Trends

రోహిత్.. నెక్స్ట్ మ్యాచ్ కష్టమేనా?

టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తన సెమీఫైనల్ బెర్త్‌ను ఇప్పటికే ఖాయం చేసుకున్నా, లేటెస్ట్ గా ఒక విషయం జట్టును కొత్త ఆలోచనలకు దారితీస్తోంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో తొడ కండరాల గాయానికి గురైన కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్‌తో లీగ్ చివరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండేనా? లేదా విశ్రాంతి తీసుకుంటాడా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

రెండు రోజుల విరామం అనంతరం బుధవారం భారత జట్టు తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించింది. అయితే, రోహిత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయకుండా కేవలం జాగింగ్, ఫిజియో థెరపీకి పరిమితమయ్యాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్ మర్చి 2న ఉన్న నేపథ్యంలో, రోహిత్‌కి పూర్తి విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సెమీఫైనల్ (మార్చి 4) ముందు అతని గాయం మరింత తీవ్రతరం కాకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే, రోహిత్ ఆడకపోతే జట్టులో మార్పులు అనివార్యమవుతాయి. రిషభ్ పంత్ లేదా వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ నెట్స్‌లో వీరిద్దరూ ఎక్కువ సమయం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే, శుభ్‌మన్ గిల్‌తో కలసి ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేయడానికి కెఎల్ రాహుల్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.

టీమిండియా ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది కాబట్టి, న్యూజిలాండ్‌పై గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తుందా? లేదా కీలక ఆటగాళ్లను విశ్రాంతికి పంపించి జట్టును కచ్చితంగా సెమీస్‌కు సిద్ధం చేసుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా, రోహిత్ ఫిట్‌నెస్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకునే నిర్ణయం టీమిండియా విజయ పరంపరపై ప్రభావం చూపనుంది.

Kumar

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

2 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

2 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

3 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

4 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

4 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

4 hours ago