అమెరికాలో మిలటరీ హెలికాప్టర్, ప్రయాణికులతో వెళ్తున్న విమానం మధ్య జరిగిన ఘర్షణలో 64 మంది ప్రయాణికులు, ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటివరకు 27 మంది ప్రయాణికుల మృతదేహాలు, హెలికాప్టర్ లోని ఒక దేహాన్ని బయటకు తీశారు. మిగతా మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఈ ఘటన వర్జీనియాలోని రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్పోర్టు సమీపంలో జరిగింది. విమానం ల్యాండ్ అవుతుండగా ఎదురుగా వచ్చిన మిలటరీ హెలికాప్టర్ ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో భారీ పేలుడు సంభవించి, రెండు వాహనాలు పొటోమాక్ నదిలో కూలిపోయాయి. ప్రమాద తీవ్రతను బట్టి విమానంలోని ప్రయాణికులెవరూ బతికే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు.
అదే సమయంలో ఎయిర్పోర్టు పరిధిలోని అన్ని విమానాల టేకాఫ్, ల్యాండింగ్స్ను నిలిపివేశారు. విమానాశ్రయం సిబ్బంది ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. పొటోమాక్ నదిలో హెలికాప్టర్, విమానం శకలాలను వెతికే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే రక్షణ చర్యలు ప్రారంభించినప్పటికీ, ఎవ్వరినీ సజీవంగా కాపాడలేకపోయామని అధికారులు తెలిపారు. మిలటరీ హెలికాప్టర్, విమానం మధ్య ఈ ఘర్షణ ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది? ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…