గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి అడుగు పెడతారని తరచూ వార్తలు వచ్చేవి. ఆయన బెంగాల్లో ఏదో ఒక పార్టీలో చేరతారని, ముఖ్యమైన హోదా తీసుకుంటారని రకరకాల ఊహాగానాలు వినిపించేవి. కానీ, అలాంటి వార్తల నుంచి గంగూలీ ఎప్పుడూ దూరంగానే ఉన్నారు. రాజకీయాలపై తన వైఖరిని క్లియర్గా చెప్పలేదు కానీ, ఆయన మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
తాజాగా పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల సమస్యపై కొందరు ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు తమ నిరసనకు మద్దతు ఇవ్వాలని సౌరవ్ను కలిసి కోరారు. అయితే ఈసారి గంగూలీ మరింత స్పష్టతతో స్పందించారు. “దయచేసి నన్ను రాజకీయాల్లోకి లాగకండి. ఈ వివాదంతో నాకు సంబంధం లేదు, ఈ గోడవలు నాకు సంబంధం లేనివి” అని పరోక్షంగా చెప్పేశారు. ఈ సంఘటనతో రాజకీయాలకు ఆయన పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.
పాలిటిక్స్ లోకి రావాలి అనుకుంటే ఎవరైనా సరే ముందుగా ఇలాంటి అంశాల విషయంలో ఏదో ఒక విధంగా స్పందించే ప్రయత్నం చేస్తారు. కానీ గంగూలీ ఇలాంటి వివాదాలకు దూరంగానే ఉండాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. గంగూలీ స్పష్టమైన మాటలతో, పాలిటిక్స్పై తన వైఖరిని చాలా క్లియర్గా చెప్పినట్లయింది. గతంలో వచ్చిన వార్తలను కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు.
అయితే ఇప్పుడైతే రాజకీయ అంశాలకు తనను దూరంగా ఉంచాలని బహిరంగంగానే కోరారు. దాదా ప్రస్తుతం క్రికెట్ పరిపాలన, ఇతర వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. రాజకీయాల జోలికి వెళ్లే ఆలోచన తనకు లేదని ఈ సారి బలంగా సూచించారు. అందువల్ల, ఇకపై కూడా గంగూలీపై వచ్చే రాజకీయ వార్తలకు ఎలాంటి ప్రాధాన్యం లేదని ఆయన తాజా స్టేట్మెంట్ స్పష్టం చేస్తోంది. ఈ వ్యాఖ్యలతో దాదా అభిమానులు, ఆయన భవిష్యత్ రాజకీయాలపై వచ్చే ఊహాగానాలకు ఇక బ్రేక్ పడినట్లే అని భావిస్తున్నారు.
This post was last modified on April 19, 2025 10:46 am
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం తాడేపల్లిలోని తన పార్టీ కేంద్ర…
ఈ ఏడాది భారీ అంచనాలు మోస్తున్న సినిమాల్లో ది ప్యారడైజ్ చాలా కీలకం. న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే…
బాలీవుడ్ నటులు తెలుగు సినిమాలు చేయడం కొత్తేమి కాదు. దశాబ్దాల నుంచి ఉన్నదే. కాకపోతే వాళ్ళు ప్రమోషన్లలో అంతగా కనిపించరు.…
మార్చి నుంచి అప్పుడు ఇప్పుడు అంటూ ఎదురు చూసిన మెగాస్టార్ 158 ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. ఏపీ డిప్యూటీ సిఎం…
వైసీపీ హయాంలో పథకాలను అమలు చేశారు. జగన్ చెప్పిన లెక్క ప్రకారం.. 2.5 లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు పంచారు.…