Trends

ఐపీఎల్ వాయిదా.. బీసీసీఐకి ఎంత నష్టం?

అనివార్య పరిస్థితుల్లో ఐపీఎల్‌ను వాయిదా వేసేసింది బీసీసీఐ. ఏటా ఈ లీగ్ ద్వారా బీసీసీఐ ఐదారు వేల కోట్ల దాకా ఆదాయం ఆర్జిస్తుంది. అందుకే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా సరే.. లీగ్‌ను నిర్వహించడానికే చూస్తుంది. గత ఏడాది కరోనా కారణంగా వేసవిలో టోర్నీ నిర్వహించలేని పరిస్థితి తలెత్తితే.. ఆరు నెలలు వేచి చూసి, యూఏఈ వేదికగా లీగ్‌ను నిర్వహించారు. విదేశంలో, ప్రేక్షకులు లేకుండా లీగ్ జరిపించడం వల్ల ఆదాయంలో కొంత కోత పడ్డప్పటికీ.. భారీగానే ఆదాయం వచ్చింది.

ఐతే ఈసారి ఇండియాలో పరిస్థితులు మెరుగు పడటం, ఇంగ్లాండ్‌తో అంతర్జాతీయ సిరీస్‌కు కూడా ఆతిథ్యం ఇవ్వడంతో మళ్లీ దేశం దాటి వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. సొంతగడ్డ మీద షెడ్యూల్ ప్రకారమే లీగ్‌ జరిపించడానికి సన్నాహాలు చేశారు. కాకపోతే వేదికల సంఖ్యను తగ్గించారు. స్టేడియాల్లోకి అభిమానులకు అనుమతిని నిషేధించారు.

ఎంత పకడ్బందీగా చేద్దామని చూసినా సరే.. లీగ్ మధ్యలో ఉండగా కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో అర్ధంతరంగా టోర్నీని ఆపేయక తప్పలేదు. దీని వల్ల తక్షణం బీసీసీఐ ఆదాయానికి రూ.2 వేల కోట్లకు పైగానే కోత పడ్డట్లు తెలుస్తోంది. ఓ బీసీసీఐ అధికారి నష్టంపై మాట్లాడుతూ.. రూ.2200 కోట్ల నుంచి రూ.2500 కోట్ల దాకా ఉండొచ్చని పేర్కొన్నాడు. ఐతే మొత్తంగా ఈ మేరకు ఆదాయం కోల్పోయినట్లేనా అన్నది ఆయన స్పష్టత ఇవ్వలేదు.

ఎందుకంటే ప్రస్తుతం లీగ్‌ను ఆపేయడం వల్ల మిగతా మ్యాచ్‌ల ద్వారా రావాల్సిన ఆదాయానికి తాత్కాలికంగా గండి పడ్డట్లే. తర్వాత వీలు చిక్కినప్పుడు లీగ్‌లో మిగతా మ్యాచ్‌లు జరిపిస్తే ఆదాయం రాకుండా పోదు. కానీ ఇప్పుడు లీగ్‌ను మధ్యలో ఆపి.. మళ్లీ విండో దొరికినపుడు కొత్తగా లీగ్‌ను జరిపించడం వల్ల కొన్ని వందల కోట్లలో అయితే బీసీసీఐకి నష్టం తప్పదు అన్నట్లే. పైగా మళ్లీ ఖాళీ దొరకబుచ్చుకుని, అన్ని బోర్డులతో మాట్లాడి, కొత్తగా బయో బబుల్ ఏర్పాటు చేసి మ్యాచ్‌లు నిర్వహించడం అంటే అంత తేలికైన వ్యవహారం కాదు.

This post was last modified on May 5, 2021 8:13 am

Share
Show comments
Published by
satya

Recent Posts

థియేట్రికల్ రిలీజ్‌లు లైట్.. ఓటీటీ సినిమాలే హైలైట్

ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…

1 hour ago

పింఛ‌న్ల‌పై పిడుగు.. వైసీపీకి క‌ష్ట‌మేనా?

సామాజిక పింఛ‌న్ల పై పిడుగు ప‌డిన‌ట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంట‌రి మ‌హిళ లు.. వంటి సామాజిక పింఛ‌నుపై…

6 hours ago

వైసీపీ మేనిఫెస్టోపై చంద్ర‌బాబు ఫ‌స్ట్‌ రియాక్ష‌న్

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నిక‌ల మేనిఫెస్టోను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2019…

6 hours ago

జై హనుమాన్ రూటు మారుతోంది

స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…

7 hours ago

ఆ విషయంలో ఎవరైనా సుకుమార్ తర్వాతే..

టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…

9 hours ago

బాబు సూప‌ర్ సిక్స్‌- జ‌గ‌న్ నైన్ గ్యారెంటీస్‌ ఎవ‌రిది ముందంజ‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో సూప‌ర్ సిక్స్‌ను ఎక్కువ‌గా ప్ర‌చారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వీటిని…

9 hours ago