Trends

మూడు బ్యాంకుల ముచ్చ‌ట‌.. అమ్మ‌కానికి రెడీ!

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం.. ఇటీవ‌ల కాలంలో బ్యాంకుల‌ను విలీనం చేయ‌డం లేదా.. అమ్మేయ‌డం వంటి చ‌ర్య‌ల‌ను వ‌డివ‌డిగా చేప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల యూనియ‌న్ బ్యాంకులోకి ఆంధ్రాబ్యాంకుతో పాటు.. కార్పొరేష‌న్ బ్యాంకును విలీనం చేసిన విష‌యం తెలిసింది. ఇక‌, ఇప్పుడు.. మ‌రో మూడు బ్యాంకుల‌ను అందునా.. ప్ర‌ముఖ బ్యాంకుల‌ను అమ్మ‌కానికి రెడీ చేయ‌డం సంచల‌నంగా మారింది. ప్రైవేటీకరించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రాథమికంగా నాలుగు మధ్యస్థాయి బ్యాంకులను ఎంపిక చేసినట్టు సమాచారం.

ఉద్యోగుల సంఖ్య ఆధారంగా ఈ ఎంపిక జరిగినట్టు తెలుస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ జాబితాలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. వీటిలో ఒక దానిని మిన‌హాయించే అవ‌కాశం ఉంది. దీంతో ఎట్టి ప‌రిస్థితిలోనూ మూడు బ్యాంకుల‌ను మాత్రం ఖ‌చ్చితంగా విక్ర‌యిస్తార‌ని తెలుస్తోంది. ఇక‌, ఉద్యోగుల సంఖ్య‌ను బ‌ట్టి అమ్ముతామ‌ని అంటున్నా.. నిర‌ర్ధ‌క ఆస్తులు పేరుకుపోయిన‌.. బ్యాంకుల‌ను విక్ర‌యిస్తార‌ని తెలుస్తోంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 50 వేలు. సెంట్రల్ బ్యాంకులో 33 వేలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 26 వేలు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 13 వేల మంది చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. ఈ విషయమై మరింత లోతుగా అధ్యయనం చేసి, ఈ నాలుగింటి లోంచి ఏదైనా రెండు లేదా మూడు బ్యాంకులను కేంద్రం ఎంచుకుని అమ్మకానికి పెట్టనుంది. అయితే.. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం ఐదు లేదా ఆరు నెలల పట్టవచ్చనేది అంచనా. ఇప్ప‌టికే.. ప్ర‌భుత్వ పారిశ్రామిక సంస్థ‌ల‌ను అమ్మ‌కానికి పెట్టిన మోడీ.. ఇప్పుడు బ్యాంకుల‌ను కూడా టోకున అమ్మేయ‌నున్నార‌న్న వార్త చ‌ర్చ‌కు దారితీసింది.

This post was last modified on February 16, 2021 11:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

18 minutes ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

1 hour ago

నా పేరెంట్స్ మీటింగ్ కోసం మా నాన్న ఎప్పుడూ రాలేదు – లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

2 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

2 hours ago

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…

3 hours ago