Trends

సురేష్ రైనా అరెస్టు


భారత సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా ఈ మధ్య క్రికెటేతర విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నాడు. యూఏఈలో ఐపీఎల్ ఆరంభానికి ముందు అతను వ్యక్తిగత కారణాలు చెప్పి అనూహ్యంగా టోర్నీ నుంచి తప్పుకుని స్వదేశానికి వచ్చేయడం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఇప్పుడు అతను ఒక క్లబ్బులో నిబంధనలకు విరుద్ధంగా పార్టీ చేసుకుని పోలీస్ స్టేషన్ గడప తొక్కాడు. సోమవారం రాత్రి అతణ్ని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్టయిన వారిలో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానె ఖాన్, సింగర్ గురు రందవా లాంటి ప్రముఖులూ ఉన్నారు. బ్రిటన్ సహా చాలా ఐరోపా దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇండియాలో మళ్లీ వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలను కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండియాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న మహారాష్ట్రలో ఆంక్షలు పెట్టారు.

ఐతే నిబంధనలకు విరుద్ధంగా ముంబయిలోని క్లబ్బులు వ్యవహరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నగర వ్యాప్తంగా రైడ్స్ చేశారు. డ్రాగన్ ఫ్లై అనే క్లబ్బులో రైనా, సుసానె, గురు సహా చాలామంది ప్రముఖులు కరోనా నిబంధనలకు విరుద్ధంగా పార్టీలు చేసుకుంటుండటంతో ఆ క్లబ్‌ను సీజ్ చేసి మొత్తం 35 మందిని అరెస్టు చేశారు. అందులో సెలబ్రెటీలకు తోడు క్లబ్ నిర్వాహకులు, సిబ్బంది ఉన్నారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఐతే రైనా, సుసానె, గురు తదితరులను కాసేపటికే బెయిల్ మీద విడుదల చేశారు.

రైనాకు పార్టీలంటే చాలా ఇష్టమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్‌లో నివాసముండే రైనా.. ఇలా ముంబయికి వచ్చి సుసానె తదితరులతో పార్టీ చేసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. రైనా ఏడాదికి పైగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అతడికి భారత జట్టులో చోటు పోయి చాలా కాలమైంది. దేశవాళీల్లో కూడా పెద్దగా ఆడట్లేదు. కరోనా విరామం తర్వాత ఐపీఎల్ ఆడదామనుకుంటే అనూహ్యంగా దాన్నుంచి తప్పుకుని స్వదేశానికి వచ్చేయాల్సి వచ్చింది. త్వరలోనే అతను ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో యూపీ తరఫున ఆడే అవకాశాలున్నాయి.

This post was last modified on December 22, 2020 2:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

12 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago