Trends

ఆక్సిజన్ ఎవరికి అవసరమో తెలుసా ?

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతి రోజు రోజుకు పెరిగిపోతోంది. ఒకవైపు వైరస్ కేసులు పెరిగిపోతుందటం, మరోవైపు ఆక్సిజన్ అందక రోగులు చనిపోతుండటం అందరిలోను భయాందోళనలు పెరిగిపోతున్నది. నిజానికి కరోనా వైరస్ సోకి చనిపోయే రోగులకన్నా ఆక్సిజన్ అందక చనిపోతున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. ఈ కారణంగానే దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఆక్సిజన్ కు గతంలో ఎప్పుడు లేనంత డిమాండ్ పెరిగిపోతోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కరోనా సోకిన రోగులందరికీ ఆక్సిజన్ అవసరంలేదు. సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకుని కరోనా సోకిందని తెలియగానే డాక్టర్ల సూచనల మేరకు మందులు వాడితే పెద్దగా సమస్య ఉండదు. కానీ చాలామంది అసలు కరోనా పరీక్షలు చేయించుకోవటంలోనే నిర్లక్ష్యంగా ఉంటున్నారట. పరీక్షలు చేయించుకున్న వారిలో మందులువాడుతున్న వారిసంఖ్య తక్కువగానే ఉంటున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

పరీక్షలు చేయించుకోక, మందులు వాడకపోవటంతోనే సమస్య పెరిగిపోతున్నదట. సమస్య పెరిగిపోగానే అప్పటికిప్పుడు చాలామంది ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారట. అక్కడ రోగులకు సీరియస్ అయిపోయి ఆక్సిజన్ అందని వాళ్ళు చివరి నిముషంలో ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నట్లు ఒంగోలు ఆసుపత్రి సూపరెండెంట్ డాక్టర్ శ్రీరాములు తెలిపారు. తమ దగ్గర కూడా ఆక్సిజన్ కొరతగా ఉండటం, చివరి నిముషంలో ఆసుపత్రిలో చేరుతుండటంతో తాము కూడా ఏమీ చేయలేకపోతున్నట్లు చెప్పారు.

నిజానికి కరోనా రోగులకందరికీ ఆక్సిజన్ అవసరం లేదని శ్రీరాములు చెప్పారు. ఆక్సిజన్ లెవల్స్ 94 శాతంకన్నా తగ్గిన వాళ్ళకే ఆక్సిజన్ అవసరమన్నారు. ప్రైవేటు, ప్రభుత్వాసుపత్రుల్లో చేరుతున్న రోగుల్లో 70 శాతంమందికి ఆక్సిజన్ అవసరం అవుతోందట. ఎందుకంటే చివరినిముషంలో ఆసుపత్రుల్లో చేరుతుండటమే ప్రధాన కారణంగా వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉండటం, అప్పటికే అనారోగ్యంతో ఉన్నవారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో చాలామందికి ఆక్సిజన్ అవసరం అవుతోందట. కరోనా వైరస్ రోగుల ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో శ్వాస ఆడకపోవటంతోనే ఆక్సిజన్ అవసరం అవుతోందని వైజాగ్ లోని ఆంధ్రా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీవీ సుధాకర్ స్పష్టంచేశారు. సకాలంలో పరీక్షలు చేయించుకుని, డాక్టర్ సలహాలు పాటిస్తే చాలామందికి ఆక్సిజన్ అవసరమే ఉండదని సుధాకర్ స్పష్టం చేశారు. మరి ఎంతమంది డాక్టర్ల సూచనలు పాటిస్తున్నారు ?

This post was last modified on April 23, 2021 12:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

3 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

3 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

5 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

7 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

8 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

8 hours ago