Trends

రోహిత్.. నెక్స్ట్ మ్యాచ్ కష్టమేనా?

టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తన సెమీఫైనల్ బెర్త్‌ను ఇప్పటికే ఖాయం చేసుకున్నా, లేటెస్ట్ గా ఒక విషయం జట్టును కొత్త ఆలోచనలకు దారితీస్తోంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో తొడ కండరాల గాయానికి గురైన కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్‌తో లీగ్ చివరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండేనా? లేదా విశ్రాంతి తీసుకుంటాడా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

రెండు రోజుల విరామం అనంతరం బుధవారం భారత జట్టు తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించింది. అయితే, రోహిత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయకుండా కేవలం జాగింగ్, ఫిజియో థెరపీకి పరిమితమయ్యాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్ మర్చి 2న ఉన్న నేపథ్యంలో, రోహిత్‌కి పూర్తి విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సెమీఫైనల్ (మార్చి 4) ముందు అతని గాయం మరింత తీవ్రతరం కాకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే, రోహిత్ ఆడకపోతే జట్టులో మార్పులు అనివార్యమవుతాయి. రిషభ్ పంత్ లేదా వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ నెట్స్‌లో వీరిద్దరూ ఎక్కువ సమయం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే, శుభ్‌మన్ గిల్‌తో కలసి ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేయడానికి కెఎల్ రాహుల్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.

టీమిండియా ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది కాబట్టి, న్యూజిలాండ్‌పై గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తుందా? లేదా కీలక ఆటగాళ్లను విశ్రాంతికి పంపించి జట్టును కచ్చితంగా సెమీస్‌కు సిద్ధం చేసుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా, రోహిత్ ఫిట్‌నెస్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకునే నిర్ణయం టీమిండియా విజయ పరంపరపై ప్రభావం చూపనుంది.

Kumar

Recent Posts

స్పందించిన బన్నీ… సర్దుకుంటాయా అన్నీ

మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…

4 minutes ago

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…

53 minutes ago

రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…

1 hour ago

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

2 hours ago

AA23 విలన్ పైనే అందరి కన్ను!

అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…

2 hours ago

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…

4 hours ago