Trends

రోహిత్ సేన స్టైల్ లోనే అమ్మాయిల వరల్డ్ కప్ ఫైట్స్

మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్‌ క్లాష్ కూడా టీమిండియా మేన్స్ తరహాలో కొనసాగుతుండడం విశేషం. 2024 మేన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఇంగ్లండ్ ను రోహిత్ సేన ఓడించింది. ఇక ఆ తరువాత సౌత్ ఆఫ్రికాతో ఫైనల్స్ లో తలపడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అండర్ 19 అమ్మాయిల జట్టు కూడా అదే తరహాలో వెళ్లడం విశేషం.

భారత అండర్-19 యువ మహిళలు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరారు. మలేసియాలో జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌లో ఇంగ్లండ్‌ను సెమీఫైనల్‌లో ఓడించి, మరో ఘన విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ బరిలోకి దిగగా, ఓపెనర్లు ధాటిగా ఆడుతూ విజయం సులభం చేశారు. కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి, ఇంకా 30 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకున్నారు.

భారత ఇన్నింగ్స్‌కు మంచి శుభారంభం లభించింది. ఓపెనర్ గొంగడి త్రిష 35 పరుగులతో ఆకట్టుకోగా, మరో ఓపెనర్ కమిలిని అర్ధశతకంతో అదరగొట్టింది. వీరిద్దరు కలిసి మొదటి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం అందించడంతో జట్టు విజయానికి బలమైన పునాది ఏర్పడింది. త్రిష అవుట్ అయిన తర్వాత కమిలిని ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడి మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వశం చేసుకుంది. 47 బంతుల్లో 7 బౌండరీలతో 56 పరుగులు చేసిన కమిలిని జట్టును విజయం వరకు నడిపింది.

ఇంతకు ముందు, టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లు ఈ విజయానికి బలమైన బేస్ అందించారు. పరునిక సిసోడియా, వైష్ణవి శర్మ చెరో 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. 4 ఓవర్లలో కేవలం 21 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసిన సిసోడియా అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకుంది.

ఈ విజయంతో భారత యువ మహిళల జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ కోసం దక్షిణాఫ్రికాతో తలపడనుండటంతో క్రికెట్ ప్రేమికులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత జట్టు, చివరి క్లాష్ లో కూడా అదే దూకుడు కొనసాగిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది.

గత ఏడాది జరిగిన మెన్స్ టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ సేన సౌత్ ఆఫ్రికాను ఓడించి ఛాంపియన్స్ గా నిలిచింది. ఇక ఇప్పుడు అండర్ 19 అమ్మాయిలు కూడా అదే తరహాలో పోరాడి ఛాంపియన్స్ గా నిలుస్తారేమో చూడాలి.

Kumar

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

2 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

2 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

3 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

4 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

4 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

4 hours ago