Trends

నెంబర్ వన్ రికార్డుకి సిద్ధమైన ఇండియన్ బౌలర్

భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు అర్ష్‌దీప్‌ సింగ్‌ పేరు గట్టిగానే వినిపిస్తోంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్ కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అర్ష్‌దీప్ తన కెరీర్‌లో అత్యున్నత ఘనత సాధించేందుకు సిద్ధమయ్యాడు. టీమిండియా తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడానికి అతడికి కేవలం రెండు వికెట్లు మాత్రమే కావాలి. ప్రస్తుతం ఈ రికార్డ్ లెగ్‌ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ (96 వికెట్లు) పేరున ఉంది.

60 టీ20 మ్యాచ్‌ల్లో 95 వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌, తన సగటు 18.1, స్ట్రైక్ రేట్ 13.05తో టీమిండియా బౌలింగ్ స్థాయిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు. ఇంగ్లాండ్‌ పై మొదటి మ్యాచ్‌లో రెండు వికెట్లు సాధిస్తే చాహల్‌ను అధిగమించి భారతీయ టీ20 చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు. అంతేకాదు, ఈ సిరీస్‌లో అర్ష్‌దీప్‌ 100 వికెట్ల మైలురాయిని చేరుకుని భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త పేజీ లిఖించేందుకు సిద్ధమయ్యాడు.

హార్దిక్ పాండ్యా కూడా ఈ జాబితాలో తన పేరు సునామీలా చెరపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటివరకు 97 టీ20 ఇన్నింగ్స్‌లో 89 వికెట్లు సాధించిన అతడు, ఈ సిరీస్‌లో ఐదు వికెట్లు తీస్తే 100 వికెట్ల ఘనత చేరుకుంటాడు. అయితే, టీమిండియా ఇప్పటి వరకు టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రెండో జట్టుగా నిలిచినా, 100 వికెట్లు తీసిన బౌలర్‌ లేని పరిస్థితి ఇప్పుడు ముగియనుంది.

టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల రికార్డ్‌లు:

యుజ్వేంద్ర చాహల్‌: 96

అర్ష్‌దీప్‌ సింగ్‌: 95

భువనేశ్వర్‌ కుమార్‌: 90

జస్ప్రీత్‌ బుమ్రా: 89

హార్దిక్‌ పాండ్యా: 89

This post was last modified on January 21, 2025 6:02 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago