విరాట్ కోహ్లి.. ఈ తరంలో అత్యుత్తమ బ్యాట్స్మన్గా దిగ్గజాలతో కితాబులందుకున్న ఆటగాడు. టెస్టుల్లో అతడికి స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్ గట్టి పోటీ ఇచ్చినా.. కొన్ని సమయాల్లో అతణ్ని మించి ఆ ముగ్గురూ ఫామ్ చాటుకున్నా.. అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణించే ఆటగాడిగా.. ఎంతకీ పరుగుల దాహం తీరని అరుదైన బ్యాట్స్మన్గా.. వేరెవరికీ సాధ్యం కాని రికార్డులు బద్దలు కొట్టే ఆటగాడిగా అతడికున్న పేరు, గుర్తింపే వేరు. భారత క్రికెట్లో సచిన్ను మించిన బ్యాట్స్మన్ రాడని అంతా అనుకున్నారు కానీ.. మాస్టర్ సాధించిన ఎన్నో రికార్డులను అలవోకగా దాటేసి ఔరా అనిపించాడు కోహ్లి.
గొప్ప ఆటగాళ్లలో చాలామందికి ఒక ప్రైమ్ టైమ్ నడుస్తుంది. అది రెండు మూడు లేదా నాలుగేళ్లు నడుస్తుంది. కానీ కోహ్లి దశాబ్దం పాటు తన ప్రైమ్ టైమ్ను కొనసాగిస్తూ వచ్చాడు. ఇదే అతడి అత్యుత్తమ స్థాయి అనుకున్నపుడల్లా ఆ అంచనాల్ని మించి పరుగుల వరద పారిస్తూ ఆశ్చర్యపరిచాడు. 2018-19 సీజన్లో అతడి ఫామ్ చూసి అతడి దాహానికి అంతెక్కడ అని ఆశ్చర్యపోయారు విశ్లేషకులు.
సమీప భవిష్యత్తులో అతను జోరు తగ్గించేలా కనిపించలేదు. కానీ 2020 కోహ్లి కథను మార్చేసింది. కెరీర్ ఆరంభంలో ఒక్క ఏడాది తప్ప అతను సెంచరీ చేయకుండా ఏడాదిని ముగించిందే లేదు. ఇంకెప్పుడూ అలాంటి ఏడాది ఇంకొకటి వస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ నిరుడు అతను ఏ ఫార్మాట్లోనూ రెండంకెల స్కోరు చేయలేదు. కరోనా కారణంగా జరిగిన మ్యాచ్లు తక్కువే కానీ.. అయినా కూడా కోహ్లి ఏ ఫార్మాట్లోనూ సెంచరీ చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే కొత్త ఏడాదిలో విరాట్ ఆట మారుతుందని, అతను మళ్లీ విశ్వరూపం చూపిస్తాడని అభిమానులు ఆశించారు. కానీ ఈ ఏడాది కూడా విరాట్ తన స్థాయికి ఏమాత్రం తగని ప్రదర్శన చేస్తున్నాడు.
చెన్నైలో తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్లో విఫలమైన విరాట్.. రెండో ఇన్నింగ్స్లో 70 ప్లస్ స్కోరుతో ఫామ్ అందుకున్నట్లు కనిపించాడు. కానీ ఆ ఇన్నింగ్స్ జట్టుకు ఉపయోగపడలేదు. ఆ మ్యాచ్లో భారత్ చిత్తుగా ఓడింది. రెండో టెస్టులో దెబ్బకు దెబ్బ తీయకుంటే పరువు పోయే స్థితిలో విరాట్ కసిగా ఆడతాడనుకుంటే ఖాతా కూడా తెరవకుండానే ఔటై వెనుదిరిగాడు. పార్ట్ టైం స్పిన్నర్ అయిన మొయిన్ అలీ అతణ్ని బౌల్డ్ చేసి షాకిచ్చాడు. అతను ఔటైన తీరు చూస్తే ఆత్మవిశ్వాస లోపం స్పష్టంగా కనిపించింది. ఇది చూసి కోహ్లి ప్రైమ్ టైమ్ అయిపోయిందా.. ఇక అతడి పతనం చూడబోతున్నామా అన్న సందేహాలు బలంగా కలుగుతున్నాయి.
This post was last modified on February 13, 2021 10:22 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…