Trends

చాంపియన్స్‌ ట్రోఫీకి బుమ్రా దూరం… ఫైనల్ టీమ్ ఇదే!

భారత క్రికెట్ జట్టుకు ప్రధాన ఆయుధం జస్ప్రీత్‌ బుమ్రా. అతను ఉంటే సగం మ్యాచ్ గెలిచినట్లే అని చాలాసార్లు రుజువైంది. గత టీ20 వరల్డ్ కప్ లో ఓటమి అంచున ఉన్న జట్టుకు తన బౌలింగ్ తో గెలుపు తీరాలకు చేర్చాడు. అయితే అలాంటి బౌలర్ చాంపియన్స్‌ ట్రోఫీకి మరో ఆయుధంగా నిలుస్తాడు అని అందరూ అనుకుకున్నారు. కానీ ఊహించని విధంగా టీమ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్న స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఈ టోర్నీకి అందుబాటులో ఉండబోడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేకపోవడంతో బుమ్రాను జట్టు నుంచి తప్పించి, అతని స్థానంలో యువ పేసర్‌ హర్షిత్‌ రాణాను ఎంపిక చేశారు. ఈ నిర్ణయం భారత బౌలింగ్‌ విభాగానికి భారీ సమస్యగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గత నెలలోనే బుమ్రా పేరును భారత జట్టులో చేర్చినప్పటికీ, ఫిట్‌నెస్‌పై సందేహాలు కొనసాగాయి. అతను బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (NCA) లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నప్పటికీ, ఇప్పటికీ 100% ఫిట్‌నెస్‌ సాధించలేదని వైద్య బృందం తేల్చిచెప్పింది. గాయంతో ఆడితే మళ్ళీ ఎక్కువ ఇబ్బంది పడే ప్రమాదం ఉన్నందున అతన్ని జట్టులో కొనసాగించకుండా సెలక్టర్లు కొత్త ప్రత్యామ్నాయాన్ని వెతికారు. చివరకు యువ బౌలర్‌ హర్షిత్‌ రాణాకు అవకాశం లభించింది.

చాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ కీలకమైన బౌలర్‌ను కోల్పోవడం జట్టు వ్యూహాలకు పెద్ద దెబ్బ అని నిపుణులు చెబుతున్నారు. బుమ్రా అనుభవం, అతని యార్కర్లు, డెత్‌ ఓవర్లలో అతని ప్రభావం టీమిండియాకు ఎంతో అవసరమైన అంశాలు. అయితే, ఈ నిర్ణయంతో యువ పేసర్‌ హర్షిత్‌ రాణాకు అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభించింది. మరోవైపు, బుమ్రా మార్చి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ నాటికి మైదానంలోకి రాకపోవచ్చని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భారత జట్టులో తాజా మార్పుల తర్వాత అంచనా వేయబడిన జట్టులో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, మహమ్మద్‌ షమీ, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, హర్షిత్‌ రాణా, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, శ్రేయస్‌ అయ్యర్‌, యశస్వి జైస్వాల్‌, వరుణ్‌ చక్రవర్తి వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఈ మార్పులు భారత జట్టుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.

This post was last modified on February 12, 2025 2:03 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago