Trends

ఆ ప్రమాదంలో మొత్తం 67 మంది చనిపోయారు: అమెరికా

అమెరికాలో మిలటరీ హెలికాప్టర్, ప్రయాణికులతో వెళ్తున్న విమానం మధ్య జరిగిన ఘర్షణలో 64 మంది ప్రయాణికులు, ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటివరకు 27 మంది ప్రయాణికుల మృతదేహాలు, హెలికాప్టర్ లోని ఒక దేహాన్ని బయటకు తీశారు. మిగతా మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

ఈ ఘటన వర్జీనియాలోని రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో జరిగింది. విమానం ల్యాండ్ అవుతుండగా ఎదురుగా వచ్చిన మిలటరీ హెలికాప్టర్ ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో భారీ పేలుడు సంభవించి, రెండు వాహనాలు పొటోమాక్ నదిలో కూలిపోయాయి. ప్రమాద తీవ్రతను బట్టి విమానంలోని ప్రయాణికులెవరూ బతికే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు.

అదే సమయంలో ఎయిర్‌పోర్టు పరిధిలోని అన్ని విమానాల టేకాఫ్, ల్యాండింగ్స్‌ను నిలిపివేశారు. విమానాశ్రయం సిబ్బంది ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. పొటోమాక్ నదిలో హెలికాప్టర్, విమానం శకలాలను వెతికే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే రక్షణ చర్యలు ప్రారంభించినప్పటికీ, ఎవ్వరినీ సజీవంగా కాపాడలేకపోయామని అధికారులు తెలిపారు. మిలటరీ హెలికాప్టర్, విమానం మధ్య ఈ ఘర్షణ ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది? ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

This post was last modified on January 30, 2025 10:29 pm

Share

Recent Posts

లిక్కర్ సొమ్ముతో విదేశాల్లో రియల్ ఎస్టేట్?

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…

1 hour ago

కొండా వివాదాన్ని అధిష్టానానికి వదిలేసిన రేవంత్

``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్క‌టే. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలో అంద‌రూ స‌మాన‌మే. ఎవ‌రు ఏం చేశార‌న్న‌ది పార్టీ…

3 hours ago

ఆది నుంచీ.. `కొండా ఫ్యామిలీ` పార్టీల‌కు గుదిబండే!

ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్ర‌తిపార్టీలోనూ ఇబ్బందులు వ‌స్తే.. ప్ర‌తిపార్టీపైనా…

6 hours ago

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

9 hours ago

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

11 hours ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

11 hours ago