విదేశీ పర్యటనల సమయంలో ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం పై వచ్చిన విమర్శల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల కొంతమంది ఆటగాళ్లపై దృష్టిసారించింది. ఈ అంశంపై ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించగా, అతని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దేశం తరపున ఆడేందుకు వచ్చాం కానీ హాలిడే టూర్కు కాదని గంభీర్ తేల్చిచెప్పారు.
తాజాగా చటేశ్వర్ పుజారాతో జరిగిన ముఖాముఖి సంభాషణలో గంభీర్ ఆసక్తికరంగా స్పందించారు. “ప్రతి ఒక్కరికీ తమ కుటుంబం ముఖ్యం. కానీ మనం విదేశాలకు పర్యటనల కోసమో, హాలిడే కోసం రాలేదు. మనం జాతీయ జెండా పైన బ్యాడ్జ్ పెట్టుకుని వచ్చాం. మన బాధ్యత దేశాన్ని గర్వపడేలా చేయడమే. అందుకే దృష్టి పూర్తిగా ఆట మీద ఉండాలి” అంటూ తన అభిప్రాయాన్ని గంభీర్ స్పష్టంగా చెప్పారు.
డ్రెస్సింగ్ రూమ్ విషయానికొస్తే, విదేశాల్లో పర్యటనల సమయంలో ఎక్కువ మంది తోడ్పాటుతో ఉండకపోవచ్చని, కానీ అలాంటి పరిస్థితుల్లోనూ జట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని గంభీర్ తెలిపారు. ఆటదారుల మధ్య అవగాహన, సహకారం కీలకమని చెప్పారు. ఇది జట్టు విజయానికి శక్తినిస్తుంది అనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఆటగాళ్ల అభిప్రాయాలు కూడా ముఖ్యమేనని గంభీర్ చెప్పినప్పటికీ, దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు, వ్యక్తిగత ప్రయోజనాల కన్నా జట్టు ప్రయోజనాలే ముందుండాలని సూచించారు. “మీరు జెర్సీ వేసుకున్న రోజు నుంచి మీరు ఒక వ్యక్తి కాకుండా భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా మారతారు” అని వ్యాఖ్యానించారు. తన కోచ్గా దృష్టి పూర్తిగా జట్టు అభివృద్ధిపైనే ఉంటుందని గంభీర్ స్పష్టం చేశారు. దేశం కోసం ఆడే ప్రతి ఆటగాడి మైండ్సెట్ కూడా ఇదే దిశగా ఉండాలని కోరుకున్నారు. గంభీర్ చెప్పిన ఈ పాయింట్లు ప్రస్తుతం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ కల్చర్లో కీలక మార్పులకే నాంది కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…