Trends

న్యూజిలాండ్‌పై టీమిండియా భారీ విజయం, సెమీస్ వీళ్ళతోనే…

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా మరో విజయం నమోదు చేసింది. ఇప్పటికే సెమీ ఫైనల్‌కు అర్హత సాధించిన భారత్, న్యూజిలాండ్‌తో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచిన టీమిండియా, సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్‌ తక్కువ స్కోర్‌కే కుప్పకూలింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్, 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (79), హార్దిక్ పాండ్యా (45), అక్షర్ పటేల్ (42) కీలక ఇన్నింగ్స్‌లతో టీమిండియాను పోటీకి తగిన స్థితికి చేర్చారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ (5/42) ఐదు వికెట్లు తీయగా, మిగతా బౌలర్లు భారత బ్యాటర్లను పూర్తిగా కట్టడి చేయలేకపోయారు.

లక్ష్య చేధనలో న్యూజిలాండ్‌కు శుభారంభం దక్కలేదు. తొలుత రచిన్ రవీంద్ర (6) తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరాడు. కేన్ విలియమ్సన్ (81) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కానీ మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. వరుణ్ చక్రవర్తి (5/42) విజృంభించి కివీస్ పతనాన్ని శాసించగా, కుల్దీప్ యాదవ్ (2/56), హార్దిక్, అక్షర్, జడేజా తలో వికెట్ తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.

భారత బౌలింగ్‌లో ముఖ్యంగా స్పిన్నర్లు తమ జోరు చూపారు. కుల్దీప్, వరుణ్ జోడీ మిడిలార్డర్‌ను కుదిపివేసింది. హార్దిక్ తొలుత విల్ యంగ్ (22)ను పెవిలియన్ పంపించగా, అనంతరం వరుసగా వికెట్లు తీసిన టీమిండియా మ్యాచ్‌ను తమ గడపదాటించింది.

ఈ విజయంతో సెమీ ఫైనల్‌లో భారత్-ఆస్ట్రేలియా పోరు మరింత ఆసక్తిగా మారింది. టీమిండియా ఇప్పటికే మంచి ఫామ్‌లో ఉండటంతో ఆసీస్‌పై గెలిచి ఫైనల్‌ చేరేందుకు సిద్ధమవుతోంది. మరి మంగళవారం జరిగే హై ఓల్టేజ్ పోరులో టీమిండియా మళ్లీ తన సత్తా చాటుతుందా? అన్నది చూడాల్సిందే.

This post was last modified on March 2, 2025 10:32 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

దీదీను ఓ రేంజ్‌లో టెన్ష‌న్ పెట్టేస్తున్న బీజేపీ!

ప‌శ్చిమ బెంగాల్‌లో అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గ‌త మూడు సార్లుగా ఇక్క‌డ అధికారంలో ఉన్న దీదీ..…

9 minutes ago

పవన్, ఫాన్స్ ఉన్నారు… హైప్ వస్తుందిలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…

2 hours ago

డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…

5 hours ago

40 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…

5 hours ago

టికెట్ రేట్ల పెంపు లేదు… అయినా హ్యాపీనే

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…

6 hours ago

SRH ఈ హెచ్చరికలు వినాల్సిందే..

'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…

8 hours ago