ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్ ను భారత్ వైపు తిప్పేలా తన మిస్టరీ స్పిన్ తో మాయ చేశాడు. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో మొత్తం 14 వికెట్లు తీసిన అతను, ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్గా చరిత్రకెక్కాడు. చివరి మ్యాచ్లో 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీయడంతో, ఈ అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు.
వరుణ్ ఈ రికార్డుతో న్యూజిలాండ్ స్పిన్నర్ ఇష్ సోధిని అధిగమించాడు. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో సోధి 13 వికెట్లు తీయగా, వరుణ్ ఇప్పుడు ఆ మార్క్ను దాటేశాడు. అంతేకాదు, ఓ టీ20 సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ పేసర్ జాసన్ హోల్డర్ 15 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఓ ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:
జాసన్ హోల్డర్ (వెస్టిండీస్) – 15 వికెట్లు
సమీ సోహైల్ (మలావి) – 14 వికెట్లు
వరుణ్ చక్రవర్తి (భారత్) – 14 వికెట్లు
ఇష్ సోధి (న్యూజిలాండ్) – 13 వికెట్లు
చార్లెస్ హింజ్ (జపాన్) – 13 వికెట్లు
ఈ సిరీస్ ద్వారా వరుణ్ నెక్స్ట్ టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించుకునే అవకాశాలను మరింత బలపరిచాడు. గతంలోనూ ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఎంపికైన అతను, ఇప్పుడు భారత జట్టులో తన స్థానం పటిష్ఠం చేసుకునే దిశగా ముందుకెళ్తున్నాడు. అభిమానులు ఇప్పుడు వరుణ్ని కీలక ఆటగాడిగా చూస్తున్నారు.
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…