టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అతని చివరి మ్యాచ్ అయ్యేలా ఉంది. అద్భుతమైన ఫామ్ లో ఉన్నా టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయాలు చూస్తుంటే అతనికి మళ్ళీ అవకాశం రావడం కష్టమే అనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్లకు ఇచ్చిన ప్రాధాన్యత షమీకి దక్కడం లేదు.
ముఖ్యంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కి షమీకి మధ్య జరిగిన మాటల యుద్ధం ఈ వివాదాన్ని మరింత పెంచింది. షమీ ఫిట్నెస్ మీద అగార్కర్ అనుమానం వ్యక్తం చేయగా తన ఫిట్నెస్ అప్డేట్స్ ఇవ్వడం తన పని కాదని షమీ ఫైర్ అయ్యాడు. ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కారణంగానే అతన్ని పక్కన పెట్టారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక సీనియర్ ప్లేయర్ కి కనీసం తన పరిస్థితి ఏంటో చెప్పకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
నిజానికి షమీ ఫిట్నెస్ విషయంలో సెలెక్టర్ల వాదనలో పస లేదని అతని రికార్డులే చెబుతున్నాయి. గతేడాది ఆగస్టు నుండి డొమెస్టిక్ క్రికెట్లో 19 మ్యాచులాడి ఏకంగా 52 వికెట్లు తీశాడు. రంజీ ట్రోఫీలో అత్యధిక ఓవర్లు బౌలింగ్ చేసి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో 15 వికెట్లు తీసి తన మునుపటి వాడి తగ్గలేదని చాటిచెప్పాడు.
టీమ్ మేనేజ్మెంట్ ఇప్పుడు యంగ్ జనరేషన్ వైపు చూస్తోంది. హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ లాంటి యువ పేసర్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తోంది. బుమ్రా పక్కన షమీ లాంటి అనుభవజ్ఞుడు ఉంటే బాగుంటుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నా బీసీసీఐ మాత్రం కొత్త రక్తానికి ప్రాధాన్యత ఇస్తోంది. దీనివల్ల షమీకి టీమ్ ఇండియా దారులు మూసుకుపోతున్నాయి.
460కి పైగా ఇంటర్నేషనల్ వికెట్లు తీసిన లెజెండ్కు గౌరవప్రదమైన వీడ్కోలు దక్కడం కనీస ధర్మం. 2023 వరల్డ్ కప్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ను ఇలా సైలెంట్ గా పక్కన పెట్టడం ఫ్యాన్స్కు నచ్చడం లేదు. మరి షమీ మళ్ళీ బంతి పట్టుకుంటాడా లేక తన కెరీర్కు మౌనంగానే ఫుల్ స్టాప్ పడుతుందా అన్నది సెలెక్టర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంది.
This post was last modified on January 10, 2026 8:01 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…