Trends

న్యూజిలాండ్‌పై టీమిండియా భారీ విజయం, సెమీస్ వీళ్ళతోనే…

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా మరో విజయం నమోదు చేసింది. ఇప్పటికే సెమీ ఫైనల్‌కు అర్హత సాధించిన భారత్, న్యూజిలాండ్‌తో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచిన టీమిండియా, సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్‌ తక్కువ స్కోర్‌కే కుప్పకూలింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్, 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (79), హార్దిక్ పాండ్యా (45), అక్షర్ పటేల్ (42) కీలక ఇన్నింగ్స్‌లతో టీమిండియాను పోటీకి తగిన స్థితికి చేర్చారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ (5/42) ఐదు వికెట్లు తీయగా, మిగతా బౌలర్లు భారత బ్యాటర్లను పూర్తిగా కట్టడి చేయలేకపోయారు.

లక్ష్య చేధనలో న్యూజిలాండ్‌కు శుభారంభం దక్కలేదు. తొలుత రచిన్ రవీంద్ర (6) తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరాడు. కేన్ విలియమ్సన్ (81) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కానీ మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. వరుణ్ చక్రవర్తి (5/42) విజృంభించి కివీస్ పతనాన్ని శాసించగా, కుల్దీప్ యాదవ్ (2/56), హార్దిక్, అక్షర్, జడేజా తలో వికెట్ తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.

భారత బౌలింగ్‌లో ముఖ్యంగా స్పిన్నర్లు తమ జోరు చూపారు. కుల్దీప్, వరుణ్ జోడీ మిడిలార్డర్‌ను కుదిపివేసింది. హార్దిక్ తొలుత విల్ యంగ్ (22)ను పెవిలియన్ పంపించగా, అనంతరం వరుసగా వికెట్లు తీసిన టీమిండియా మ్యాచ్‌ను తమ గడపదాటించింది.

ఈ విజయంతో సెమీ ఫైనల్‌లో భారత్-ఆస్ట్రేలియా పోరు మరింత ఆసక్తిగా మారింది. టీమిండియా ఇప్పటికే మంచి ఫామ్‌లో ఉండటంతో ఆసీస్‌పై గెలిచి ఫైనల్‌ చేరేందుకు సిద్ధమవుతోంది. మరి మంగళవారం జరిగే హై ఓల్టేజ్ పోరులో టీమిండియా మళ్లీ తన సత్తా చాటుతుందా? అన్నది చూడాల్సిందే.

This post was last modified on March 2, 2025 10:32 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

28 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago