Trends

పెళ్లి చూపులకు వెళ్లి… ఆ యువతితో ఎస్కేప్… చివరికి..?

అందరిలాగే ఓ యువకుడు పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఆ యువకుడికి యువతి నచ్చింది. కానీ ఇరు కుటుంబాలకు కట్నకానుకల విషయంలో పరస్పరం బేధాభిప్రాయాలు రావటం వల్ల ఈ సంబంధం వద్దనుకున్నారు. కానీ ఆ యువతీ, యువకుడు ఒకరినొకరు ఇష్టపడటంతో వారిరువురు ఫోన్ నెంబర్లను మార్చుకొని తరుచు ఫోన్లలో మాట్లాడుతూ ఉండేవారు. ఎలాగైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అది కుదరదని తెలిసిన క్షణంలో వారిద్దరూ కలిసి హైదరాబాద్ వెళ్లి ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి వ్యవహారం ఇంతటితో ఆగిపోలేదు. వీరి పెళ్లి దాదాపు ఎనిమిది మందిని అరెస్ట్ చేసేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

నల్లగొండ జిల్లా బొమ్మల రామారం మండలం ఫక్కీర్ గూడకు చెందిన ఓ యువతికి, చౌటుప్పల్ మండలం లింగోజీగూడేనికి చెందిన ఆర్. సతీష్ కు పెళ్లి చూపులు జరిగాయి. కట్నకానుకల విషయంలో తేడాలు రావడంతో ఈ సంబంధం వద్దనుకున్నారు. అయితే ఆ యువతి యువకుడు ఒకరినొకరు ఇష్టపడటంతో మార్చి 30వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయి ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. అక్కడినుంచి సరాసరి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమకు రక్షణ కావాలని కోరారు. 

భువనగిరి పోలీస్ స్టేషన్ లో అప్పటికే ఆ యువతి పై మిస్సింగ్ కేసు నమోదు కాగా పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారిద్దరిని భువనగిరి పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే అమ్మాయి పోలీసులు కుటుంబ సభ్యుల ఎదుట మేమిద్దరం మేజర్లమని, సతీష్ ను నేను ప్రేమిస్తున్నాను అతనితోనే కలిసి ఉంటానని చెప్పడంతో పోలీసులు వారి కుటుంబ సభ్యులకు నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించారు.పోలీసులు వారిద్దరిని కారులో అబ్బాయి గ్రామానికి పంపిస్తున్నారనే విషయం తెలుసుకున్న వధువు కుటుంబ సభ్యులు 8 మంది దారిలో అడ్డంగా ఉండి విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా యువతిని వారి వెంట లాక్కెళ్లిపోయారు.దీంతో యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వారిని వెంబడించి ఆ ఎనిమిది మందిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.

This post was last modified on April 2, 2021 8:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

5 hours ago