చేతిదాకా వచ్చిన సీరిస్ ను కేవలం 6 పరుగుల తేడాతో చేజార్చుకుంది ఇంగ్లాండ్. ఒక విధంగా టీమిండియా దక్కనివ్వలేదనే చెప్పాలి. 2-1 తో లీడ్ లో ఉన్న సీరిస్ ను కనీసం డ్రా చేసినా లాభమే కానీ భారత బౌలర్లు చివరి క్షణం వరకు పోరాడి ఏకంగా సీరీస్ ను డ్రాగా మార్చేశారు.
ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్ట్లో భారత్ ఉత్కంఠభరితమైన విజయం సాధించింది. చివరి రోజు ఆటలో అద్భుతంగా పోరాడిన టీమిండియా కేవలం ఆరు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. నాలుగో రోజు చివరికి 339/6తో నిలిచిన ఇంగ్లాండ్, చివరి రోజు కేవలం 28 పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లతో భారత విజయాన్ని ఖాయం చేశాడు.
374 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ జట్టు చివరి రోజు జేమీ ఓవర్టన్తో ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే సిరాజ్ తన మొదటి ఓవర్లోనే జేమీ స్మిత్ (2)ను అవుట్ చేసి భారత్కు శుభారంభం అందించాడు. ఆ వెంటనే మరో వికెట్ తీసి జట్టు విజయానికి కీలకంగా నిలిచాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా తన వేగంతో జోష్ టంగ్ను (0) క్లీన్ బౌల్డ్ చేసి భారత్ను విజయానికి చేరువ చేశాడు.
మ్యాచ్ చివర్లో తీవ్రంగా గాయపడిన క్రిస్ వోక్స్ ఒంటి చేత్తోనే బ్యాటింగ్కు వచ్చి తీవ్రంగా పోరాడాడు. అతనికి అట్కిన్సన్ కూడా తోడుగా నిలిచి భారత్కు కాస్త ఒత్తిడి కలిగించారు. ఈ జోడీ భారీ షాట్లతో విజయానికి ప్రయత్నించింది. సిరాజ్ బౌలింగ్లో బౌండరీ వద్ద ఆకాశ్ దీప్ క్యాచ్ను జారవిడవడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠకు గురైంది.
చివరికి విజయానికి ఏడే పరుగులు అవసరమైన సమయంలో మహ్మద్ సిరాజ్ అద్భుతమైన బంతితో అట్కిన్సన్ను క్లీన్ బౌల్డ్ చేసి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. మొత్తం మ్యాచ్లో 5 వికెట్లు తీసిన సిరాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. సెంచరీలు సాధించిన జో రూట్, హ్యారీ బ్రూక్ల వికెట్లు తీసి భారత్కు తిరుగులేని విజయాన్ని అందించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు.
ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమమైంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 224 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 247 పరుగులు సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్లో 396 పరుగులతో పుంజుకున్న భారత్ చివరకు అద్భుతమైన విజయం సాధించి, తమ పోరాట పటిమను చాటింది.
This post was last modified on August 4, 2025 11:26 pm
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…