టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తన సెమీఫైనల్ బెర్త్ను ఇప్పటికే ఖాయం చేసుకున్నా, లేటెస్ట్ గా ఒక విషయం జట్టును కొత్త ఆలోచనలకు దారితీస్తోంది. పాకిస్థాన్తో మ్యాచ్లో తొడ కండరాల గాయానికి గురైన కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్తో లీగ్ చివరి మ్యాచ్కు అందుబాటులో ఉండేనా? లేదా విశ్రాంతి తీసుకుంటాడా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
రెండు రోజుల విరామం అనంతరం బుధవారం భారత జట్టు తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించింది. అయితే, రోహిత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయకుండా కేవలం జాగింగ్, ఫిజియో థెరపీకి పరిమితమయ్యాడు. న్యూజిలాండ్తో మ్యాచ్ మర్చి 2న ఉన్న నేపథ్యంలో, రోహిత్కి పూర్తి విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సెమీఫైనల్ (మార్చి 4) ముందు అతని గాయం మరింత తీవ్రతరం కాకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే, రోహిత్ ఆడకపోతే జట్టులో మార్పులు అనివార్యమవుతాయి. రిషభ్ పంత్ లేదా వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ నెట్స్లో వీరిద్దరూ ఎక్కువ సమయం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే, శుభ్మన్ గిల్తో కలసి ఇన్నింగ్స్ను ఓపెన్ చేయడానికి కెఎల్ రాహుల్ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.
టీమిండియా ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది కాబట్టి, న్యూజిలాండ్పై గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తుందా? లేదా కీలక ఆటగాళ్లను విశ్రాంతికి పంపించి జట్టును కచ్చితంగా సెమీస్కు సిద్ధం చేసుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా, రోహిత్ ఫిట్నెస్పై టీమ్ మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయం టీమిండియా విజయ పరంపరపై ప్రభావం చూపనుంది.
This post was last modified on February 28, 2025 7:38 am
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…