ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అదే ఆసీస్ చేతిలో చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. కానీ ఈసారి ఆ తప్పును సరిదిద్దుకుంటూ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్యఛేదనలో విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్తో మరోసారి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేసి 264 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్, అలెక్స్ కేరీ అర్ధశతకాలు బాదినా, మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. భారత బౌలింగ్ దళం క్రమంగా కట్టడి చేస్తూ ఆసీస్ పరుగుల వరదను ఆపేసింది. షమీ 3 వికెట్లు తీసి చక్కటి ప్రదర్శన చేశాడు. వరుణ్ చక్రవర్తి, జడేజా ఇద్దరూ కలిసి కీలకమైన వికెట్లు పడగొట్టారు.
లక్ష్యఛేదనలో భారత్ ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయి కొంత తడబడినప్పటికీ కోహ్లీ స్మార్ట్ ఆటతీరుతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 84 పరుగులతో మరోసారి తన క్లాస్ను చాటాడు. శ్రేయస్ అయ్యర్(45), కేఎల్ రాహుల్(42), హార్దిక్(28) కీలక సమయంలో అందించిన మద్దతు గెలుపును మరింత సులభం చేసింది. చివరికి 48.1 ఓవర్లలో భారత్ విజయాన్ని అందుకుంది.
ఈ గెలుపుతో భారత్ మరోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపి ఫైనల్కు చేరింది. మార్చి 9న దుబాయ్ వేదికగా తుది పోరు జరగనుంది. బుధవారం న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ జరగనుండగా, విజేత జట్టుతో భారత్ ఫైనల్లో తలపడనుంది. వరుసగా ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్కి చేరడం భారత జట్టుకు గర్వించదగిన విషయం. ఇక ఫైనల్ లో కూడా టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా అదే ప్రణాలికతో జట్టును కొనసాగించే అవకాశం ఉంది.
దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని…
ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడలను ఏకం చేసిన ఉద్యమం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం.. గత రెండు…
విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న కొరియన్ కనకరాజుకి మోక్షం దొరికేసింది. ఆగస్ట్ 7 రిలీజ్ కు రంగం సిద్ధం…
గత వారం భారీ అంచనాల మధ్య ప్రేక్షెకుల ముందుకు వచ్చిన పెద్ది సినిమా తొలి వీకెండ్లో అంచనాలకు తగ్గట్లే భారీ…
జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి. అలాంటిది కాంగ్రెస్ మంత్రితో బీజేపీ ఎంపీ భేటీ…
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి రెండేల్లు అవుతోంది. మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి… 2024 ఎన్నికల్లో అత్యంత కష్టతరమైన…