భారత క్రికెట్ అభిమానుల ఆశలపై మరోసారి మబ్బులు కమ్ముకున్నాయి. త్వరలో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ ప్రశ్నార్థకంగా మారింది. ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో బుమ్రా హాజరుకావడం అనుమానంగా మారిందని సమాచారం.
గతంలో గాయపడ్డ బుమ్రా, ఆస్ట్రేలియాతో చివరి టెస్టు నుంచి బయటే ఉన్నాడు. ప్రస్తుతానికి అతను న్యూజిలాండ్లోని ప్రముఖ సర్జన్ రోవాన్ స్కౌటెన్తో టచ్లో ఉన్నాడని, అక్కడే చికిత్స పొందే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే, బుమ్రా 100 శాతం కోలుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐ అతనికి బదులుగా హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్లను బ్యాకప్గా సిద్ధం చేస్తోంది.
చికిత్స కోసం న్యూజిలాండ్ వెళ్లే అంశాన్ని ఇంకా ఫైనల్ చేయలేదని, అందుకు సంబంధించిన అన్ని రిపోర్టులను డాక్టర్ స్కౌటెన్కు పంపిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టోర్నీ సమయానికి బుమ్రా ఫిట్ అవడం కష్టమేనని తెలుస్తోంది. ఒకవేళ కోలుకోకపోతే, బీసీసీఐ అతని స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాకు అవకాశమిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇంగ్లండ్తో త్వరలో జరగబోయే వన్డే సిరీస్ టోర్నమెంట్కు ముందు కీలకంగా మారనుంది. ఈ సిరీస్లో రాణా ఇప్పటికే జట్టులో ఉన్నాడు. టోర్నీకి ముందు బుమ్రా ఇంకా అందుబాటులోకి రాకపోతే, రాణా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో కూడా స్థానం పొందడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ బుమ్రా ఈ టోర్నీకి అందుబాటులో లేకపోతే, భారత బౌలింగ్ దళంపై పెద్ద ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే, అతని గాయం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.
This post was last modified on January 27, 2025 2:51 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…