Trends

ఏపీఎస్ఆర్టీసీకి సంక్రాంతి డబుల్ బొనాంజా

ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజలు భారీ ఎత్తున తమ సొంతూళ్లకు తరలి వెళ్లారు. ఫలితంగా ఏపీకి దారి తీసే రహదారులన్నీ రద్దీతో కిటకిటలాడాయి. అదే సమయంలో జనాన్ని తమ సొంతూళ్లకు చేరవేసేందుకు శ్రమించిన ఏపీఎస్ఆర్టీసీకి డబుల్ లాభాలు దక్కాయి.

ఈ ఏడాది సంక్రాంతి వేడుకల కోసం హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి దాదాపుగా 5 లక్షల మంది వెళ్లారు. పండుగ సంబరాలు ముగించుకుని అంతే స్థాయిలో జనం తిరుగు ప్రయాణమయ్యారు. వెరసి వీరందరినీ అటు వారి సొంతూళ్లకు చేర్చడంతో పాటుగా వారిని తిరిగి వారి కార్య స్థానాలకు చేర్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఏకంగా 9,097 బస్సులను నడిపింది. అంటే… దాదాపుగా 10 వేల సర్వీసులను వినియోగించిన ఆర్టీసీ… 10 లక్షల మంది ప్రయాణాలను పూర్తి చేసింది.

ఈ ప్రయాణాలకు గానూ ఏపీఎస్ఆర్టీసీకి ఏకంగా రూ.23.71 కోట్ల మేర ఆదాయం లభించింది. సంక్రాంతి పండుగకు జనాలు తమ ఊళ్లకు చేరడతోనే రూ.12 కోట్ల మేర ఆదాయం లభించిందని ఇదివరకే ఆర్టీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుగు ప్రయాణాలు కూడా పూర్తి కావడంతో… సంక్రాంతి ప్రయాణాలు ముగిశాయని ప్రకటించిన ఆర్టీసీ…ఈ సంక్రాంతికి తమకు డబుల్ బొనాంజా అందినట్లుగా ఏకంగా రూ.23.71 కోట్ల మేర ఆదాయం వచ్చినట్టు గర్వంగా ప్రకటించింది.

This post was last modified on January 22, 2025 9:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

3 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

3 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

5 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

7 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

8 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

8 hours ago