అవసరమైన ఫుడ్ ను ఆన్ లైన్ లో ఆర్డర్ చేయటం.. ఆ వెంటనే ఇంటికి తీసుకొచ్చి డెలివరీ చేసే ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో మరోసారి వివాదంలో చిక్కుకుంది. తాజా ఉదంతంలో డెలివరీ బాయ్ మహిళపై దాడి చేసిన ఉదంతం షాకింగ్ గా మారింది. చిన్న విషయానికే రక్తం వచ్చేలా కొట్టటమే కాదు.. తీవ్ర గాయానికి పాల్పడిన అతడి తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ అసలేం జరిగిందన్నది చూస్తే..
బెంగళూరుకు చెందిన హితేషా మేకప్ ఆర్టిస్ట్ గా.. కంటెంట్ క్రియేటర్ గా పని చేస్తుంటారు. ఈ నెల తొమ్మిదిన మధ్యాహ్నం 3.30 గంటలకు ఫుడ్ కోసం ఆర్డర్ చేశారు. సాయంత్రం 4.30 గంటలకు డెలివరీ చేయాల్సి ఉంటే.. సమయానికి చేయలేదని.. దీంతో ఆర్డర్ ఆలస్యం కావటంపై కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడి క్యాన్సిల్ చేయాలని కోరారు.
అయితే.. అంతలోనే డెలివరీ బాయ్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాదన జరిగింది. దీంతో.. డెలివరీ బాయ్ తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు.. ఆమెపై దాడికి దిగాడు. ఇంట్లోకి బలవంతంగా చొచ్చుకొచ్చి ముఖంపై పిడిగుద్దులు గుద్దారు. అనంతరం తాను తెచ్చిన ఆర్డర్ ను తీసుకొని పారిపోయాడు.
తనకు ఎదురైన దారుణ ఉదంతం గురించి ఇన్ స్టాలో షేర్ చేసుకున్న ఆమె.. ఒక వీడియోను షేర్ చేశారు. జొమాటో సేవలు సురక్షితమేనా? అని ఆమె ప్రశ్నించారు. తనకు ఎదురైన దారుణ ఉదంతం గురించి వెల్లడించి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
This post was last modified on March 10, 2021 7:10 pm
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో జనంతో పెద్దగా కలిసిందే లేదు.…
కొవిడ్ వల్ల సినీ పరిశ్రమలు ఎలా కుదేలయ్యాయో తెలిసిందే. కానీ ఆ టైంలో మలయాళ ఇండస్ట్రీ సైతం ఇబ్బంది పడింది…
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్..టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుల మద్య స్నేహబంధం ఇప్పటిది కాదు. ఎప్పుడో చంద్రబాబు…