భారత సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా ఈ మధ్య క్రికెటేతర విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నాడు. యూఏఈలో ఐపీఎల్ ఆరంభానికి ముందు అతను వ్యక్తిగత కారణాలు చెప్పి అనూహ్యంగా టోర్నీ నుంచి తప్పుకుని స్వదేశానికి వచ్చేయడం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఇప్పుడు అతను ఒక క్లబ్బులో నిబంధనలకు విరుద్ధంగా పార్టీ చేసుకుని పోలీస్ స్టేషన్ గడప తొక్కాడు. సోమవారం రాత్రి అతణ్ని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్టయిన వారిలో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానె ఖాన్, సింగర్ గురు రందవా లాంటి ప్రముఖులూ ఉన్నారు. బ్రిటన్ సహా చాలా ఐరోపా దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇండియాలో మళ్లీ వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలను కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండియాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న మహారాష్ట్రలో ఆంక్షలు పెట్టారు.
ఐతే నిబంధనలకు విరుద్ధంగా ముంబయిలోని క్లబ్బులు వ్యవహరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నగర వ్యాప్తంగా రైడ్స్ చేశారు. డ్రాగన్ ఫ్లై అనే క్లబ్బులో రైనా, సుసానె, గురు సహా చాలామంది ప్రముఖులు కరోనా నిబంధనలకు విరుద్ధంగా పార్టీలు చేసుకుంటుండటంతో ఆ క్లబ్ను సీజ్ చేసి మొత్తం 35 మందిని అరెస్టు చేశారు. అందులో సెలబ్రెటీలకు తోడు క్లబ్ నిర్వాహకులు, సిబ్బంది ఉన్నారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఐతే రైనా, సుసానె, గురు తదితరులను కాసేపటికే బెయిల్ మీద విడుదల చేశారు.
రైనాకు పార్టీలంటే చాలా ఇష్టమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్లో నివాసముండే రైనా.. ఇలా ముంబయికి వచ్చి సుసానె తదితరులతో పార్టీ చేసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. రైనా ఏడాదికి పైగా క్రికెట్కు దూరంగా ఉన్నాడు. అతడికి భారత జట్టులో చోటు పోయి చాలా కాలమైంది. దేశవాళీల్లో కూడా పెద్దగా ఆడట్లేదు. కరోనా విరామం తర్వాత ఐపీఎల్ ఆడదామనుకుంటే అనూహ్యంగా దాన్నుంచి తప్పుకుని స్వదేశానికి వచ్చేయాల్సి వచ్చింది. త్వరలోనే అతను ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో యూపీ తరఫున ఆడే అవకాశాలున్నాయి.
This post was last modified on December 22, 2020 2:43 pm
కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్లో…
ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్…
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…