కరోనాకు వ్యాక్సిన్ ప్రయోగాల్లో ప్రపంచ దేశాలతో గట్టిగానే పోటీ పడింది ఇండియా. మేడిన్ ఇండియా వ్యాక్సిన్ల దిశగా జోరుగానే ప్రయోగాలు సాగాయి. భారత్ బయోటెక్తో పాటు సీరం ఇన్స్టిట్యూట్ ఇండియాలో భారీ ఎత్తున వ్యాక్సిన్ ప్రయోగాలు చేశాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యాక్సిన్ డోస్లు ఉత్పత్తి చేశాయి. ఇటీవలే ఇండియాలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రాంల్లో ఒకటిగా దీన్ని పేర్కొంటున్నారు.
ఏడాది వ్యవధిలో 25 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది భారత్. ఇందుకోసం భారీ ఎత్తున వ్యాక్సిన్ల ఉత్పత్తి జరుగుతోంది. కాగా దౌత్య విధానంలో భాగంగా ఇండియా.. పొరుగున ఉన్న ఆరు దేశాలకు లక్షల డోస్ల వ్యాక్సిన్లు ఎగుమతి చేస్తుండటం విశేషం. ఆయా దేశాల విజ్ఞప్తుల మేరకే భారత్ ఈ దిశగా ఏర్పాట్లు చేసింది.
ముందుగా మాల్దీవులకు కోవిషీల్డ్ (సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి) వ్యాక్సిన్ లక్ష డోస్లు పంపేందుకు భారత్ సిద్ధమైంది. వ్యాక్సిన్ డోస్లను ఐస్ బాక్సుల్లో పెట్టి మాల్దీవులకు పంపారు. మైనస్ 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉండేలా ఐస్ బాక్సుల్లో పెట్టి మాల్దీవులకు విమానాల్లో వ్యాక్సిన్ల డోస్లు పంపారు. మాల్దీవులతో పాటు భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సీసెల్స్ దేశాలకు కూడా వ్యాక్సిన్ను అందిస్తున్నామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. బంగ్లాదేశ్కు ఏకంగా 20 లక్షల డోస్లు పంపనున్నారట.
శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మారిషస్ దేశాల్లో వ్యాక్సిన్కు రెగ్యులేటరీ క్లియరెన్స్ రావాల్సి ఉంది. ఆమోదం లభించిన వెంటనే ఆ దేశాలకు కూడా వ్యాక్సిన్ను ఎగుమతి చేస్తామని ఆ శాఖ తెలిపింది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో తయారైన ప్రముఖ వ్యాక్సిన్లన్నింటిలో అత్యంత చౌకైన, నాణ్యమైన వాటిలో ఒకటిగా ‘కోవిషీల్డ్’ ఖ్యాతి పొందింది. ఇండియాలో కూడా ప్రస్తుతం ఎక్కువగా జనాలకు ఇస్తున్నది ఈ వ్యాక్సినే.
This post was last modified on January 23, 2021 10:19 am
అల్లు అర్జున్కు కెరీర్లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా.. ఆర్య. అదో అందమైన ప్రేమకథ. ఈ చిత్రంతోనే అతను స్టార్…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన కుల గణన, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి…
మాములుగా స్టార్ వారసులంటే జనంలో పిచ్చ క్రేజ్ ఉంటుంది. తాము అభిమానించే హీరోల పిల్లలు తెరమీద ఎలా కనిపిస్తారనే ఉత్సహంతో…
జగన్ హయాంలో తిరుపతి, తిరుమల ప్రతిష్ట మసకబారిందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో అవకతవకలు జరిగాయని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన…
ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…
దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…