Trends

నెంబర్ వన్ రికార్డుకి సిద్ధమైన ఇండియన్ బౌలర్

భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు అర్ష్‌దీప్‌ సింగ్‌ పేరు గట్టిగానే వినిపిస్తోంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్ కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అర్ష్‌దీప్ తన కెరీర్‌లో అత్యున్నత ఘనత సాధించేందుకు సిద్ధమయ్యాడు. టీమిండియా తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడానికి అతడికి కేవలం రెండు వికెట్లు మాత్రమే కావాలి. ప్రస్తుతం ఈ రికార్డ్ లెగ్‌ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ (96 వికెట్లు) పేరున ఉంది.

60 టీ20 మ్యాచ్‌ల్లో 95 వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌, తన సగటు 18.1, స్ట్రైక్ రేట్ 13.05తో టీమిండియా బౌలింగ్ స్థాయిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు. ఇంగ్లాండ్‌ పై మొదటి మ్యాచ్‌లో రెండు వికెట్లు సాధిస్తే చాహల్‌ను అధిగమించి భారతీయ టీ20 చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు. అంతేకాదు, ఈ సిరీస్‌లో అర్ష్‌దీప్‌ 100 వికెట్ల మైలురాయిని చేరుకుని భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త పేజీ లిఖించేందుకు సిద్ధమయ్యాడు.

హార్దిక్ పాండ్యా కూడా ఈ జాబితాలో తన పేరు సునామీలా చెరపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటివరకు 97 టీ20 ఇన్నింగ్స్‌లో 89 వికెట్లు సాధించిన అతడు, ఈ సిరీస్‌లో ఐదు వికెట్లు తీస్తే 100 వికెట్ల ఘనత చేరుకుంటాడు. అయితే, టీమిండియా ఇప్పటి వరకు టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రెండో జట్టుగా నిలిచినా, 100 వికెట్లు తీసిన బౌలర్‌ లేని పరిస్థితి ఇప్పుడు ముగియనుంది.

టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల రికార్డ్‌లు:

యుజ్వేంద్ర చాహల్‌: 96

అర్ష్‌దీప్‌ సింగ్‌: 95

భువనేశ్వర్‌ కుమార్‌: 90

జస్ప్రీత్‌ బుమ్రా: 89

హార్దిక్‌ పాండ్యా: 89

Kumar

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

3 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

3 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

4 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

5 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

5 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

5 hours ago