కుక్కలు.. పిల్లులు.. బొద్దింకలు.. గబ్బిలాలు.. పాములు.. కప్పలు.. ఇవీ అవీ అని తేడా లేవు. ఏ జంతువైనా.. ఏ కీటకమైనా.. ఏ జీవి అయినా చైనీయులకు తేడా ఉండదు. చూడగానే నోరూరిపోతుంది. ప్రపంచంలో వీళ్లలా ఇన్ని జీవుల్ని తినే మనుషులు ఇంకెక్కడైనా ఉంటారా అంటే సందేహమే.
వాళ్ల మాంసం పిచ్చే కరోనా వైరస్కు కారణమైందని.. వుహాన్లోని ప్రపంచ అతి పెద్ద మాంసం మార్కెట్టే వైరస్ వ్యాప్తికి కేంద్రమైందని ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఐతే కరోనా వ్యాప్తి పెరిగాక అక్కడ మార్కెట్ను మూసేశారు.
వుహాన్ సహా కొన్ని నగరాల్లో మాంసం విక్రయాల్ని ఆపేశారు. కానీ అక్కడ లాక్ డౌన్ ఎత్తేశాక మళ్లీ మాంసం విక్రయాలు పునఃప్రారంభం అయ్యాయి. ఎప్పట్లాగే జనాలు అన్ని రకాల మాంసాన్ని తినేస్తున్నారు.
చైనాలోని ఓ చోట ఒక బండిలో బతికున్న కప్పలు వందల సంఖ్యలో పోసి పెడితే.. జనాలు చుట్టూ చేరి కప్పల్ని ఏరి కవర్లలో వేసుకుంటున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కప్పల్ని తినడమేంటి అని మనకు అసహ్యం పుట్టొచ్చు కానీ.. చైనీయులు మాత్రం బతికున్న కప్పల్ని అలాగే నూనెలోకి వేసి బయటికి తీసి లాగించేస్తారు. మనం లైవ్ ఫిష్ కోసం ఎలా ఆసక్తి చూపిస్తామో వాళ్లు లైవ్ కప్పలు అలా అన్నమాట.
ఐతే మనం చేపనైనా, కోడినైనా చర్మం తీసి బాగా ఉడికించి మసాలా దట్టించి కూర చేసుకుని తింటాం. కానీ చైనీయులు అలా కాదు.. ఏ జీవినైనా జస్ట్ అలా వేడి నీళ్లలో వేసి బయటికి తీసి నోట్లో వేసుకుంటారు. ఏడాది వయసున్న పిల్లాడు బతికున్న కప్పను తినే ప్రయత్నం చేస్తుంటే.. తల్లిదండ్రులు నవ్వుతూ ఆడిస్తున్న వీడియో కూడా ఒకటి యూట్యూబ్లో కనిపిస్తోంది.
మనం బొద్దింకను చూస్తేనే బెంబేలెత్తిపోతాం. అసహ్యించుకుంటాం. ముట్టుకోవడానికీ ఇష్టపడం. ఐతే చైనాలో ఫామ్ ఏర్పాటు చేసి బొద్దింకల్ని పెంచుతారు. నేరుగా నూనెలో వేయించి తినేస్తారు.
This post was last modified on May 13, 2020 11:31 am
విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన…
అగ్రరాజ్యం అమెరికాలో నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టినప్పుడు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ మురిసిపోయారు. "నా ప్రియ…
ఇవాళ సీనియర్ నిర్మాత, ఫైనాన్షియర్ శింగనమల రమేష్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేపింది. పధ్నాలుగు…
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల నుంచి తెలుగుదేశం, జనసేన కార్యకర్తల నుంచి ఒక రకమైన అసంతృప్త…
తిరుపతి నగరపాలక సంస్థలో మంగళవారం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తి అయిపోయిన తర్వాత ఎందుకనో గానీ వైసీపీలో ఏడుపులు,…