ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా మరో విజయం నమోదు చేసింది. ఇప్పటికే సెమీ ఫైనల్కు అర్హత సాధించిన భారత్, న్యూజిలాండ్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్-ఏ టాపర్గా నిలిచిన టీమిండియా, సెమీస్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్ తక్కువ స్కోర్కే కుప్పకూలింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్, 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (79), హార్దిక్ పాండ్యా (45), అక్షర్ పటేల్ (42) కీలక ఇన్నింగ్స్లతో టీమిండియాను పోటీకి తగిన స్థితికి చేర్చారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ (5/42) ఐదు వికెట్లు తీయగా, మిగతా బౌలర్లు భారత బ్యాటర్లను పూర్తిగా కట్టడి చేయలేకపోయారు.
లక్ష్య చేధనలో న్యూజిలాండ్కు శుభారంభం దక్కలేదు. తొలుత రచిన్ రవీంద్ర (6) తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరాడు. కేన్ విలియమ్సన్ (81) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కానీ మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. వరుణ్ చక్రవర్తి (5/42) విజృంభించి కివీస్ పతనాన్ని శాసించగా, కుల్దీప్ యాదవ్ (2/56), హార్దిక్, అక్షర్, జడేజా తలో వికెట్ తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.
భారత బౌలింగ్లో ముఖ్యంగా స్పిన్నర్లు తమ జోరు చూపారు. కుల్దీప్, వరుణ్ జోడీ మిడిలార్డర్ను కుదిపివేసింది. హార్దిక్ తొలుత విల్ యంగ్ (22)ను పెవిలియన్ పంపించగా, అనంతరం వరుసగా వికెట్లు తీసిన టీమిండియా మ్యాచ్ను తమ గడపదాటించింది.
ఈ విజయంతో సెమీ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా పోరు మరింత ఆసక్తిగా మారింది. టీమిండియా ఇప్పటికే మంచి ఫామ్లో ఉండటంతో ఆసీస్పై గెలిచి ఫైనల్ చేరేందుకు సిద్ధమవుతోంది. మరి మంగళవారం జరిగే హై ఓల్టేజ్ పోరులో టీమిండియా మళ్లీ తన సత్తా చాటుతుందా? అన్నది చూడాల్సిందే.
This post was last modified on March 2, 2025 10:32 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…