టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అతని చివరి మ్యాచ్ అయ్యేలా ఉంది. అద్భుతమైన ఫామ్ లో ఉన్నా టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయాలు చూస్తుంటే అతనికి మళ్ళీ అవకాశం రావడం కష్టమే అనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్లకు ఇచ్చిన ప్రాధాన్యత షమీకి దక్కడం లేదు.
ముఖ్యంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కి షమీకి మధ్య జరిగిన మాటల యుద్ధం ఈ వివాదాన్ని మరింత పెంచింది. షమీ ఫిట్నెస్ మీద అగార్కర్ అనుమానం వ్యక్తం చేయగా తన ఫిట్నెస్ అప్డేట్స్ ఇవ్వడం తన పని కాదని షమీ ఫైర్ అయ్యాడు. ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కారణంగానే అతన్ని పక్కన పెట్టారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక సీనియర్ ప్లేయర్ కి కనీసం తన పరిస్థితి ఏంటో చెప్పకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
నిజానికి షమీ ఫిట్నెస్ విషయంలో సెలెక్టర్ల వాదనలో పస లేదని అతని రికార్డులే చెబుతున్నాయి. గతేడాది ఆగస్టు నుండి డొమెస్టిక్ క్రికెట్లో 19 మ్యాచులాడి ఏకంగా 52 వికెట్లు తీశాడు. రంజీ ట్రోఫీలో అత్యధిక ఓవర్లు బౌలింగ్ చేసి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో 15 వికెట్లు తీసి తన మునుపటి వాడి తగ్గలేదని చాటిచెప్పాడు.
టీమ్ మేనేజ్మెంట్ ఇప్పుడు యంగ్ జనరేషన్ వైపు చూస్తోంది. హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ లాంటి యువ పేసర్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తోంది. బుమ్రా పక్కన షమీ లాంటి అనుభవజ్ఞుడు ఉంటే బాగుంటుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నా బీసీసీఐ మాత్రం కొత్త రక్తానికి ప్రాధాన్యత ఇస్తోంది. దీనివల్ల షమీకి టీమ్ ఇండియా దారులు మూసుకుపోతున్నాయి.
460కి పైగా ఇంటర్నేషనల్ వికెట్లు తీసిన లెజెండ్కు గౌరవప్రదమైన వీడ్కోలు దక్కడం కనీస ధర్మం. 2023 వరల్డ్ కప్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ను ఇలా సైలెంట్ గా పక్కన పెట్టడం ఫ్యాన్స్కు నచ్చడం లేదు. మరి షమీ మళ్ళీ బంతి పట్టుకుంటాడా లేక తన కెరీర్కు మౌనంగానే ఫుల్ స్టాప్ పడుతుందా అన్నది సెలెక్టర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంది.
టాలీవుడ్ నుంచి మరో మెగా మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చింది. కొన్నేళ్ల నుంచి చర్చల్లో ఉన్న గాడ్ ఆఫ్ వార్…
జనసేన పార్టీని పుంజుకునేలా చేయాలన్నది పార్టీ అధిపతి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన. అందుకే ఆయన తరచుగా కమిటీలు…
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…