ప్రస్తుతం భారత జట్టులో బుమ్రా ఒక్కడే ప్రధాన బౌలర్ గా ఉన్నాడు. అతను గాయంతో గ్యాప్ ఇస్తే ఆ రేంజ్ లో భర్తీ చేసే బౌలర్ లేడు అనేది వాస్తవం. అర్షదీప్ ఉన్నా కూడా ఇంకా అతనికి అనుభవం రావాల్సి ఉంది. ఇక హర్షిత్ రానాను లక్కు మీద ఆడించడమే సరిపోతుంది. ఇక సిరాజ్ కూడా బుమ్రా రేంజ్ లో క్లిక్ కాలేదు. ముఖ్యంగా 150 స్పీడ్ తో అదరగొట్టే కొంతమంది పేసర్లు జట్టులో స్థానం కోల్పోవడం, గాయాల పాలవడం లేదా వారి ఫామ్ను నిలబెట్టుకోలేకపోవడం భారత క్రికెట్కు ఆందోళన కలిగిస్తోంది.
టీమ్ ఇండియా తరఫున అత్యంత వేగంగా బౌలింగ్ చేయగలిగే బౌలర్ల ప్రస్తుత పరిస్థితిని చూస్తే, భవిష్యత్తులో నమ్మకమైన బ్యాకప్ పేసర్లు దొరుకుతారా అనే సందేహం కలుగుతోంది. ఈ జాబితాలో ముందున్న పేరు ఉమ్రాన్ మాలిక్ (157 kmph). అతని అద్భుతమైన వేగం కనిపించినా, ఇప్పుడు జట్టు నుంచి కనిపించకుండా పోయాడు. అలాగే, మయాంక్ యాదవ్ (156.7 kmph) లాంటి వారు గొప్ప వేగంతో అరంగేట్రం చేసినా, వెంటనే గాయాల పాలై జట్టుకు దూరమయ్యారు.
సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ (153.2 kmph) వన్డే ప్రపంచకప్ తర్వాత అద్భుతమైన ఫామ్లో ఉన్నా, అతన్ని టీమ్ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. వేగంలో మెరుగ్గా ఉన్నప్పటికీ, మరికొందరు పేసర్లు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. నవదీప్ సైనీ (152.8 kmph) ఫామ్ కోల్పోయి, కనిపించకుండాపోయాడు. మరో సీనియర్ పేసర్ ఉమేష్ యాదవ్ (152.5 kmph) అయితే రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నాడు. ఈ అనుభవజ్ఞుల స్థానాన్ని భర్తీ చేయాల్సిన యువ ఆటగాళ్ల పరిస్థితి కూడా సరిగా లేదు.
యువ పేసర్లైన శివం మావి (149.3 kmph) జాబితాలో మిస్సింగ్ అయితే, కమలేష్ నాగర్కోటి (149 kmph) గాయాల కారణంగా కనుమరుగయ్యాడు. అత్యధిక వేగంతో బౌలింగ్ చేయగల ఈ టాలెంటెడ్ ఆటగాళ్లు ఫిట్నెస్, స్థిరత్వం లేకపోవడంతో కెరీర్లో ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రసిధ్ కృష్ణ (150.6 kmph) ఆవేష్ ఖాన్ (147.6 kmph) వంటి యువ ఆటగాళ్లు తమ బౌలింగ్లో స్థిరత్వాన్ని చూపించలేకపోతున్నారు. అప్పుడప్పుడు మెరిసినా, నిలకడగా జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నారు. ఇది టీమ్ ఇండియాకు ముఖ్యంగా ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నమెంట్ల ముందు ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితిని బట్టి చూస్తే, దేశానికి ఫాస్ట్గా బౌలింగ్ చేయగల మంచి బ్యాకప్ రిజర్వ్ బలం ఉందా అనే అనుమానం కలుగుతోంది. మేనేజ్మెంట్ వీలైనంత త్వరగా వీరిలో కొంతమంది యువ పేసర్లకు సరైన ఫిట్నెస్ ఫామ్ గైడెన్స్ ఇచ్చి, వారిని అంతర్జాతీయ క్రికెట్కు సిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This post was last modified on October 16, 2025 10:10 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…