భారత క్రికెట్ అభిమానుల ఆశలపై మరోసారి మబ్బులు కమ్ముకున్నాయి. త్వరలో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ ప్రశ్నార్థకంగా మారింది. ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో బుమ్రా హాజరుకావడం అనుమానంగా మారిందని సమాచారం.
గతంలో గాయపడ్డ బుమ్రా, ఆస్ట్రేలియాతో చివరి టెస్టు నుంచి బయటే ఉన్నాడు. ప్రస్తుతానికి అతను న్యూజిలాండ్లోని ప్రముఖ సర్జన్ రోవాన్ స్కౌటెన్తో టచ్లో ఉన్నాడని, అక్కడే చికిత్స పొందే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే, బుమ్రా 100 శాతం కోలుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐ అతనికి బదులుగా హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్లను బ్యాకప్గా సిద్ధం చేస్తోంది.
చికిత్స కోసం న్యూజిలాండ్ వెళ్లే అంశాన్ని ఇంకా ఫైనల్ చేయలేదని, అందుకు సంబంధించిన అన్ని రిపోర్టులను డాక్టర్ స్కౌటెన్కు పంపిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టోర్నీ సమయానికి బుమ్రా ఫిట్ అవడం కష్టమేనని తెలుస్తోంది. ఒకవేళ కోలుకోకపోతే, బీసీసీఐ అతని స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాకు అవకాశమిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇంగ్లండ్తో త్వరలో జరగబోయే వన్డే సిరీస్ టోర్నమెంట్కు ముందు కీలకంగా మారనుంది. ఈ సిరీస్లో రాణా ఇప్పటికే జట్టులో ఉన్నాడు. టోర్నీకి ముందు బుమ్రా ఇంకా అందుబాటులోకి రాకపోతే, రాణా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో కూడా స్థానం పొందడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ బుమ్రా ఈ టోర్నీకి అందుబాటులో లేకపోతే, భారత బౌలింగ్ దళంపై పెద్ద ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే, అతని గాయం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.
This post was last modified on January 27, 2025 2:51 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…