సౌతాఫ్రికా చేతిలో టీమిండియా 0-2 తేడాతో వైట్వాష్ అవ్వడం భారత క్రికెట్ వర్గాల్లో పెద్ద దుమారమే రేపింది. గత 25 ఏళ్లలో సఫారీలు మన గడ్డపై సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. ఈ ఘోర పరాభవంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. రెండో టెస్టులో 408 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన తర్వాత, గంభీర్ మీడియా ముందుకొచ్చి చాలా ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తన కోచింగ్ పదవిపై నిర్ణయం తీసుకోవాల్సింది బీసీసీఐ పెద్దలే అని స్పష్టం చేశారు.
గంభీర్ తనదైన శైలిలో మాట్లాడుతూ, “నేను పదవిలో ఉండాలా వద్దా అనేది బోర్డు ఇష్టం. నేను ముఖ్యం కాదు, భారత క్రికెట్ బాగుపడటమే ముఖ్యం. నేను ఇంగ్లాండ్లో ఫలితాలు రాబట్టాను, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిపించిన కోచ్ని కూడా నేనే. ఈ టీమ్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉంది” అని తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. గెలుపులను గుర్తు చేస్తూనే, ఓటమి బాధ్యతను కూడా స్వీకరించారు.
ఈ సిరీస్ ఓటమికి కారణం ఎవరని అడిగినప్పుడు, గంభీర్ ఎవరి పేరు చెప్పకుండా అందరిదీ బాధ్యత అని అన్నారు. “కేవలం ఆటగాళ్లను నిందించలేం. 95/1 నుంచి 122/7కి కుప్పకూలడం ఆమోదయోగ్యం కాదు. కానీ బ్లేమ్ గేమ్ ఆడదలుచుకోలేదు. తప్పు నా దగ్గర్నుంచే మొదలవుతుంది” అని నిజాయితీగా ఒప్పుకున్నారు. అయితే, గతంలో న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్, ఇప్పుడు సౌతాఫ్రికా దెబ్బతో గంభీర్ కోచింగ్ స్టైల్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గణాంకాలు చూస్తే గంభీర్ హయాంలో భారత్ రికార్డు మరీ దారుణంగా ఉంది. ఇప్పటివరకు 18 టెస్టులు ఆడితే, అందులో 10 మ్యాచ్ల్లో భారత్ ఓడిపోయింది. జట్టులో కొత్త ముఖాలు వచ్చినా ఫలితం మారలేదు. గంభీర్ తరచూ జట్టును మారుస్తున్నారని, స్పెషలిస్ట్ ప్లేయర్ల కంటే ఆల్రౌండర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శ ఉంది. దీనికి ఆయన బదులిస్తూ, టెస్టులు ఆడాలంటే టాలెంట్ ఒక్కటే సరిపోదని, “టఫ్ క్యారెక్టర్” ఉన్న వాళ్లు కావాలని తేల్చి చెప్పారు.
టెస్ట్ క్రికెట్లో భారత్ మళ్లీ పుంజుకోవాలంటే ఏం చేయాలనే ప్రశ్నకు గంభీర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “టెస్ట్ క్రికెట్కు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇది సీరియస్ గేమ్. కేవలం ప్లేయర్లనో, కోచ్నో అంటే సరిపోదు. సమిష్టి కృషి ఉంటేనే ఫలితాలు వస్తాయి” అని హితవు పలికారు. గంభీర్ మాటలను బట్టి చూస్తే, ఆయన రాజీనామా చేసే ఉద్దేశంలో లేనట్లు కనిపిస్తోంది. బంతిని బీసీసీఐ కోర్టులోకి నెట్టేశారు. వరుస వైట్వాష్ల తర్వాత బోర్డు గంభీర్కు ఇంకో ఛాన్స్ ఇస్తుందా? లేక కఠిన నిర్ణయం తీసుకుంటుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
This post was last modified on November 26, 2025 5:20 pm
కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన…
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…