బ్రిటన్ రాజకీయాల్లో ఇప్పుడు ఇండియాకు చెందిన ఆధార్ మోడల్ పెద్ద చర్చకు దారితీస్తోంది. యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఇటీవలి ఇండియా పర్యటనలో, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటంటే, భారతదేశం యొక్క ఆధార్ తరహాలో యూకేలో కూడా కంపల్సరీ డిజిటల్ ఐడీ వ్యవస్థను తీసుకురావాలనే ప్లాన్. స్టార్మర్ ఈ ఆలోచనపై చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇండియాలో ఇది హిట్ అయింది కాబట్టే, తాను కూడా ఈ మోడల్ను స్టడీ చేస్తున్నట్లు ఆయన ముంబై బయలుదేరే ముందు మీడియాకు చెప్పారు.
డిజిటల్ ఐడీ కార్డుల ప్లాన్పై స్టార్మర్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఈ ఐడీ కార్డు లేకుండా, బ్రిటన్లో ఎవరూ పని చేయడానికి వీల్లేదని ఆయన గత నెలలోనే ప్రకటించారు. అక్రమంగా దేశంలోకి వచ్చి పని చేసేవారిని అరికట్టడానికి, అండర్గ్రౌండ్ ఎకానమీని కంట్రోల్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుందని ఆయన అంటున్నారు. అంతేకాకుండా, హెల్త్కేర్, వెల్ఫేర్ వంటి ప్రభుత్వ సేవలను ప్రజలు సింపుల్గా యాక్సెస్ చేయడానికి కూడా ఈ డిజిటల్ ఐడీ చాలా ఉపయోగపడుతుందని స్టార్మర్ చెబుతున్నారు.
యూకేలో ఇలాంటి ఐడీ కార్డులపై తీవ్ర వ్యతిరేకత ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సాధారణ పౌరులకు తప్పనిసరి ఐడెంటిటీ కార్డులు అక్కడ లేవు. విపక్ష పార్టీలు, పౌర హక్కుల కార్యకర్తలు ఈ స్కీమ్ను వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం అని, ప్రైవేట్ డేటాకు రిస్క్ అని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కూడా బయోమెట్రిక్ ఐడీ కార్డులు తేవాలని చూసినా, ప్రజా వ్యతిరేకతతో ఆ ప్లాన్ ఆగిపోయింది.
అయితే స్టార్మర్ మాత్రం తన ప్లాన్ వర్కౌట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు. “పిల్లలను స్కూల్లో చేర్చాలన్నా, దేనికైనా అప్లై చేయాలన్నా మూడు బిల్లులు వెతుక్కునే బాధ తప్పిపోతుంది. ఇది నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది” అని ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ సమస్యలన్నింటికీ డిజిటల్ ఐడీ పరిష్కారం చూపుతుందని ఆయన వాదిస్తున్నారు.
ప్రస్తుతానికి యూకే ప్లాన్లో బయోమెట్రిక్ డేటాను వాడే ఆలోచన లేదని స్టార్మర్ ప్రతినిధి చెప్పారు. అంటే, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ లాంటివి లేకుండా సింపుల్గా డిజిటల్ ఐడీని తేవడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. యూరోప్తో పోలిస్తే, బ్రిటన్ ‘పేపర్స్, ప్లీజ్’ సొసైటీ కాదనే భావన అక్కడ బలంగా ఉంది. కానీ అన్ని చోట్లా ఐడీ ప్రూఫ్ అవసరం అవుతున్న ఈ రోజుల్లో, డిజిటల్ ఐడీ నిజంగానే యూజర్ఫుల్గా ఉంటుందని కొందరు నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకే, స్టార్మర్ ఇండియాలో సక్సెస్ అయిన ‘ఆధార్’ స్ట్రాటజీని ఫాలో అవ్వాలని చూస్తున్నారు, కానీ ఆ దేశ ప్రజల వ్యతిరేకతను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
This post was last modified on October 9, 2025 9:50 pm
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…