కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఉదృతి రోజు రోజుకు పెరిగిపోతోంది. ఒకవైపు వైరస్ కేసులు పెరిగిపోతుందటం, మరోవైపు ఆక్సిజన్ అందక రోగులు చనిపోతుండటం అందరిలోను భయాందోళనలు పెరిగిపోతున్నది. నిజానికి కరోనా వైరస్ సోకి చనిపోయే రోగులకన్నా ఆక్సిజన్ అందక చనిపోతున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. ఈ కారణంగానే దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఆక్సిజన్ కు గతంలో ఎప్పుడు లేనంత డిమాండ్ పెరిగిపోతోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కరోనా సోకిన రోగులందరికీ ఆక్సిజన్ అవసరంలేదు. సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకుని కరోనా సోకిందని తెలియగానే డాక్టర్ల సూచనల మేరకు మందులు వాడితే పెద్దగా సమస్య ఉండదు. కానీ చాలామంది అసలు కరోనా పరీక్షలు చేయించుకోవటంలోనే నిర్లక్ష్యంగా ఉంటున్నారట. పరీక్షలు చేయించుకున్న వారిలో మందులువాడుతున్న వారిసంఖ్య తక్కువగానే ఉంటున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.
పరీక్షలు చేయించుకోక, మందులు వాడకపోవటంతోనే సమస్య పెరిగిపోతున్నదట. సమస్య పెరిగిపోగానే అప్పటికిప్పుడు చాలామంది ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారట. అక్కడ రోగులకు సీరియస్ అయిపోయి ఆక్సిజన్ అందని వాళ్ళు చివరి నిముషంలో ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నట్లు ఒంగోలు ఆసుపత్రి సూపరెండెంట్ డాక్టర్ శ్రీరాములు తెలిపారు. తమ దగ్గర కూడా ఆక్సిజన్ కొరతగా ఉండటం, చివరి నిముషంలో ఆసుపత్రిలో చేరుతుండటంతో తాము కూడా ఏమీ చేయలేకపోతున్నట్లు చెప్పారు.
నిజానికి కరోనా రోగులకందరికీ ఆక్సిజన్ అవసరం లేదని శ్రీరాములు చెప్పారు. ఆక్సిజన్ లెవల్స్ 94 శాతంకన్నా తగ్గిన వాళ్ళకే ఆక్సిజన్ అవసరమన్నారు. ప్రైవేటు, ప్రభుత్వాసుపత్రుల్లో చేరుతున్న రోగుల్లో 70 శాతంమందికి ఆక్సిజన్ అవసరం అవుతోందట. ఎందుకంటే చివరినిముషంలో ఆసుపత్రుల్లో చేరుతుండటమే ప్రధాన కారణంగా వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉండటం, అప్పటికే అనారోగ్యంతో ఉన్నవారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో చాలామందికి ఆక్సిజన్ అవసరం అవుతోందట. కరోనా వైరస్ రోగుల ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో శ్వాస ఆడకపోవటంతోనే ఆక్సిజన్ అవసరం అవుతోందని వైజాగ్ లోని ఆంధ్రా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీవీ సుధాకర్ స్పష్టంచేశారు. సకాలంలో పరీక్షలు చేయించుకుని, డాక్టర్ సలహాలు పాటిస్తే చాలామందికి ఆక్సిజన్ అవసరమే ఉండదని సుధాకర్ స్పష్టం చేశారు. మరి ఎంతమంది డాక్టర్ల సూచనలు పాటిస్తున్నారు ?
అగ్ర నిర్మాత గా ఆదిత్య చోప్రాకున్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షారుఖ్ ఖాన్ కు 'దిల్వాలే దుల్హనియా లేజాయేంగే'…
ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్లో ఆసక్తికర పోరు జరుగుతోంది. నాగబంధం, రావు బహదూర్ లాంటి ఆసక్తికర చిత్రాలు థియేటర్లలోకి దిగాయి.…
తెలుగు ప్రేక్షకులకు శ్రీదేవి విజయ్కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సీనియర్ నటి వెండితెరపై ఒకప్పుడు తనకంటూ…
సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది అనే ఒక టాక్ ఎప్పటినుంచో ఉంది. మాగ్జిమం ఐదు…
దేశాన్ని కుదిపేసిన పోంజీ కుంభకోణం కేసును విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరేట్.. చేసిన పని విమర్శలకు తావిస్తోంది. ఈ కేసులో ప్రధాన…
అక్కినేని అఖిల్ను పెద్ద స్టార్ను చేసేస్తుందని అభిమానులు ఆశించిన సినిమా.. ఏజెంట్. నిర్మాత అనిల్ సుంకర సైతం రిలీజ్కు ముందు…