ప్రతి సంవత్సరం ఐపీఎల్ మొదలవుతుంటే.. కప్పు ఎవరు గెలుస్తారు.. ఏ జట్లు ప్లేఆఫ్స్ చేరతాయి, ఏ జట్లు ముందే నిష్క్రమిస్తాయి అని అంచనాలు కడుతుంటారు అభిమానులు. ఈసారి సీజన్ ఆరంభమవుతుండగా.. పంజాబ్ కింగ్స్ అనే జట్టు లీగ్ దశలో అగ్రస్థానంలో నిలుస్తుందని ఎవ్వరైనా ఊహించి ఉంటారా? అసలు ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరుతుందని నమ్మిన వాళ్లు చాలా తక్కువమందే అయ్యుంటారు. ఎందుకంటే లీగ్ చరిత్రలో ఆ జట్టు ప్రదర్శన అలాంటిది. గత పదేళ్లలో ఒక్కసారి కూడా పంజాబ్ ప్లేఆఫ్స్ ఆడింది లేదు.
కప్పు గెలవడం సంగతి అటుంచితే.. గత 17 సీజన్లలో పంజాబ్ ఫైనల్ ఆడిందే ఒక్కసారి. ఇలాంటి జట్టు ఈ సీజన్లో మహా మహా జట్లను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలవడం అంటే సామాన్యమైన విషయం కాదు. వరుస విజయాలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్న ముంబయిని సోమవారం అలవోకగా ఓడించిన పంజాబ్.. అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మంగళవారం బెంగళూరు కొంచెం ఘనంగా గెలిస్తే పంజాబ్ రెండో స్థానానికి పడిపోవచ్చు. లేదంటే అగ్రస్థానంతోనే లీగ్ దశను ముగించవచ్చు.
మొత్తానికి ఆ జట్టు టాప్-2లోనే ఉండబోతోంది. కాబట్టి నేరుగా తొలి క్వాలిఫయర్ ఆడే అవకాశం దక్కించుకుంది. అందులో గెలిస్తే ఫైనల్కు వెళ్తుంది, ఓడినా రెండో క్వాలిఫయర్ ఆడే అవకాశముంటుంది. పంజాబ్ రాత ఇలా మారిపోవడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పాత్ర అత్యంత కీలకం అనడంలో సందేహం లేదు. ఢిల్లీ జట్టు ఇన్నేళ్లలో ఒకే ఒక్క ఫైనల్ ఆడింది. అప్పుడు కెప్టెన్ శ్రేయసే. కోల్కతా గత ఏడాది పదేళ్ల గ్యాప్ తర్వాత కప్పు గెలిచిందన్నా అది అతడి క్రెడిట్టే. ఈసారి పంజాబ్ జట్టు పగ్గాలు చేపట్టి దాని రాత మార్చేశాడు శ్రేయస్. మరి ఇదే ఊపులో ఆ జట్టుకు తొలి కప్పు కూడా అందిస్తాడేమో చూడాలి.
This post was last modified on May 27, 2025 11:48 am
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…