టీమిండియా చరిత్రను తిరగరాసింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించి మూడోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ హై ఓల్టేజ్ మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన అద్భుత నాయకత్వాన్ని నిరూపించుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
జట్టుకు మంచి ఆరంభం అందించిన రోహిత్ శర్మ (76; 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడి విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. విరాట్ కోహ్లీ (1) నిరాశపరిచినప్పటికీ, శ్రేయస్ అయ్యర్ (48) తన ఆటతో జట్టును నిలబెట్టాడు. చివర్లో కేఎల్ రాహుల్ (34*), అక్షర్ పటేల్ (29), హార్దిక్ పాండ్యా (18) మెరుగైన భాగస్వామ్యాలతో టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. భారత్ 2002లో శ్రీలంకతో సంయుక్త విజేతగా నిలవగా, 2013లో ఇంగ్లాండ్ను ఓడించి ఛాంపియన్గా నిలిచింది. ఇప్పుడు మూడోసారి టైటిల్ను అందుకోవడం క్రికెట్ ప్రేమికులకు అపూర్వ అనుభూతిని కలిగించింది.
కివీస్ బ్యాటింగ్లో డారిల్ మిచెల్ (63), మైకేల్ బ్రాస్వెల్ (53*) రాణించారు. రచిన్ రవీంద్ర (37), గ్లెన్ ఫిలిప్స్ (34) మెరుగైన స్కోర్లు చేశారు. అయితే భారత బౌలర్ల అద్భుత ప్రదర్శన ముందు కివీస్ బ్యాటింగ్ పూర్తిగా కుదేలైంది. కుల్దీప్ యాదవ్ 2, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీశారు. షమీ, జడేజా తలో వికెట్ తీసి జట్టుకు బలాన్ని అందించారు. భారత ఓపెనర్లు శుభారంభం అందించినప్పటికీ, మధ్యలో వరుస వికెట్లు కోల్పోవడం వల్ల ఒత్తిడి పెరిగింది. 100 పరుగుల భాగస్వామ్యం అనంతరం గిల్ అవుట్ కాగా, కోహ్లీ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. రోహిత్ అర్ధశతకం తర్వాత ఔటవడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది.
అయితే శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ జాగ్రత్తగా ఆడి టీమిండియాను తిరిగి పుంజుకోనిచ్చారు. ఆఖర్లో రాహుల్, పాండ్యా మెరుపులు మెరిపించడంతో భారత్ విజయం సులభమైంది. ఈ ఘన విజయం భారత క్రికెట్ చరిత్రలో మరో గర్వించదగిన అధ్యాయంగా నిలిచింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కప్ను అందుకోవడం ద్వారా టీమిండియా ప్రపంచవ్యాప్తంగా తన సత్తాను మరోసారి చాటుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఐసీసీ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుని భారత క్రికెట్కు మరింత ఖ్యాతి తీసుకొచ్చాడు.
This post was last modified on March 9, 2025 10:37 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…