Trends

రాష్ట్రంలో రెడ్ అలర్ట్ తప్పదా ?

దేశంలోని చాలా రాష్ట్రాల్లో లాగే ఏపిలో కూడా కరోనా వైరస్ కేసులు చాలా స్పీడుగా పెరిగిపోతోంది. రోజుకు కొన్ని వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం ఒక్కరోజే 10 వేల కేసులు నమోదయ్యాయి. రికార్డుల ప్రకారం 35 మంది చనిపోయారు. ఏపికి నాలుగువైపులా తమిళనాడు, కర్నాటక, తెలంగాణా, ఒడిస్సా రాష్ట్రాలున్నాయి. వీటిల్లో తమిళనాడు, కర్నాటక, తెలంగాణాలో ప్రతిరోజు వేలాదికేసులు నమోదవుతున్నాయి. వాటి ప్రభావం ఏపిపైన కూడా పడుతోంది.

మొదటి దశలో కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాపించినా రోజుకు 10 వేల కేసులు నమోదైతే కాలేదు. కానీ ఇపుడు సెకెండ్ వేవ్ లో మాత్రం రెట్టించిన స్పీడుతో వ్యాపించేస్తోంది. కేసులు పెరిగిపోతున్నంత స్పీడుగా టెస్టులు, ట్రాకింగ్, చికిత్స సాద్యంకాదన్న విషయం అందరికీ తెలిసిందే. దీని ఆధారంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. శ్రీకాకుళంలో అత్యధికంగా 1500 మంది, గుంటూరులో 1236, చిత్తూరులో 1180, కర్నూలులో 958, నెల్లూరులో 936 అనంతపురంలో 849, తూర్పుగోదావరిలో 830 కేసులు నమోదయ్యాయి.

పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రుల సంఖ్యను, పరీక్షలను పెంచటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే కొన్నిచోట్ల అధికారుల్లో సమన్వయ లోపం కారణంగా ప్రభుత్వ ఆదేశాలు అనుకున్నంత వేగంగా అమలు కావటంలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 60 వేలుదాటాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ లాంటి రాష్ట్రాలతో పోలిస్తే తక్కువే అయినా మనదగ్గర నమోదైన కేసులు ఎక్కువనే చెప్పాలి.

కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం కూడా రోజుకు లక్షల్లో వ్యాక్సిన్లు వేయిస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్లు కూడా అవసరాలకు సరిపడా సరఫరా కాకపోవటంతో ఇబ్బందులు పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రానికి 2 లక్షల కోవీషీల్డ్ డోసులు వచ్చాయి. అయితే వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు లక్షల్లో ఎదురుచూస్తుండటంతో వచ్చిన డోసులు సరిపోవటంలేదు.

కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు చేయించుకోమని ప్రభుత్వం మొత్తుకున్నా అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదు. అలాంటిది ఇపుడు సెకెండ్ వేవ్ కారణంగా పరీక్షల కోసం జనాలు ఆసుపత్రుల ముందు క్యూ కడుతున్నారు. ఇదే సమయంలో కరోనా వైరస్ ని అరికట్టడంలో భాగంగా ఎక్కడికక్కడ గ్రామాల్లో లాక్ డౌన్ మొదలైపోయాయి. క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే రెడ్ అలర్ట్ ప్రకటించక తప్పదేమో అనిపిస్తోంది.

This post was last modified on April 22, 2021 11:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

30 minutes ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

39 minutes ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

3 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

5 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

6 hours ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

6 hours ago