ప్రపంచానికి కొత్త కుబేరుడొచ్చాడు. ఇప్పటిదాకా అమేజాన్ వ్యవస్థాపకుడు జాక్ బిజోస్ ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా కొనసాగుతుండగా.. ఇప్పుడు ఆయన స్థానంలోకి ఎలాన్ మస్క్ వచ్చాడు. ఒక్క రోజులో ఆయన సంపద అమాంతం పెరిగింది. టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల అధినేత అయిన ఎలాన్ మస్క్కు గురువారం షేర్ మార్కెట్ గొప్పగా కలిసొచ్చింది. ఒకేసారి ఆయన నేతృత్వంలోని ఎలక్ట్రానిక్ కార్ కంపెనీ టెస్లా షేర్ విలువ 4.8 శాతం పెరిగింది. మస్క్ మొత్తం సంపద ఏకంగా 188.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఈ మొత్తం రూపాయల్లో అక్షరాలా 13.85 లక్షల కోట్లు కావడం విశేషం. గురువారం పెరిగిన షేర్ల విలువతో బిజోస్ కంటే మస్క్ సంపద 1.5 బిలియన్ డాలర్లు (రూ.11 వేల కోట్లు) ఎక్కువ అయింది. దీంతో మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా అవతరించాడు.
బిజోయ్ 2017 అక్టోబరు నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా కొనసాగుతున్నాడు. అప్పట్నుంచి ఆయనకు ఎదురు లేదు. ఐతే గత ఏడాది కాలంలో మస్క్ సంపద అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడే ఏకంగా బిజోస్ను అధిగమించి ప్రపంచ కొత్త కుబేరుడిగా అవతరించాడు. గత 12 నెలల్లో మస్క్ సంపద 150 బిలియన్లు (రూ.1.1 లక్షల కోట్లు) పెరగడం విశేషం.
ఇప్పటిదాకా ప్రపంచ చరిత్రలోనే ఏ కుబేరుడూ ఏడాది వ్యవధిలో ఇంత సంపదను ఆర్జించలేదు. ఆయన కంపెనీ టెస్లా షేర్ విలువ ఏకంగా 743 శాతం పెరగడం విశేషం. 49 ఏళ్ల ఎలాన్ మస్క్.. దక్షిణాఫ్రికాలో పుట్టి అమెరికాలో పారిశ్రామిక వేత్తగా ఎదిగాడు.
This post was last modified on January 8, 2021 10:17 am
బాక్సాఫీస్ వద్ద కరుప్పు / వీరభద్రుడు జోరు బాగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో రికార్డులు రాసే దిశగా పరుగులు పెడుతోంది.…
హఠాత్తుగా పెద్ది సినారియో మారిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ది గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారనుకుంటే దానికి భిన్నంగా…
మంచు మనోజ్.. కొన్నేళ్ల ముందు భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అది అతడికి రెండో పెళ్లి. మరోవైపు…
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్లోని గదికి…
రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పదవిపై మోజులేదు. నేనే చెప్పి ఒప్పించా. వచ్చే ఎన్నికల్లోనే రాహుల్ ను ప్రదానిని చేసేందుకు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఘన విజయం సాధించింది. ఫలితంగా సినిమాల్లో…