Trends

ఆస్ట్రేలియాపై రివేంజ్.. ఫైనల్‌కు భారత్!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అదే ఆసీస్ చేతిలో చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. కానీ ఈసారి ఆ తప్పును సరిదిద్దుకుంటూ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్యఛేదనలో విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో మరోసారి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేసి 264 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్, అలెక్స్ కేరీ అర్ధశతకాలు బాదినా, మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. భారత బౌలింగ్ దళం క్రమంగా కట్టడి చేస్తూ ఆసీస్ పరుగుల వరదను ఆపేసింది. షమీ 3 వికెట్లు తీసి చక్కటి ప్రదర్శన చేశాడు. వరుణ్ చక్రవర్తి, జడేజా ఇద్దరూ కలిసి కీలకమైన వికెట్లు పడగొట్టారు.

లక్ష్యఛేదనలో భారత్ ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయి కొంత తడబడినప్పటికీ కోహ్లీ స్మార్ట్ ఆటతీరుతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 84 పరుగులతో మరోసారి తన క్లాస్‌ను చాటాడు. శ్రేయస్ అయ్యర్(45), కేఎల్ రాహుల్(42), హార్దిక్(28) కీలక సమయంలో అందించిన మద్దతు గెలుపును మరింత సులభం చేసింది. చివరికి 48.1 ఓవర్లలో భారత్ విజయాన్ని అందుకుంది.

ఈ గెలుపుతో భారత్ మరోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపి ఫైనల్‌కు చేరింది. మార్చి 9న దుబాయ్ వేదికగా తుది పోరు జరగనుంది. బుధవారం న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ జరగనుండగా, విజేత జట్టుతో భారత్ ఫైనల్‌లో తలపడనుంది. వరుసగా ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్‌కి చేరడం భారత జట్టుకు గర్వించదగిన విషయం. ఇక ఫైనల్ లో కూడా టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా అదే ప్రణాలికతో జట్టును కొనసాగించే అవకాశం ఉంది.

This post was last modified on March 4, 2025 10:06 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

58 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago