మహ్మద్ షమీ వన్డే క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో 5 వికెట్లు తీసిన షమీ, వన్డేల్లో 200 వికెట్లు పూర్తిచేసుకున్నాడు. ఇది అతని 103వ ఇన్నింగ్స్, ఈ ఫీట్ను సాధించిన భారత బౌలర్లలో అతనెవ్వరూ లేని వేగంలో ఉన్నారు. షమీ కేవలం 5126 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకుని మిచెల్ స్టార్క్, సక్లైన్ ముస్తాక్, బ్రెట్ లీ వంటి దిగ్గజాలను వెనక్కు నెట్టాడు.
ఇప్పటి వరకు ఈ ఘనత అజిత్ అగార్కర్(133 ఇన్నింగ్స్) దగ్గర ఉండగా, షమీ 30 ఇన్నింగ్స్ తక్కువలోనే ఆ రికార్డును తుడిచేసాడు. అలాగే జహీర్ ఖాన్ (144 ఇన్నింగ్స్), అనిల్ కుంబ్లే (147 ఇన్నింగ్స్)లను చాలా దూరం వెనక్కు పెట్టాడు. ఈ అద్భుత ప్రదర్శన షమిని వన్డే క్రికెట్లో భారత అత్యుత్తమ పేసర్గా నిలబెట్టింది.
అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్లలో షమీ ఇప్పుడు 202 వికెట్లు తీసుకొని జడేజా (226), కపిల్ దేవ్ (253), హర్భజన్ సింగ్ (265) తర్వాత ఉన్నాడు. వయసు పెరిగే కొద్దీ అతని బౌలింగ్లో పటుత్వం మరింత పెరగడం గమనార్హం. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతని యార్కర్లు బ్యాట్స్మెన్కు చుక్కలు చూపిస్తున్నాయి.
కేవలం భారత పరిమితిలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా షమీ తన స్థానాన్ని బలపరుస్తున్నాడు. ప్రపంచ స్థాయి పేసర్లలో అత్యంత వేగంగా 200 వికెట్లు సాధించిన ఆటగాడు స్టార్క్ (102 మ్యాచ్లు) మాత్రమే. షమీ 104 మ్యాచ్ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. బంతుల పరంగా చూస్తే, అతను స్టార్క్ (5420 బంతులు) కంటే 294 బంతులు తక్కువలోనే ఈ ఫీట్ సాధించడం విశేషం.
ఈ చరిత్రాత్మక విజయంతో, షమీ భారత పేస్ బౌలింగ్కి కొత్త రూపం ఇచ్చాడని చెప్పవచ్చు. అతని పేస్, లైన్, లెంగ్త్ కంట్రోల్, అలాగే వికెట్లు తీయడంలోని నైపుణ్యం టీమిండియాకి కీలక బలంగా మారింది. ఈ ఫామ్ ఇలానే కొనసాగితే, షమీ మరిన్ని రికార్డులను తన ఖాతాలోకి జమ చేసుకోవడం ఖాయం.
This post was last modified on February 20, 2025 7:08 pm
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…
వైసీపీలో మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి శకం ప్రారంభం అవుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్..…