Trends

చాంపియన్స్‌ ట్రోఫీకి బుమ్రా దూరం… ఫైనల్ టీమ్ ఇదే!

భారత క్రికెట్ జట్టుకు ప్రధాన ఆయుధం జస్ప్రీత్‌ బుమ్రా. అతను ఉంటే సగం మ్యాచ్ గెలిచినట్లే అని చాలాసార్లు రుజువైంది. గత టీ20 వరల్డ్ కప్ లో ఓటమి అంచున ఉన్న జట్టుకు తన బౌలింగ్ తో గెలుపు తీరాలకు చేర్చాడు. అయితే అలాంటి బౌలర్ చాంపియన్స్‌ ట్రోఫీకి మరో ఆయుధంగా నిలుస్తాడు అని అందరూ అనుకుకున్నారు. కానీ ఊహించని విధంగా టీమ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్న స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఈ టోర్నీకి అందుబాటులో ఉండబోడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేకపోవడంతో బుమ్రాను జట్టు నుంచి తప్పించి, అతని స్థానంలో యువ పేసర్‌ హర్షిత్‌ రాణాను ఎంపిక చేశారు. ఈ నిర్ణయం భారత బౌలింగ్‌ విభాగానికి భారీ సమస్యగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గత నెలలోనే బుమ్రా పేరును భారత జట్టులో చేర్చినప్పటికీ, ఫిట్‌నెస్‌పై సందేహాలు కొనసాగాయి. అతను బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (NCA) లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నప్పటికీ, ఇప్పటికీ 100% ఫిట్‌నెస్‌ సాధించలేదని వైద్య బృందం తేల్చిచెప్పింది. గాయంతో ఆడితే మళ్ళీ ఎక్కువ ఇబ్బంది పడే ప్రమాదం ఉన్నందున అతన్ని జట్టులో కొనసాగించకుండా సెలక్టర్లు కొత్త ప్రత్యామ్నాయాన్ని వెతికారు. చివరకు యువ బౌలర్‌ హర్షిత్‌ రాణాకు అవకాశం లభించింది.

చాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ కీలకమైన బౌలర్‌ను కోల్పోవడం జట్టు వ్యూహాలకు పెద్ద దెబ్బ అని నిపుణులు చెబుతున్నారు. బుమ్రా అనుభవం, అతని యార్కర్లు, డెత్‌ ఓవర్లలో అతని ప్రభావం టీమిండియాకు ఎంతో అవసరమైన అంశాలు. అయితే, ఈ నిర్ణయంతో యువ పేసర్‌ హర్షిత్‌ రాణాకు అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభించింది. మరోవైపు, బుమ్రా మార్చి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌ నాటికి మైదానంలోకి రాకపోవచ్చని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భారత జట్టులో తాజా మార్పుల తర్వాత అంచనా వేయబడిన జట్టులో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, మహమ్మద్‌ షమీ, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, హర్షిత్‌ రాణా, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, శ్రేయస్‌ అయ్యర్‌, యశస్వి జైస్వాల్‌, వరుణ్‌ చక్రవర్తి వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇక ఈ మార్పులు భారత జట్టుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.

This post was last modified on February 12, 2025 2:03 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఈ సారి అమరావతికి మోదీ ఎం తెస్తున్నారు?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…

2 hours ago

పొట్ట తగ్గటానికి ఈ పండ్లు తింటే చాలు

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…

4 hours ago

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు

ఏపీ మంత్రి వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు గీస్తున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌కు.. ఆయ‌న ఆదేశాల‌కు కూడా.. పెద్ద‌గా రెస్పాన్స్ ఉండ‌డం లేద‌ని…

4 hours ago

గాయకుడి విమర్శ…రెహమాన్ చెంపపెట్టు సమాధానం

సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…

5 hours ago

‘వక్ఫ్’పై విచారణ.. కేంద్రానికి ‘సుప్రీం’ ప్రశ్న

యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…

6 hours ago

దర్శకుడి ఆవేదనలో న్యాయముంది కానీ

నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…

6 hours ago