ప్రస్తుతం భారత జట్టులో బుమ్రా ఒక్కడే ప్రధాన బౌలర్ గా ఉన్నాడు. అతను గాయంతో గ్యాప్ ఇస్తే ఆ రేంజ్ లో భర్తీ చేసే బౌలర్ లేడు అనేది వాస్తవం. అర్షదీప్ ఉన్నా కూడా ఇంకా అతనికి అనుభవం రావాల్సి ఉంది. ఇక హర్షిత్ రానాను లక్కు మీద ఆడించడమే సరిపోతుంది. ఇక సిరాజ్ కూడా బుమ్రా రేంజ్ లో క్లిక్ కాలేదు. ముఖ్యంగా 150 స్పీడ్ తో అదరగొట్టే కొంతమంది పేసర్లు జట్టులో స్థానం కోల్పోవడం, గాయాల పాలవడం లేదా వారి ఫామ్ను నిలబెట్టుకోలేకపోవడం భారత క్రికెట్కు ఆందోళన కలిగిస్తోంది.
టీమ్ ఇండియా తరఫున అత్యంత వేగంగా బౌలింగ్ చేయగలిగే బౌలర్ల ప్రస్తుత పరిస్థితిని చూస్తే, భవిష్యత్తులో నమ్మకమైన బ్యాకప్ పేసర్లు దొరుకుతారా అనే సందేహం కలుగుతోంది. ఈ జాబితాలో ముందున్న పేరు ఉమ్రాన్ మాలిక్ (157 kmph). అతని అద్భుతమైన వేగం కనిపించినా, ఇప్పుడు జట్టు నుంచి కనిపించకుండా పోయాడు. అలాగే, మయాంక్ యాదవ్ (156.7 kmph) లాంటి వారు గొప్ప వేగంతో అరంగేట్రం చేసినా, వెంటనే గాయాల పాలై జట్టుకు దూరమయ్యారు.
సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ (153.2 kmph) వన్డే ప్రపంచకప్ తర్వాత అద్భుతమైన ఫామ్లో ఉన్నా, అతన్ని టీమ్ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. వేగంలో మెరుగ్గా ఉన్నప్పటికీ, మరికొందరు పేసర్లు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. నవదీప్ సైనీ (152.8 kmph) ఫామ్ కోల్పోయి, కనిపించకుండాపోయాడు. మరో సీనియర్ పేసర్ ఉమేష్ యాదవ్ (152.5 kmph) అయితే రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నాడు. ఈ అనుభవజ్ఞుల స్థానాన్ని భర్తీ చేయాల్సిన యువ ఆటగాళ్ల పరిస్థితి కూడా సరిగా లేదు.
యువ పేసర్లైన శివం మావి (149.3 kmph) జాబితాలో మిస్సింగ్ అయితే, కమలేష్ నాగర్కోటి (149 kmph) గాయాల కారణంగా కనుమరుగయ్యాడు. అత్యధిక వేగంతో బౌలింగ్ చేయగల ఈ టాలెంటెడ్ ఆటగాళ్లు ఫిట్నెస్, స్థిరత్వం లేకపోవడంతో కెరీర్లో ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రసిధ్ కృష్ణ (150.6 kmph) ఆవేష్ ఖాన్ (147.6 kmph) వంటి యువ ఆటగాళ్లు తమ బౌలింగ్లో స్థిరత్వాన్ని చూపించలేకపోతున్నారు. అప్పుడప్పుడు మెరిసినా, నిలకడగా జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నారు. ఇది టీమ్ ఇండియాకు ముఖ్యంగా ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నమెంట్ల ముందు ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితిని బట్టి చూస్తే, దేశానికి ఫాస్ట్గా బౌలింగ్ చేయగల మంచి బ్యాకప్ రిజర్వ్ బలం ఉందా అనే అనుమానం కలుగుతోంది. మేనేజ్మెంట్ వీలైనంత త్వరగా వీరిలో కొంతమంది యువ పేసర్లకు సరైన ఫిట్నెస్ ఫామ్ గైడెన్స్ ఇచ్చి, వారిని అంతర్జాతీయ క్రికెట్కు సిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This post was last modified on October 16, 2025 10:10 am
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…
వైసీపీలో మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి శకం ప్రారంభం అవుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్..…