Trends

15 గంటల వ్యవధిలో గాంధీలో కరోనా మరణాలు 35!

హైదరాబాద్ లో.. ఆ మాటకు వస్తే తెలంగాణలో కరోనా చికిత్సకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతి పెద్ద ఆసుపత్రి గాంధీ. దాదాపు పదిహేను వందల బెడ్లతో భారీగా ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం 305 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే.. కేవలం 15 గంటల వ్యవధిలో ఏకంగా 35 మంది మరణించిన దుస్థితి చోటు చేసుకుంది. సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటల మధ్యలో ఏకంగా ఇంత ఎక్కువగా మరణాలు చోటు చేసుకోవటం షాకింగ్ గా మారింది. ఈ విషయాన్ని ఒక ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది.

అయితే.. ఈ మరణాలకు గాంధీని.. అందులో పని చేసే వైద్యుల్ని బాధ్యుల్ని చేయటం తప్పే అవుతుంది. ఎందుకంటే.. హైదరాబాద్ మహానగరంలోని కార్పొరేటు ఆసుపత్రులు.. ఇతర ఆసుపత్రులతో పాటు.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న ఆసుపత్రుల్లో సీరియస్ గా ఉన్న కరోనా పేషెంట్లను ఆఖరి నిమిషాల్లో గాంధీకి తీసుకురావటంతో మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇందులో.. గాంధీ వైఫల్యం అని చెప్పటం మా ఉద్దేశం కాదు. కరోనా మరణాలు ఎంత ఎక్కువగా ఉన్నాయన్నది చెప్పాలన్నదే లక్ష్యం.

కరోనా తీవ్రత పెద్దగా లేదని.. ఒకవేళ పాజిటివ్ వచ్చినా.. పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదన్న వాదనల్ని నమ్మి.. పెద్దగా పట్టనట్లు తిరగటం.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుందన్నది మర్చిపోకూడదు. కరోనా కారణంగా ఇన్ని మరణాలు చోటు చేసుకుంటున్నా.. ప్రభుత్వం మాత్రం రోజుకు నాలుగైదు మరణాల్ని మాత్రమే చూపిస్తోంది. పదిహేను గంటల వ్యవధిలో మరణించిన 35 మందిలో 45 ఏళ్లు.. అంతకంటే తక్కువ వయస్కులు ఏకంగా తొమ్మిది మంది ఉండటం గమనార్హం. మిగిలిన వారంతా 46 ఏళ్ల నుంచి 83 ఏళ్ల మధ్యలోని వారు కావటం గమనార్హం.

మరణించిన 35 మందిలో 16 మంది మహిళలు కాగా.. 19 మంది పురుషులు. సాధారణంగా పాజిటివ్ లోనూ.. మరణాల్లోనూ పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకు భిన్నంగా.. తాజాగా మాత్రం పురుషులకు దగ్గరగా.. మహిళల మృతుల సంఖ్య రావటం ఆందోళన కలిగించేదే. సో.. కరోనా తీవ్రత ఎంత ఉందన్న విషయాన్ని అర్థం చేసుకొని అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.

This post was last modified on April 14, 2021 10:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దీదీను ఓ రేంజ్‌లో టెన్ష‌న్ పెట్టేస్తున్న బీజేపీ!

ప‌శ్చిమ బెంగాల్‌లో అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గ‌త మూడు సార్లుగా ఇక్క‌డ అధికారంలో ఉన్న దీదీ..…

3 hours ago

పవన్, ఫాన్స్ ఉన్నారు… హైప్ వస్తుందిలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…

5 hours ago

డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…

7 hours ago

40 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…

8 hours ago

టికెట్ రేట్ల పెంపు లేదు… అయినా హ్యాపీనే

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…

9 hours ago

SRH ఈ హెచ్చరికలు వినాల్సిందే..

'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…

11 hours ago