Trends

రోహిత్ శ‌ర్మ అభిమానుల‌కు షాక్‌

భార‌త క్రికెట్లో ప్ర‌స్తుతం కోహ్లి, ధోనీల త‌ర్వాత అత్య‌ధికంగా అభిమానులున్న క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మనే. దేశ‌వ్యాప్తంగా అత‌డికి కోట్లాదిగా అభిమానులున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ క్రికెట్లో బెస్ట్ లిమిటెడ్ ఓవ‌ర్స్ బ్యాట్స్‌మెన్‌లో ఒక‌డు రోహిత్‌. వ‌న్డే, టీ20 ఓపెన‌ర్ల‌లో అత‌నే ది బెస్ట్ అన్నా కూడా అతిశ‌యోక్తి కాదు. టీమ్ఇండియాకు వ‌న్డేలు, టీ20ల్లో అత‌ను వైస్ కెప్టెన్ కూడా.

ఐపీఎల్‌లో రోహిత్ ఘ‌న‌త‌ల గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. ఐతే ఐపీఎల్ అత‌డి జ‌ట్టు ముంబ‌యి ప్లేఆఫ్ దిశ‌గా దూసుకెళ్తున్న త‌రుణంలో అంద‌రూ ఒక చేదు వార్త వినాల్సి వ‌చ్చింది. రోహిత్ ఈ ఐపీఎల్‌లో ఇక‌పై ఆడ‌బోడు. గాయం కార‌ణంగా గ‌త రెండు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ ఆడ‌లేదు. రోహిత్ గాయం చిన్న‌దే, త్వ‌ర‌లోనే జ‌ట్టులోకి తిరిగొస్తాడు.. ప్లేఆఫ్స్‌లో జ‌ట్టును న‌డిపిస్తాడు. మ‌రో క‌ప్పు అందిస్తాడు అని అభిమానులు ఆశించారు.

కానీ రోహిత్ తొడ కండ‌రాల గాయం తీవ్ర‌త ఎక్కువ కావ‌డంతో అత‌ను ఐపీఎల్ మొత్తానికి మాత్ర‌మే కాదు.. త్వ‌ర‌లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు కూడా దూరం అవుతున్నాడ‌ని తేలింది. తాజాగా ఈ ప‌ర్య‌ట‌న కోసం భార‌త టీ20, వ‌న్డే, టెస్టు జ‌ట్ల‌ను ప్ర‌క‌టించ‌గా.. ఆ మూడింట్లోనూ రోహిత్‌కు చోటు ద‌క్క‌లేదు.

యూఏఈలో ఉన్న భార‌త ఫిజియో బృందం రోహిత్‌ను ప‌రిశీలించి అత‌ను రెండు మూడు నెల‌ల పాటు క్రికెట్ ఆడ‌లేడ‌ని తేల్చింది. దీంతో సెల‌క్ట‌ర్లు అత‌ణ్ని ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు దూరం పెట్టారు. అంత‌కంటే ముందు ఐపీఎల్‌లో ముంబ‌యి జ‌ట్టుకు రోహిత్ దూరం కావ‌డం అభిమానుల‌కు తీవ్ర నిరాశ క‌లిగించేదే. కీల‌క‌మైన ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో రోహిత్ లేక‌పోవ‌డ‌మూ జ‌ట్టుకు ఎదురు దెబ్బే. అభిమానుల‌కు బాధ క‌లిగించేదే.

This post was last modified on October 27, 2020 8:22 am

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

45 minutes ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

2 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

2 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

2 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

3 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

4 hours ago