కరోనాతో ప్రపంచం మొత్తం అల్లాడిపోతోంది. ఇంతలా ప్రపంచం మొత్తాన్ని కల్లోలానికి గురి చేసిన మరో జబ్బు ఉందా అంటే సందేహమే. వందల కోట్ల మంది ఉపాధి కోల్పోయాయి. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరెన్నో లక్షల మంది అస్వస్థతతో బాధ పడుతున్నారు. ఆర్థిక వ్యవస్థలు చిన్నా భిన్నమై ఆకలి కేకలకు దారి తీసే పరిస్థితి నెలకొంది. ఈ సంక్షోభ సమయంలో అభాగ్యులను ఆదుకునేందుకు ప్రపంచ బిలియనీర్లు చాలామంది ముందుకొచ్చారు. వందలు, వేల కోట్ల రూపాయల్ని వితరణ చేశారు.
అందరిలోకి ట్విట్టర్ సీఈవో జాక్ డార్సీ భూరి విరాళంతో ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అతను తన సంపదలో సగానికి సగం కరోనాపై పోరు కోసం కేటాయించాడు. ఆ మొత్తం బిలియన్ డాలర్లు కావడం విశేషం. అంటే.. మన రూపాయల్లో అయితే రూ.7600 కోట్ల దాకా అన్నమాట. ఈ మొత్తంతో తన ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు డార్సీ.
ఇక మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేర్లు ఒకడైన బిల్ గేట్స్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. భార్యతో కలిసి ఆయన 255 మిలియన్ డాలర్ల విరాళం ప్రకటించాడు. రూపాయ ల్లో చెప్పాలంటే ఆయన విరాళం దాదాపు రూ.2 వేల కోట్లు. ఆ తర్వాతి స్థానంలో నిలిచేది మన రతన్ టాటా. తన గ్రూప్తో కలిసి ఆయన రూ.1500 కోట్ల విరాళం అందజేశాడు.
మరో భారత కుబేరుడు అజీజ్ ప్రేమ్జీ రూ.1000 కోట్ల దాకా విరాళం అందజేశాడు. ఇక ప్రముఖ అమెరికన్ ఇన్వెస్టర్ జార్జ్ సొరాస్ కూడా ప్రేమ్ జీకి దీటుగా రూ.990 కోట్ల దాకా విరాళం అందజేశాడు. ఆస్ట్రేలియన్ వ్యాపారవేత్త ఆండ్రూ ఫారెస్ట్ 100 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు 760 కోట్లు అందజేశాడు. అమెరికాకు చెందిన కుబేరులు జెఫ్ స్కాల్, జెఫ్ బిజోస్, మైకేల్ డెల్ కూడా తలో వంద మిలియన్ డాలర్లతో తమ ఉదారతను చాటుకున్నారు. సామాజిక బాధ్యతను మరిచిపోకుండా భూరి విరాళాలు ప్రకటించిన ఈ కుబేరులందరినీ ప్రపంచం కీర్తిస్తోంది.
This post was last modified on May 10, 2020 3:19 pm
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…