అమెరికాలో మిలటరీ హెలికాప్టర్, ప్రయాణికులతో వెళ్తున్న విమానం మధ్య జరిగిన ఘర్షణలో 64 మంది ప్రయాణికులు, ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటివరకు 27 మంది ప్రయాణికుల మృతదేహాలు, హెలికాప్టర్ లోని ఒక దేహాన్ని బయటకు తీశారు. మిగతా మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఈ ఘటన వర్జీనియాలోని రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్పోర్టు సమీపంలో జరిగింది. విమానం ల్యాండ్ అవుతుండగా ఎదురుగా వచ్చిన మిలటరీ హెలికాప్టర్ ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో భారీ పేలుడు సంభవించి, రెండు వాహనాలు పొటోమాక్ నదిలో కూలిపోయాయి. ప్రమాద తీవ్రతను బట్టి విమానంలోని ప్రయాణికులెవరూ బతికే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు.
అదే సమయంలో ఎయిర్పోర్టు పరిధిలోని అన్ని విమానాల టేకాఫ్, ల్యాండింగ్స్ను నిలిపివేశారు. విమానాశ్రయం సిబ్బంది ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. పొటోమాక్ నదిలో హెలికాప్టర్, విమానం శకలాలను వెతికే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే రక్షణ చర్యలు ప్రారంభించినప్పటికీ, ఎవ్వరినీ సజీవంగా కాపాడలేకపోయామని అధికారులు తెలిపారు. మిలటరీ హెలికాప్టర్, విమానం మధ్య ఈ ఘర్షణ ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది? ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
This post was last modified on January 30, 2025 10:29 pm
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ…
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే…
నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…