సౌతాఫ్రికా చేతిలో వైట్వాష్ (0-2) అవ్వడం టీమిండియాకు పెద్ద దెబ్బే కాదు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (WTC) ఆశలకు గండి కొట్టినట్టే. 25 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై సిరీస్ పోయింది. ఇప్పుడు WTC పాయింట్ల పట్టికలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ కంటే కిందకు (5వ స్థానం) పడిపోవడం అభిమానులకు మింగుడుపడటం లేదు. ఈ గాయం నుంచి కోలుకోవడానికి మన జట్టుకు ఏకంగా 8 నెలల సుదీర్ఘ విరామం దొరికింది. అవును, వచ్చే ఏడాది జూన్ వరకు మనకు టెస్ట్ మ్యాచ్ లేనట్టే. ఈ గ్యాప్ ప్లేయర్లకు రెస్ట్ ఇస్తుందో లేక ఫామ్ పోగొడుతుందో తెలియదు కానీ, ఫైనల్ ఆశలు మాత్రం ఆవిరయ్యేలా ఉన్నాయి.
అసలు ఫైనల్ చేరాలంటే సమీకరణాలు ఎలా ఉన్నాయి?
ప్రస్తుతం మన విజయాల శాతం (PCT) కేవలం 48.15 మాత్రమే. ఫైనల్ రేసులో నిలవాలంటే దీన్ని కనీసం 60 శాతానికి పెంచుకోవాలి. మన చేతిలో ఇంకా 9 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇందులో కనీసం 6 మ్యాచ్లు గెలిచి తీరాల్సిందే. ఒక్క మ్యాచ్ ఓడినా, లెక్కలు తారుమారవుతాయి. మహా అయితే 3 మ్యాచ్లు డ్రా చేసుకోవచ్చు కానీ, ఓటమికి మాత్రం అస్సలు ఛాన్స్ లేదు. ఇది నిజంగా కత్తి మీద సాము లాంటి వ్యవహారమే.
ఈ 8 నెలల బ్రేక్ తర్వాత, 2026 జూన్లో ఆఫ్ఘనిస్తాన్తో ఒక టెస్ట్ ఉంది కానీ, అది WTC పరిధిలోకి రాదు. అసలు సిసలైన యుద్ధం ఆగస్టులో మొదలవుతుంది. శ్రీలంకలో 2 టెస్టులు, ఆ తర్వాత న్యూజిలాండ్లో 2 టెస్టులు ఆడాలి. సొంతగడ్డపైనే మనం కివీస్ చేతిలో చిత్తుగా ఓడిపోయాం, ఇక వారి గడ్డపై గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఈ నాలుగు విదేశీ టెస్టుల్లో ఏ మాత్రం తడబడినా టీమిండియా ఇంటికే పరిమితం అవ్వాల్సి వస్తుంది.
విదేశీ పర్యటనలు ముగించుకుని వచ్చాక, చివరగా ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్ (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) మన గడ్డపైనే ఉంది. ఒకప్పుడు సొంతగడ్డపై మనల్ని కొట్టేవాడు లేడు అనే ధైర్యం ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. న్యూజిలాండ్, సౌతాఫ్రికాలు మనల్ని మన గ్రౌండ్స్లోనే ఓడించాయి. ఇలాంటి టైంలో పటిష్టమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం అతిపెద్ద సవాలు. ఆ 5 మ్యాచ్లే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వరుసగా రెండుసార్లు WTC ఫైనల్ వెళ్లిన రికార్డు మనకుంది. కానీ ఈసారి హ్యాట్రిక్ కొట్టాలంటే మాత్రం అద్భుతాలు జరగాల్సిందే.
This post was last modified on November 27, 2025 7:56 pm
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…