Trends

అమ్మకానికి హైదరాబాద్ ఎయిపోర్టు.. కేంద్రం కీలక నిర్ణయం

రూ.2.5లక్షల కోట్లు కావాలి. భారీ నిధుల సమీకరణ కోసం ఆస్తుల్ని అమ్మేయటమే పనిగా పెట్టుకున్న మోడీ సర్కారు.. ఇప్పటికే ఎయిరిండియా.. బీఎస్ఎన్ఎల్.. వైజాగ్ స్టీల్ ను విక్రయించేందుకు సిద్ధం కావటం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ ఎయిర్ పోర్టుతో పాటు.. మరిన్ని ఎయిర్ పోర్టుల్ని అమ్మేయాలన్న ఆలోచనకు వచ్చేసినట్లుగా చెబుతున్నారు. తన వాటాలు అధికంగా ఉన్న నాలుగు ఎయిర్ పోర్టులను తాజాగా సేల్ కు పెట్టినట్లుగా తెలుస్తోంది.

కేంద్రానికి చెందిన ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా వాటాలు ఉన్న ఢిల్లీ.. ముంబయి.. బెంగళూరు.. హైదరాబాద్ విమానాశ్రయాల్ని ప్రైవేటీకరించాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో తన వాటాల్ని అమ్మటం ద్వారా రూ.2.5లక్షల కోట్ల నిధుల్ని సమీకరించే ప్రయత్నం చేస్తోంది.

విమానాశ్రయాల విషయానికి వస్తే.. ఇప్పటికే లక్నో.. అహ్మదాబాద్.. జైపూర్.. మంగళూరు.. తిరువనంతపురం.. గువాహటి ఎయిర్ పోర్టుల కాంట్రాక్ట్ లను అదానీ గ్రూపు దక్కించుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 13 ఎయిర్ పోర్టుల ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం గుర్తించింది. తాజాగా అమ్మాలని భావిస్తున్న నాలుగు ఎయిర్ పోర్టుల అమ్మకానికి సంబంధించిన ఫైల్ కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం వెళ్లనుంది.

దేశ వ్యాప్తంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వరంలో వందకుపైగా ఎయిర్ పోర్టులను నిర్వహిస్తున్నారు. ముంబయి ఎయిర్ పోర్టులో అదానీ గ్రూపునకు74 శాతం వాటా ఉంటే.. మిగిలిన 26 శాతం వాటా ఏఏఐ సొంతం. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం విషయానికి వస్తే జీఎంఆర్ గ్రూపునకు 54 శాతం వాటా ఉంటే.. ఏఏఐకి 26 శాతం ఉంది. హైదరాబాద్ ఎయిర్ పోర్టు విషయానికి వస్తే ఏఏఐకు.. రాష్ట్ర ప్రభుత్వానికి 26 శాతం వాటా ఉంది. బెంగళూరు పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. మరి.. ఈ ఎయిర్ పోర్టులను అమ్మాలన్న కేంద్రం నిర్ణయం రాజకీయ రగడకు తెర తీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Satya

Recent Posts

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

15 minutes ago

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

1 hour ago

జగన్.. బాలయ్య సాయం కోరిన వేళ..!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…

1 hour ago

డీఎస్సీపై గగ్గోలు… నీట్‌పై మౌనం..?

"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…

2 hours ago

వంద దేవుళ్ళు తల్లిది పెద్ద టాలెంటే

ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…

2 hours ago

వింటేజ్ హీరో నెక్స్ట్ ఏం చేయబోతున్నారో

కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…

5 hours ago