ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్ ను భారత్ వైపు తిప్పేలా తన మిస్టరీ స్పిన్ తో మాయ చేశాడు. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో మొత్తం 14 వికెట్లు తీసిన అతను, ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్గా చరిత్రకెక్కాడు. చివరి మ్యాచ్లో 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీయడంతో, ఈ అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు.
వరుణ్ ఈ రికార్డుతో న్యూజిలాండ్ స్పిన్నర్ ఇష్ సోధిని అధిగమించాడు. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో సోధి 13 వికెట్లు తీయగా, వరుణ్ ఇప్పుడు ఆ మార్క్ను దాటేశాడు. అంతేకాదు, ఓ టీ20 సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ పేసర్ జాసన్ హోల్డర్ 15 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:
జాసన్ హోల్డర్ (వెస్టిండీస్) – 15 వికెట్లు
సమీ సోహైల్ (మలావి) – 14 వికెట్లు
వరుణ్ చక్రవర్తి (భారత్) – 14 వికెట్లు
ఇష్ సోధి (న్యూజిలాండ్) – 13 వికెట్లు
చార్లెస్ హింజ్ (జపాన్) – 13 వికెట్లు
ఈ సిరీస్ ద్వారా వరుణ్ నెక్స్ట్ టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించుకునే అవకాశాలను మరింత బలపరిచాడు. గతంలోనూ ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఎంపికైన అతను, ఇప్పుడు భారత జట్టులో తన స్థానం పటిష్ఠం చేసుకునే దిశగా ముందుకెళ్తున్నాడు. అభిమానులు ఇప్పుడు వరుణ్ని కీలక ఆటగాడిగా చూస్తున్నారు.
This post was last modified on February 3, 2025 1:09 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…