ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు రంగం సిద్ధమైంది. పాకిస్తాన్, దుబాయ్ వేదికగా హైబ్రిడ్ మోడ్లో జరుగుతున్న ఈ టోర్నీలో టీమిండియా దుబాయ్లోనే అన్ని మ్యాచ్లు ఆడనుంది. బంగ్లాదేశ్తో రేపటి మ్యాచ్తో భారత్ తన జర్నీ ప్రారంభించనుంది. 1998లో నాకౌట్ ట్రోఫీగా ప్రారంభమైన ఈ టోర్నీ 2017 వరకు కొనసాగింది. 2021లో రద్దు చేసిన తర్వాత, 2025లో మళ్లీ పునరుద్ధరించడం క్రికెట్ అభిమానులను ఉత్సాహంలో ముంచేసింది.
1998లో మొదటి ఛాంపియన్స్ ట్రోఫీని దక్షిణాఫ్రికా గెలుచుకుంది. సెమీస్లో టీమిండియా వెస్టిండీస్ చేతిలో ఓడిపోగా, హాన్సీ క్రోనీ అద్భుత ఇన్నింగ్స్, జాక్వెస్ కాలిస్ ఐదు వికెట్లతో ప్రోటీస్ జట్టు విజయం సాధించింది. 2000లో న్యూజిలాండ్ కివీస్ తన తొలి టైటిల్ను కైవసం చేసుకుంది, ఆ ఫైనల్లో భారత్ రన్నరప్గా నిలిచింది.
2002లో వర్షం కారణంగా భారత్, శ్రీలంక ఉమ్మడి విజేతలుగా నిలిచాయి. 2004లో వెస్టిండీస్ చాంపియన్గా అవతరించగా, 2006లో ఆస్ట్రేలియా తన తొలి ట్రోఫీని గెలుచుకుంది. ఆసీస్ 2009లో వరుసగా రెండోసారి విజయం సాధించి, అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.
2013లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో భారత్ మళ్లీ ట్రోఫీని సొంతం చేసుకుంది. 2017లో చివరి సారిగా జరిగిన టోర్నీలో పాకిస్తాన్ భారత్ను 180 పరుగుల తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు 2025లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.
This post was last modified on February 19, 2025 3:48 pm
బాక్సాఫీస్ వద్ద కరుప్పు / వీరభద్రుడు జోరు బాగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో రికార్డులు రాసే దిశగా పరుగులు పెడుతోంది.…
హఠాత్తుగా పెద్ది సినారియో మారిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ది గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారనుకుంటే దానికి భిన్నంగా…
మంచు మనోజ్.. కొన్నేళ్ల ముందు భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అది అతడికి రెండో పెళ్లి. మరోవైపు…
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్లోని గదికి…
రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పదవిపై మోజులేదు. నేనే చెప్పి ఒప్పించా. వచ్చే ఎన్నికల్లోనే రాహుల్ ను ప్రదానిని చేసేందుకు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఘన విజయం సాధించింది. ఫలితంగా సినిమాల్లో…