ్ ఎప్పుడైతే పెరిగిపోయిందో ఉత్పత్తిలేకపోవటంతో టీకాల కొరత పెరిగిపోయింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దేశంలో కోవీషీల్డ్, కోవ్యాగ్జిన్ టీకాలను ఉత్పత్తిచేస్తున్నవి రెండే కంపెనీలు. ఈ రెండింటికీ డిమాండ్ కు తగ్గట్లుగా ఉత్పత్తి చేసే సామర్ధంలేదన్నది వాస్తవం. మన రాష్ట్రం లెక్క తీసుకుంటే సుమారు 7 కోట్ల డోసులు కావాలి. రెండు కంపెనీలకు కలిపి నెలకు ఉత్పత్తి సామర్ధ్యం సుమారు 8 కోట్ల డోసులు మాత్రమే. ఈ 8 కోట్ల డోసులనే దేశంలోని అన్నీ రాష్ట్రాలకు పంచాలి.

అంటే మన రాష్ట్ర అవసరాలు తీరాలంటేనే ఎన్ని నెలలు పడుతుందో తెలీదు. దాదాపు ఇదే పరిస్దితి అన్నీ రాష్ట్రాల్లోను కనబడుతోంది. డిమాండ్ కు తగ్గట్లుగా ఉత్పత్తి పెంచలేకపోతోంది కాబట్టే టీకాలు వేయించుకునే రెండు డోసుల మధ్య గ్యాప్ ను కేంద్రప్రభుత్వం పెంచేస్తోంది. కోవీషీల్డ్ టీకా విషయంలో మాత్రం రెండు డోసుల మధ్య గ్యాప్ మొదటేమో 28 రోజులన్నారు. తర్వాత ఆరువారాలన్నారు. ఆ తర్వాతేమో 6-8 వారాలన్నారు. ఈమధ్యనే గ్యాప్ ను 8 వారాల నుండి 12 వారాలకు పెంచిన కేంద్రం తాజాగా 12-16 వారాలకు గ్యాప్ పెంచేసింది.

కేవలం వ్యాక్సిన్ల ఉత్పత్తి సాధ్యం కావటంలేదు కాబట్టే గ్యాప్ ను పెంచేస్తోందని అర్ధమైపోతోంది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని టీకాల ఉత్పత్తి విషయంలో ఫార్ములాను సామర్ధ్యాన్ని అన్నీ కంపెనీలతోను పంచుకునుంటే ఇపుడీ కొరత వచ్చుండేది కాదు. కనీసం విదేశీకంపెనీలను దేశంలోకి అనుమతించి ఉన్నా ఇన్ని సమస్యలుండేవి కావు. ఫార్ములను షేర్ చేసుకోక, విదేశీకంపెనీలను అనుమతించకపోవటంతో టీకాల కొరత దేశాన్ని పట్టి పీడిస్తోంది.

This post was last modified on May 14, 2021 10:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago