Trends

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం హైప్ ఎక్కిస్తున్న ధోని

కెప్టెన్ కూల్ ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే. అతని బ్రాండ్ ఇమేజ్ తోనే ప్రస్తుతం CSK కు క్రేజ్ పెరుగుతోందని చెప్పవచ్చు. ఒకప్పటి జనరేషన్ కు MSD ఆల్ టైమ్ పేవరేట్. అందుకే ధోని ఎక్కడున్నా కూడా ఆ హడావుడి చాలా ఎక్కువగానే ఉంటుంది. ఏదేమైనా ఇప్పట్లో ధోని లేని ఐసీసీ టోర్నమెంట్స్ ను చూడడం అనేది ఓ వర్గం క్రికెట్ లవర్స్ కు మింగుడు పడడం లేదు. ఇక మెజారిటి ఫ్యాన్స్ ను ఆకట్టుకోవాలి అని హాట్ స్టార్ పెద్ద ప్లాన్ వేసింది.

ఇక ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఈ ప్రోమోలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కనిపించడంతో అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తి పెరిగింది.

కెప్టెన్‌గా ఎన్నో విజయాలు అందించిన ధోనీ ఇప్పుడు ఫ్యాన్‌గా మ్యాచ్‌లను వీక్షించబోతున్నాడు. అయితే ఈసారి మ్యాచ్‌ల ఉత్కంఠ తనను కూల్‌గా ఉంచేలా లేవని తనదైన శైలిలో సరదాగా కామెంట్ చేశాడు. ప్రోమోలో ధోనీ తన మార్క్ కామెడీ టచ్‌తో కనిపించాడు.

“నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాను. అప్పట్లో చాలా కూల్‌గా ఉండగలిగాను. కానీ ఇప్పుడు అభిమానిగా చూడటం కాస్త హాట్‌గా అనిపిస్తోంది. టోర్నీ పోటీ చాలా హై ఇంటెన్సిటీగా ఉంటుంది. ఒక్క మ్యాచ్ ఓడిపోతే.. ఇక టోర్నీకి గుడ్‌బై చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది” అని ధోనీ చెప్పడం ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది.

ఈ వీడియోలో ధోనీ ‘డీఆర్ఎస్’ (ధోనీ రిఫ్రిజిరేషన్ సిస్టమ్) అనే కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేశాడు. మ్యాచ్ టెన్షన్ నుంచి బయటపడేందుకు చల్లని గడ్డలతో తయారు చేసిన టోపీ, బట్టలు ధరిస్తూ కనిపించాడు. కానీ అవి సరిపోవడం లేదని, మరింత చల్లదనం అవసరమని సరదాగా చెప్పిన తీరు అభిమానులకు విశేషంగా నచ్చింది. ధోనీ ప్రధాన పాత్రలో ఉండటంతోనే ఈ ప్రోమో ప్రత్యేకంగా నిలిచింది.

ఇక 2013లో ధోనీ సారథ్యంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోపి టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. దాదాపు 12 ఏళ్ల తర్వాత మరోసారి భారత్ ఈ టైటిల్‌ను గెలుచుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా మంచి ఫామ్‌లో ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఆధ్వర్యంలో జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తోంది.

అయితే పోటీ తీవ్రంగా ఉండటంతో ప్రతీ మ్యాచ్ చాలా కీలకంగా మారనుంది. ధోనీ చెప్పినట్టుగానే, ఒక్క తప్పు జరిగినా కూడా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితిని తెచ్చేస్తుంది. మరి ఈ సారి భారత్ మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడుతుందా? లేదా అనేది వేచి చూడాలి.

This post was last modified on January 29, 2025 7:28 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

10 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

11 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

11 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

12 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

13 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

16 hours ago