Trends

ఆక్సిజన్ ఎవరికి అవసరమో తెలుసా ?

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతి రోజు రోజుకు పెరిగిపోతోంది. ఒకవైపు వైరస్ కేసులు పెరిగిపోతుందటం, మరోవైపు ఆక్సిజన్ అందక రోగులు చనిపోతుండటం అందరిలోను భయాందోళనలు పెరిగిపోతున్నది. నిజానికి కరోనా వైరస్ సోకి చనిపోయే రోగులకన్నా ఆక్సిజన్ అందక చనిపోతున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. ఈ కారణంగానే దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఆక్సిజన్ కు గతంలో ఎప్పుడు లేనంత డిమాండ్ పెరిగిపోతోంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కరోనా సోకిన రోగులందరికీ ఆక్సిజన్ అవసరంలేదు. సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకుని కరోనా సోకిందని తెలియగానే డాక్టర్ల సూచనల మేరకు మందులు వాడితే పెద్దగా సమస్య ఉండదు. కానీ చాలామంది అసలు కరోనా పరీక్షలు చేయించుకోవటంలోనే నిర్లక్ష్యంగా ఉంటున్నారట. పరీక్షలు చేయించుకున్న వారిలో మందులువాడుతున్న వారిసంఖ్య తక్కువగానే ఉంటున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

పరీక్షలు చేయించుకోక, మందులు వాడకపోవటంతోనే సమస్య పెరిగిపోతున్నదట. సమస్య పెరిగిపోగానే అప్పటికిప్పుడు చాలామంది ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారట. అక్కడ రోగులకు సీరియస్ అయిపోయి ఆక్సిజన్ అందని వాళ్ళు చివరి నిముషంలో ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నట్లు ఒంగోలు ఆసుపత్రి సూపరెండెంట్ డాక్టర్ శ్రీరాములు తెలిపారు. తమ దగ్గర కూడా ఆక్సిజన్ కొరతగా ఉండటం, చివరి నిముషంలో ఆసుపత్రిలో చేరుతుండటంతో తాము కూడా ఏమీ చేయలేకపోతున్నట్లు చెప్పారు.

నిజానికి కరోనా రోగులకందరికీ ఆక్సిజన్ అవసరం లేదని శ్రీరాములు చెప్పారు. ఆక్సిజన్ లెవల్స్ 94 శాతంకన్నా తగ్గిన వాళ్ళకే ఆక్సిజన్ అవసరమన్నారు. ప్రైవేటు, ప్రభుత్వాసుపత్రుల్లో చేరుతున్న రోగుల్లో 70 శాతంమందికి ఆక్సిజన్ అవసరం అవుతోందట. ఎందుకంటే చివరినిముషంలో ఆసుపత్రుల్లో చేరుతుండటమే ప్రధాన కారణంగా వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉండటం, అప్పటికే అనారోగ్యంతో ఉన్నవారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో చాలామందికి ఆక్సిజన్ అవసరం అవుతోందట. కరోనా వైరస్ రోగుల ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో శ్వాస ఆడకపోవటంతోనే ఆక్సిజన్ అవసరం అవుతోందని వైజాగ్ లోని ఆంధ్రా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీవీ సుధాకర్ స్పష్టంచేశారు. సకాలంలో పరీక్షలు చేయించుకుని, డాక్టర్ సలహాలు పాటిస్తే చాలామందికి ఆక్సిజన్ అవసరమే ఉండదని సుధాకర్ స్పష్టం చేశారు. మరి ఎంతమంది డాక్టర్ల సూచనలు పాటిస్తున్నారు ?

This post was last modified on April 23, 2021 12:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పడిపడి నవ్వి… ‘పది సార్లు బల్ల గుద్దిన’ బాబు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం అత్యద్భుతమైన వేడుకలతో ముగిశాయి. 'ఆంధ్రప్రదేశ్ లెజిస్టేచర్ కల్చరల్ ఈవెనింగ్' పేరిట నిర్వహించిన కార్యక్రమం…

1 hour ago

అవును.. ఈ కుక్క ఖరీదు రూ.50 కోట్లు

బెంగళూరుకు చెందిన ఎస్. సతీష్ తన అరుదైన పెంపుడు జంతువులతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి రికార్డు సృష్టించారు.…

2 hours ago

రాజ‌కీయాలు వ‌ద్దులే.. టాలీవుడ్ సంచ‌ల‌న నిర్ణ‌యం?

రాజ‌కీయాల‌కు-సినిమా ఇండ‌స్ట్రీకి మ‌ధ్య అవినాభావ సంబంధం ఉన్న విష‌యం తెలిసిందే. అన్న‌గారు ఎన్టీఆర్‌తో ప్రారంభ‌మైన సినీ రాజ‌కీయాలు.. నిన్న మొన్న‌టి…

3 hours ago

బాబుకు తిరుగులేదు.. మ‌రో 20 ఏళ్లు ఆయ‌నే : జాతీయ మీడియా

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు తిరుగులేదా? ఆయ‌న పాల‌నా ప్ర‌భ మ‌రింత విరాజిల్లుతోందా? అంటే.. ఔన‌నే అంటున్నాయి జాతీయ…

4 hours ago

పెళ్లికాని ప్రసాద్‌ రిలీజ్.. రావిపూడి పుణ్యం

గతంలో హీరోగా కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించిన కమెడియన్ సప్తగిరి.. చివరగా లీడ్ రోల్ చేసిన రెండు మూడు సినిమాలు…

6 hours ago

బుల్లెట్ ప్రూఫ్ వద్దట.. గన్ లైసెన్స్ కావాలట

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన తెలంగాణ నేత, హైదరాబాద్ పాత బస్తీ పరిధి గోషా మహల్ శాసనసభ్యుడిగా కొనసాగుతున్న…

8 hours ago