Trends

మూడు బ్యాంకుల ముచ్చ‌ట‌.. అమ్మ‌కానికి రెడీ!

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం.. ఇటీవ‌ల కాలంలో బ్యాంకుల‌ను విలీనం చేయ‌డం లేదా.. అమ్మేయ‌డం వంటి చ‌ర్య‌ల‌ను వ‌డివ‌డిగా చేప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల యూనియ‌న్ బ్యాంకులోకి ఆంధ్రాబ్యాంకుతో పాటు.. కార్పొరేష‌న్ బ్యాంకును విలీనం చేసిన విష‌యం తెలిసింది. ఇక‌, ఇప్పుడు.. మ‌రో మూడు బ్యాంకుల‌ను అందునా.. ప్ర‌ముఖ బ్యాంకుల‌ను అమ్మ‌కానికి రెడీ చేయ‌డం సంచల‌నంగా మారింది. ప్రైవేటీకరించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రాథమికంగా నాలుగు మధ్యస్థాయి బ్యాంకులను ఎంపిక చేసినట్టు సమాచారం.

ఉద్యోగుల సంఖ్య ఆధారంగా ఈ ఎంపిక జరిగినట్టు తెలుస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ జాబితాలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. వీటిలో ఒక దానిని మిన‌హాయించే అవ‌కాశం ఉంది. దీంతో ఎట్టి ప‌రిస్థితిలోనూ మూడు బ్యాంకుల‌ను మాత్రం ఖ‌చ్చితంగా విక్ర‌యిస్తార‌ని తెలుస్తోంది. ఇక‌, ఉద్యోగుల సంఖ్య‌ను బ‌ట్టి అమ్ముతామ‌ని అంటున్నా.. నిర‌ర్ధ‌క ఆస్తులు పేరుకుపోయిన‌.. బ్యాంకుల‌ను విక్ర‌యిస్తార‌ని తెలుస్తోంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 50 వేలు. సెంట్రల్ బ్యాంకులో 33 వేలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 26 వేలు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 13 వేల మంది చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. ఈ విషయమై మరింత లోతుగా అధ్యయనం చేసి, ఈ నాలుగింటి లోంచి ఏదైనా రెండు లేదా మూడు బ్యాంకులను కేంద్రం ఎంచుకుని అమ్మకానికి పెట్టనుంది. అయితే.. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం ఐదు లేదా ఆరు నెలల పట్టవచ్చనేది అంచనా. ఇప్ప‌టికే.. ప్ర‌భుత్వ పారిశ్రామిక సంస్థ‌ల‌ను అమ్మ‌కానికి పెట్టిన మోడీ.. ఇప్పుడు బ్యాంకుల‌ను కూడా టోకున అమ్మేయ‌నున్నార‌న్న వార్త చ‌ర్చ‌కు దారితీసింది.

This post was last modified on February 16, 2021 11:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సింహాన్ని దాచకుండా మంచి పని చేశారు

మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…

3 minutes ago

చరణ్ యష్ అనుకుంటే సత్యదేవ్ వస్తున్నాడు

వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…

40 minutes ago

సాయిపల్లవికి ‘ఒక రోజు’ షాక్ ఇస్తుందా

చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…

3 hours ago

టీడీపీ మహిళా ఎమ్మెల్యే పీఏగా ట్రాన్స్ జెండర్..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…

4 hours ago

జేడీ వదులుకున్న కల్ట్ బ్లాక్‌బస్టర్

ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…

5 hours ago

దేవి 2… రాజుగారికి పెద్ద ఛాలెంజ్

ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…

5 hours ago