Trends

సెమీస్‌ కోసం టీమిండియాకు మైండ్ గేమ్.. సమస్యేమిటంటే..

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్‌ దశను అజేయంగా ముగించిన టీమిండియా సెమీఫైనల్లో ఆసీస్‌తో తలపడనుంది. అయితే ఇటీవల రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తుది జట్టు ఎంపిక సవాలుగా మారిందని, కచ్చితమైన సమీకరణాలు అవసరమని అతడు చెప్పిన మాటలు మేనేజ్‌మెంట్ ఆలోచనలో పడేసినట్టు కనిపిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో మార్పులు పెద్దగా ఉండకపోయినా, బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో మాత్రం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

బ్యాటింగ్‌లో ఇప్పటివరకు టీమిండియాకు పెద్దగా సమస్యలు ఎదురవ్వలేదు. అయితే వికెట్ కీపింగ్ అంశంలో మార్పు అవసరం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. కేఎల్ రాహుల్ స్పిన్ బౌలింగ్‌కు కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపించడంతో, ఆసీస్‌పై రిషభ్ పంత్‌ను ఆడించే ఆలోచనలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాపై పంత్‌కు ఉన్న రికార్డు, అతడి స్వభావం దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు జరుగుతుందా అనేది ఆసక్తిగా మారింది. మిగిలిన టాప్ ఆర్డర్‌లో మార్పు జరగే అవకాశం తక్కువ.

స్పిన్ బౌలింగ్‌ విభాగం ఈ మ్యాచ్‌కు కీలకంగా మారనుంది. న్యూజిలాండ్‌పై వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శన కనబర్చినప్పటికీ, జడేజాకు విశ్రాంతి ఇచ్చి వాషింగ్టన్ సుందర్‌ను ఆడించొచ్చనే చర్చ నడుస్తోంది. ఆసీస్ బ్యాటింగ్ లైనప్ స్పిన్‌ను మెరుగుగా ఆడేలా మారినప్పటికీ, దుబాయ్ పిచ్ నెమ్మదిగా మారుతుండటంతో నాలుగు స్పిన్నర్ల కాంబినేషన్‌ను మళ్లీ వాడాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పేస్ విభాగంలో మూడో పేసర్ విషయంలో సందేహాలు ఉన్నాయి. షమీ మోకాలి నొప్పి సమస్యతో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయలేకపోవడంతో, అర్ష్‌దీప్ లేదా హర్షిత్ రాణాకు ఛాన్స్ ఇచ్చే అవకాశముంది. హార్దిక్ పాండ్య కొత్త బంతితో కూడా మెరుగైన స్పెల్స్ వేస్తుండటంతో, ఈ మ్యాచ్‌లో అతడి బౌలింగ్ టీమిండియాకు కీలకమవ్వనుంది. మొత్తంగా, టీమిండియా తుది జట్టులో ఒక్కటీ మారకపోవచ్చు లేదా వికెట్ కీపింగ్, స్పిన్ విభాగాల్లో తేలికపాటి మార్పులు ఉండొచ్చు. సెమీఫైనల్లో ఆసీస్‌పై మెరుగైన ప్రదర్శన చేయాలని భారత్ భావిస్తుండగా, తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందనేది అభిమానుల్లో ఆసక్తిగా మారింది.

టీమిండియా 11 (అంచనా)

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ / రిషభ్ పంత్, హార్దిక్‌ పాండ్య, జడేజా/సుందర్, కుల్‌దీప్‌ యాదవ్, వరుణ్‌ చక్రవర్తి, అర్ష్‌దీప్/షమీ

This post was last modified on March 3, 2025 7:40 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పలాస దర్శకుడికి విషమ పరీక్ష

ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…

2 hours ago

నిజాం గడ్డపై ‘కింగ్’ కన్ను

అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…

4 hours ago

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

9 hours ago

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

10 hours ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

11 hours ago

లడ్డూ తయారిలో 58 లక్షల లీటర్ల పామాయిల్?

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…

11 hours ago