భారత క్రికెట్ జట్టును ఐసీసీ ఫైనల్కు చేర్చడం ఒక అద్భుతమైన ఘనత. కానీ అదే పని వరుసగా నాలుగుసార్లు చేయగలిగిన తొలి కెప్టెన్గా రోహిత్ శర్మ పేరు చరిత్రలో నిలిచిపోనుంది. 2023 నుంచి 2025 వరకూ భారత జట్టును ఐసీసీ టోర్నమెంట్లలో ఫైనల్కు చేర్చడం ద్వారా రోహిత్ మరోసారి తన కెప్టెన్సీ నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (2023), వన్డే వరల్డ్ కప్ (2023), టీ20 వరల్డ్ కప్ (2024), ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ (2025) ఫైనల్కు భారత్ను తీసుకెళ్లాడు.
ఇందులో టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్లో భారత్కు ఓటమి ఎదురైనప్పటికీ, టీ20 వరల్డ్ కప్ను గెలుచుకొని చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కూడా గెలిచి మరో గొప్ప రికార్డును తన ఖాతాలో వేసుకోవాలని రోహిత్, టీమిండియా అభిమానులు ఆశిస్తున్నారు. ఈ విజయ పరంపర భారత క్రికెట్కు కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడమే కాదు, రోహిత్ శర్మ కెప్టెన్సీని సుస్థిరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ ఘనత సాధించిన తొలి భారత కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. గతంలో మహేంద్ర సింగ్ ధోనీ 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిపించి అత్యుత్తమ కెప్టెన్సీ ప్రతిభను ప్రదర్శించాడు. అయితే, టెస్టు ఫార్మాట్లో ప్రపంచ ఛాంపియన్షిప్ ఆ రోజుల్లో లేకపోవడం వల్ల ధోనీకి ఆ అవకాశమే రాలేదు. కానీ ఇప్పుడు రోహిత్ అన్ని ఫార్మాట్లలో భారత్ను ఫైనల్కు చేర్చిన కెప్టెన్గా నిలిచాడు.
భారత క్రికెట్ను ఈ స్థాయికి తీసుకురావడంలో రోహిత్ కృషిని గుర్తించాల్సిందే. విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరింది. అయితే 2023లో భారత్ను మరోసారి ఫైనల్కు తీసుకెళ్లిన రోహిత్, ఆ తర్వాత వరుసగా మూడు ప్రధాన ఐసీసీ ఫైనల్స్ను అందించడంతో కెప్టెన్గా తన ప్రత్యేకతను చాటాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ టీమిండియా విజయం సాధిస్తే, ఇది రోహిత్ కెప్టెన్సీ కెరీర్కు అద్భుతమైన మైలురాయిగా మారనుంది.
ఇంతవరకు భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని రెండుసార్లు గెలుచుకుంది. ఒకసారి 2002లో శ్రీలంకతో టైగా ముగిసిన మ్యాచ్లో సహవిజేతగా నిలిచింది. మరోసారి 2013లో ధోనీ సారథ్యంలో టైటిల్ సాధించింది. 2025లో ఈ ట్రోఫీని మళ్లీ గెలవాలంటే రోహిత్ సేన అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ మూడోసారి భారత్ గెలిస్తే, రోహిత్ శర్మ మరో లెజెండరీ కెప్టెన్గా చరిత్ర సృష్టించనున్నాడు.
This post was last modified on March 5, 2025 2:58 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…