Trends

మూడు బ్యాంకుల ముచ్చ‌ట‌.. అమ్మ‌కానికి రెడీ!

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం.. ఇటీవ‌ల కాలంలో బ్యాంకుల‌ను విలీనం చేయ‌డం లేదా.. అమ్మేయ‌డం వంటి చ‌ర్య‌ల‌ను వ‌డివ‌డిగా చేప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల యూనియ‌న్ బ్యాంకులోకి ఆంధ్రాబ్యాంకుతో పాటు.. కార్పొరేష‌న్ బ్యాంకును విలీనం చేసిన విష‌యం తెలిసింది. ఇక‌, ఇప్పుడు.. మ‌రో మూడు బ్యాంకుల‌ను అందునా.. ప్ర‌ముఖ బ్యాంకుల‌ను అమ్మ‌కానికి రెడీ చేయ‌డం సంచల‌నంగా మారింది. ప్రైవేటీకరించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రాథమికంగా నాలుగు మధ్యస్థాయి బ్యాంకులను ఎంపిక చేసినట్టు సమాచారం.

ఉద్యోగుల సంఖ్య ఆధారంగా ఈ ఎంపిక జరిగినట్టు తెలుస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ జాబితాలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. వీటిలో ఒక దానిని మిన‌హాయించే అవ‌కాశం ఉంది. దీంతో ఎట్టి ప‌రిస్థితిలోనూ మూడు బ్యాంకుల‌ను మాత్రం ఖ‌చ్చితంగా విక్ర‌యిస్తార‌ని తెలుస్తోంది. ఇక‌, ఉద్యోగుల సంఖ్య‌ను బ‌ట్టి అమ్ముతామ‌ని అంటున్నా.. నిర‌ర్ధ‌క ఆస్తులు పేరుకుపోయిన‌.. బ్యాంకుల‌ను విక్ర‌యిస్తార‌ని తెలుస్తోంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 50 వేలు. సెంట్రల్ బ్యాంకులో 33 వేలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 26 వేలు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 13 వేల మంది చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. ఈ విషయమై మరింత లోతుగా అధ్యయనం చేసి, ఈ నాలుగింటి లోంచి ఏదైనా రెండు లేదా మూడు బ్యాంకులను కేంద్రం ఎంచుకుని అమ్మకానికి పెట్టనుంది. అయితే.. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం ఐదు లేదా ఆరు నెలల పట్టవచ్చనేది అంచనా. ఇప్ప‌టికే.. ప్ర‌భుత్వ పారిశ్రామిక సంస్థ‌ల‌ను అమ్మ‌కానికి పెట్టిన మోడీ.. ఇప్పుడు బ్యాంకుల‌ను కూడా టోకున అమ్మేయ‌నున్నార‌న్న వార్త చ‌ర్చ‌కు దారితీసింది.

This post was last modified on February 16, 2021 11:44 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

7 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

8 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

8 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

8 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

8 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

9 hours ago