Trends

సెమీస్‌ కోసం టీమిండియాకు మైండ్ గేమ్.. సమస్యేమిటంటే..

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్‌ దశను అజేయంగా ముగించిన టీమిండియా సెమీఫైనల్లో ఆసీస్‌తో తలపడనుంది. అయితే ఇటీవల రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తుది జట్టు ఎంపిక సవాలుగా మారిందని, కచ్చితమైన సమీకరణాలు అవసరమని అతడు చెప్పిన మాటలు మేనేజ్‌మెంట్ ఆలోచనలో పడేసినట్టు కనిపిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో మార్పులు పెద్దగా ఉండకపోయినా, బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో మాత్రం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

బ్యాటింగ్‌లో ఇప్పటివరకు టీమిండియాకు పెద్దగా సమస్యలు ఎదురవ్వలేదు. అయితే వికెట్ కీపింగ్ అంశంలో మార్పు అవసరం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. కేఎల్ రాహుల్ స్పిన్ బౌలింగ్‌కు కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపించడంతో, ఆసీస్‌పై రిషభ్ పంత్‌ను ఆడించే ఆలోచనలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాపై పంత్‌కు ఉన్న రికార్డు, అతడి స్వభావం దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు జరుగుతుందా అనేది ఆసక్తిగా మారింది. మిగిలిన టాప్ ఆర్డర్‌లో మార్పు జరగే అవకాశం తక్కువ.

స్పిన్ బౌలింగ్‌ విభాగం ఈ మ్యాచ్‌కు కీలకంగా మారనుంది. న్యూజిలాండ్‌పై వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శన కనబర్చినప్పటికీ, జడేజాకు విశ్రాంతి ఇచ్చి వాషింగ్టన్ సుందర్‌ను ఆడించొచ్చనే చర్చ నడుస్తోంది. ఆసీస్ బ్యాటింగ్ లైనప్ స్పిన్‌ను మెరుగుగా ఆడేలా మారినప్పటికీ, దుబాయ్ పిచ్ నెమ్మదిగా మారుతుండటంతో నాలుగు స్పిన్నర్ల కాంబినేషన్‌ను మళ్లీ వాడాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పేస్ విభాగంలో మూడో పేసర్ విషయంలో సందేహాలు ఉన్నాయి. షమీ మోకాలి నొప్పి సమస్యతో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయలేకపోవడంతో, అర్ష్‌దీప్ లేదా హర్షిత్ రాణాకు ఛాన్స్ ఇచ్చే అవకాశముంది. హార్దిక్ పాండ్య కొత్త బంతితో కూడా మెరుగైన స్పెల్స్ వేస్తుండటంతో, ఈ మ్యాచ్‌లో అతడి బౌలింగ్ టీమిండియాకు కీలకమవ్వనుంది. మొత్తంగా, టీమిండియా తుది జట్టులో ఒక్కటీ మారకపోవచ్చు లేదా వికెట్ కీపింగ్, స్పిన్ విభాగాల్లో తేలికపాటి మార్పులు ఉండొచ్చు. సెమీఫైనల్లో ఆసీస్‌పై మెరుగైన ప్రదర్శన చేయాలని భారత్ భావిస్తుండగా, తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందనేది అభిమానుల్లో ఆసక్తిగా మారింది.

టీమిండియా 11 (అంచనా)

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ / రిషభ్ పంత్, హార్దిక్‌ పాండ్య, జడేజా/సుందర్, కుల్‌దీప్‌ యాదవ్, వరుణ్‌ చక్రవర్తి, అర్ష్‌దీప్/షమీ

This post was last modified on March 3, 2025 7:40 pm

Share

Recent Posts

వైసీపీ ప‌రిస్థితి దారుణం… పోటీకి నేతలు ఉన్నారా?

స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ కోరుకుంటున్నారు. త‌ద్వారా.. గ‌త 2024 సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఎదురైన ప‌రాభ‌వం…

2 hours ago

వైసీపీ టాప్ లీడ‌ర్‌కు జ‌గ‌న్ చెక్‌…?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గ వైసీపీ రాజకీయంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుత వైసీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే…

4 hours ago

మ‌హేష్ బాబుకు క‌థ చెప్పిన సుధ కొంగ‌ర‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మొద‌ట్నుంచి టాలీవుడ్‌కే ప‌రిమితం అయిపోయాడు కానీ.. త‌న‌కు ఇత‌ర భాష‌ల్లోనూ మంచి డిమాండే ఉంది.…

9 hours ago

తెలంగాణా ప్రభుత్వంలో కొత్త రక్తం అవసరం

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తుంది. మరో రెండేళ్లలో ఎన్నికలకు సమాయాత్తం కావల్సి ఉంటుంది. ఈ…

11 hours ago

టాలీవుడ్ సినిమాకు భాషా భేదాలుండవు

సోషల్ మీడియాలో టాలీవుడ్ నెటిజెన్లు ఒక్కోసారి మహా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సున్నితమైన అంశాల మీద ఊరికే సాగదీస్తూ మా…

13 hours ago

కింగ్ VS కింగ్ 100… మంచి చిక్కే

బాక్సాఫీస్ వద్ద ఈసారి ఆసక్తికరమైన క్లాష్ నెలకొనబోతోంది. నాగార్జున వందో సినిమా కింగ్ 100 విడుదల తేదీని ఇవాళ ప్రకటించిన…

13 hours ago