అమెరికాలో మిలటరీ హెలికాప్టర్, ప్రయాణికులతో వెళ్తున్న విమానం మధ్య జరిగిన ఘర్షణలో 64 మంది ప్రయాణికులు, ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటివరకు 27 మంది ప్రయాణికుల మృతదేహాలు, హెలికాప్టర్ లోని ఒక దేహాన్ని బయటకు తీశారు. మిగతా మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఈ ఘటన వర్జీనియాలోని రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్పోర్టు సమీపంలో జరిగింది. విమానం ల్యాండ్ అవుతుండగా ఎదురుగా వచ్చిన మిలటరీ హెలికాప్టర్ ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో భారీ పేలుడు సంభవించి, రెండు వాహనాలు పొటోమాక్ నదిలో కూలిపోయాయి. ప్రమాద తీవ్రతను బట్టి విమానంలోని ప్రయాణికులెవరూ బతికే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు.
అదే సమయంలో ఎయిర్పోర్టు పరిధిలోని అన్ని విమానాల టేకాఫ్, ల్యాండింగ్స్ను నిలిపివేశారు. విమానాశ్రయం సిబ్బంది ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. పొటోమాక్ నదిలో హెలికాప్టర్, విమానం శకలాలను వెతికే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే రక్షణ చర్యలు ప్రారంభించినప్పటికీ, ఎవ్వరినీ సజీవంగా కాపాడలేకపోయామని అధికారులు తెలిపారు. మిలటరీ హెలికాప్టర్, విమానం మధ్య ఈ ఘర్షణ ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది? ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
This post was last modified on January 30, 2025 10:29 pm
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…
మొన్న శుక్రవారం విడుదలైన దురంధర్ కొద్దిరోజుల క్రితం వరకు బజ్ పరంగా వెనుకబడే ఉంది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా…