ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజలు భారీ ఎత్తున తమ సొంతూళ్లకు తరలి వెళ్లారు. ఫలితంగా ఏపీకి దారి తీసే రహదారులన్నీ రద్దీతో కిటకిటలాడాయి. అదే సమయంలో జనాన్ని తమ సొంతూళ్లకు చేరవేసేందుకు శ్రమించిన ఏపీఎస్ఆర్టీసీకి డబుల్ లాభాలు దక్కాయి.
ఈ ఏడాది సంక్రాంతి వేడుకల కోసం హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి దాదాపుగా 5 లక్షల మంది వెళ్లారు. పండుగ సంబరాలు ముగించుకుని అంతే స్థాయిలో జనం తిరుగు ప్రయాణమయ్యారు. వెరసి వీరందరినీ అటు వారి సొంతూళ్లకు చేర్చడంతో పాటుగా వారిని తిరిగి వారి కార్య స్థానాలకు చేర్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఏకంగా 9,097 బస్సులను నడిపింది. అంటే… దాదాపుగా 10 వేల సర్వీసులను వినియోగించిన ఆర్టీసీ… 10 లక్షల మంది ప్రయాణాలను పూర్తి చేసింది.
ఈ ప్రయాణాలకు గానూ ఏపీఎస్ఆర్టీసీకి ఏకంగా రూ.23.71 కోట్ల మేర ఆదాయం లభించింది. సంక్రాంతి పండుగకు జనాలు తమ ఊళ్లకు చేరడతోనే రూ.12 కోట్ల మేర ఆదాయం లభించిందని ఇదివరకే ఆర్టీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుగు ప్రయాణాలు కూడా పూర్తి కావడంతో… సంక్రాంతి ప్రయాణాలు ముగిశాయని ప్రకటించిన ఆర్టీసీ…ఈ సంక్రాంతికి తమకు డబుల్ బొనాంజా అందినట్లుగా ఏకంగా రూ.23.71 కోట్ల మేర ఆదాయం వచ్చినట్టు గర్వంగా ప్రకటించింది.
This post was last modified on January 22, 2025 9:45 am
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…