Trends

వివాదంలోకి జొమాటో.. ఆర్డర్ ఇచ్చిన మహిళ ఇంట్లోకి వెళ్లి పిడిగుద్దులు


అవసరమైన ఫుడ్ ను ఆన్ లైన్ లో ఆర్డర్ చేయటం.. ఆ వెంటనే ఇంటికి తీసుకొచ్చి డెలివరీ చేసే ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో మరోసారి వివాదంలో చిక్కుకుంది. తాజా ఉదంతంలో డెలివరీ బాయ్ మహిళపై దాడి చేసిన ఉదంతం షాకింగ్ గా మారింది. చిన్న విషయానికే రక్తం వచ్చేలా కొట్టటమే కాదు.. తీవ్ర గాయానికి పాల్పడిన అతడి తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ అసలేం జరిగిందన్నది చూస్తే..

బెంగళూరుకు చెందిన హితేషా మేకప్ ఆర్టిస్ట్ గా.. కంటెంట్ క్రియేటర్ గా పని చేస్తుంటారు. ఈ నెల తొమ్మిదిన మధ్యాహ్నం 3.30 గంటలకు ఫుడ్ కోసం ఆర్డర్ చేశారు. సాయంత్రం 4.30 గంటలకు డెలివరీ చేయాల్సి ఉంటే.. సమయానికి చేయలేదని.. దీంతో ఆర్డర్ ఆలస్యం కావటంపై కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడి క్యాన్సిల్ చేయాలని కోరారు.

అయితే.. అంతలోనే డెలివరీ బాయ్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాదన జరిగింది. దీంతో.. డెలివరీ బాయ్ తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు.. ఆమెపై దాడికి దిగాడు. ఇంట్లోకి బలవంతంగా చొచ్చుకొచ్చి ముఖంపై పిడిగుద్దులు గుద్దారు. అనంతరం తాను తెచ్చిన ఆర్డర్ ను తీసుకొని పారిపోయాడు.

తనకు ఎదురైన దారుణ ఉదంతం గురించి ఇన్ స్టాలో షేర్ చేసుకున్న ఆమె.. ఒక వీడియోను షేర్ చేశారు. జొమాటో సేవలు సురక్షితమేనా? అని ఆమె ప్రశ్నించారు. తనకు ఎదురైన దారుణ ఉదంతం గురించి వెల్లడించి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

This post was last modified on March 10, 2021 7:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేసు గుర్రం కొంచెం తొందరపడిందేమో

ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…

1 minute ago

కేరళ – తెలంగాణ మధ్య నిప్పు రాజుకుంది

కేర‌ళ రాష్ట్రంలో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో  కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫు స్టార్ క్యాంపెయిన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…

37 minutes ago

రొటీన్ ‘లీడర్’తో ఏం సాధించారు

2022 లెజెండ్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన తమిళ వ్యాపారవేత్త శరవణన్ ని మూవీ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు.…

1 hour ago

వీరభద్రుడా… మంచి పని చేశావ్ !

తమిళ మలయాళ టైటిల్స్ ని ఒరిజినల్ పేర్లతో పెట్టడం సినిమాల ఓపెనింగ్స్, బజ్ మీద ఎంత ప్రభావం చూపిస్తోందో నిర్మాతలు…

1 hour ago

అగ్నికి ఆజ్యం పోసిన అంబటి

ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే కూటమి సర్కారు తీసుకున్న చర్యలు విపక్ష వైసీపీని ఓ రేంజిలో కలవరపాటుకు గురి చేశాయని చెప్పక తప్పదు.…

3 hours ago

సింపుల్ కథలు వద్దంటున్న సుప్రీమ్ హీరో

మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు ఇప్పటికీ విడుదల తేదీ ఖరారు…

3 hours ago