అవసరమైన ఫుడ్ ను ఆన్ లైన్ లో ఆర్డర్ చేయటం.. ఆ వెంటనే ఇంటికి తీసుకొచ్చి డెలివరీ చేసే ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో మరోసారి వివాదంలో చిక్కుకుంది. తాజా ఉదంతంలో డెలివరీ బాయ్ మహిళపై దాడి చేసిన ఉదంతం షాకింగ్ గా మారింది. చిన్న విషయానికే రక్తం వచ్చేలా కొట్టటమే కాదు.. తీవ్ర గాయానికి పాల్పడిన అతడి తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ అసలేం జరిగిందన్నది చూస్తే..
బెంగళూరుకు చెందిన హితేషా మేకప్ ఆర్టిస్ట్ గా.. కంటెంట్ క్రియేటర్ గా పని చేస్తుంటారు. ఈ నెల తొమ్మిదిన మధ్యాహ్నం 3.30 గంటలకు ఫుడ్ కోసం ఆర్డర్ చేశారు. సాయంత్రం 4.30 గంటలకు డెలివరీ చేయాల్సి ఉంటే.. సమయానికి చేయలేదని.. దీంతో ఆర్డర్ ఆలస్యం కావటంపై కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడి క్యాన్సిల్ చేయాలని కోరారు.
అయితే.. అంతలోనే డెలివరీ బాయ్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వాదన జరిగింది. దీంతో.. డెలివరీ బాయ్ తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు.. ఆమెపై దాడికి దిగాడు. ఇంట్లోకి బలవంతంగా చొచ్చుకొచ్చి ముఖంపై పిడిగుద్దులు గుద్దారు. అనంతరం తాను తెచ్చిన ఆర్డర్ ను తీసుకొని పారిపోయాడు.
తనకు ఎదురైన దారుణ ఉదంతం గురించి ఇన్ స్టాలో షేర్ చేసుకున్న ఆమె.. ఒక వీడియోను షేర్ చేశారు. జొమాటో సేవలు సురక్షితమేనా? అని ఆమె ప్రశ్నించారు. తనకు ఎదురైన దారుణ ఉదంతం గురించి వెల్లడించి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
This post was last modified on March 10, 2021 7:10 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…