భారత క్రికెట్ జట్టును ఐసీసీ ఫైనల్కు చేర్చడం ఒక అద్భుతమైన ఘనత. కానీ అదే పని వరుసగా నాలుగుసార్లు చేయగలిగిన తొలి కెప్టెన్గా రోహిత్ శర్మ పేరు చరిత్రలో నిలిచిపోనుంది. 2023 నుంచి 2025 వరకూ భారత జట్టును ఐసీసీ టోర్నమెంట్లలో ఫైనల్కు చేర్చడం ద్వారా రోహిత్ మరోసారి తన కెప్టెన్సీ నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (2023), వన్డే వరల్డ్ కప్ (2023), టీ20 వరల్డ్ కప్ (2024), ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ (2025) ఫైనల్కు భారత్ను తీసుకెళ్లాడు.
ఇందులో టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్లో భారత్కు ఓటమి ఎదురైనప్పటికీ, టీ20 వరల్డ్ కప్ను గెలుచుకొని చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కూడా గెలిచి మరో గొప్ప రికార్డును తన ఖాతాలో వేసుకోవాలని రోహిత్, టీమిండియా అభిమానులు ఆశిస్తున్నారు. ఈ విజయ పరంపర భారత క్రికెట్కు కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడమే కాదు, రోహిత్ శర్మ కెప్టెన్సీని సుస్థిరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ ఘనత సాధించిన తొలి భారత కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. గతంలో మహేంద్ర సింగ్ ధోనీ 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిపించి అత్యుత్తమ కెప్టెన్సీ ప్రతిభను ప్రదర్శించాడు. అయితే, టెస్టు ఫార్మాట్లో ప్రపంచ ఛాంపియన్షిప్ ఆ రోజుల్లో లేకపోవడం వల్ల ధోనీకి ఆ అవకాశమే రాలేదు. కానీ ఇప్పుడు రోహిత్ అన్ని ఫార్మాట్లలో భారత్ను ఫైనల్కు చేర్చిన కెప్టెన్గా నిలిచాడు.
భారత క్రికెట్ను ఈ స్థాయికి తీసుకురావడంలో రోహిత్ కృషిని గుర్తించాల్సిందే. విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరింది. అయితే 2023లో భారత్ను మరోసారి ఫైనల్కు తీసుకెళ్లిన రోహిత్, ఆ తర్వాత వరుసగా మూడు ప్రధాన ఐసీసీ ఫైనల్స్ను అందించడంతో కెప్టెన్గా తన ప్రత్యేకతను చాటాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ టీమిండియా విజయం సాధిస్తే, ఇది రోహిత్ కెప్టెన్సీ కెరీర్కు అద్భుతమైన మైలురాయిగా మారనుంది.
ఇంతవరకు భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని రెండుసార్లు గెలుచుకుంది. ఒకసారి 2002లో శ్రీలంకతో టైగా ముగిసిన మ్యాచ్లో సహవిజేతగా నిలిచింది. మరోసారి 2013లో ధోనీ సారథ్యంలో టైటిల్ సాధించింది. 2025లో ఈ ట్రోఫీని మళ్లీ గెలవాలంటే రోహిత్ సేన అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ మూడోసారి భారత్ గెలిస్తే, రోహిత్ శర్మ మరో లెజెండరీ కెప్టెన్గా చరిత్ర సృష్టించనున్నాడు.
This post was last modified on March 5, 2025 2:58 pm
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన…
తమిళ రాజకీయాల్లో తన అరంగేట్రం చేస్తున్న నటుడు విజయ్ (తమిళగ వెట్రి కళగం), గతంలో ఏపీలో పవన్ కళ్యాణ్ అనుసరించిన…
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…