Trends

నెంబర్ వన్ రికార్డుకి సిద్ధమైన ఇండియన్ బౌలర్

భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు అర్ష్‌దీప్‌ సింగ్‌ పేరు గట్టిగానే వినిపిస్తోంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్ కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అర్ష్‌దీప్ తన కెరీర్‌లో అత్యున్నత ఘనత సాధించేందుకు సిద్ధమయ్యాడు. టీమిండియా తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడానికి అతడికి కేవలం రెండు వికెట్లు మాత్రమే కావాలి. ప్రస్తుతం ఈ రికార్డ్ లెగ్‌ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ (96 వికెట్లు) పేరున ఉంది.

60 టీ20 మ్యాచ్‌ల్లో 95 వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌, తన సగటు 18.1, స్ట్రైక్ రేట్ 13.05తో టీమిండియా బౌలింగ్ స్థాయిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు. ఇంగ్లాండ్‌ పై మొదటి మ్యాచ్‌లో రెండు వికెట్లు సాధిస్తే చాహల్‌ను అధిగమించి భారతీయ టీ20 చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలుస్తాడు. అంతేకాదు, ఈ సిరీస్‌లో అర్ష్‌దీప్‌ 100 వికెట్ల మైలురాయిని చేరుకుని భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త పేజీ లిఖించేందుకు సిద్ధమయ్యాడు.

హార్దిక్ పాండ్యా కూడా ఈ జాబితాలో తన పేరు సునామీలా చెరపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటివరకు 97 టీ20 ఇన్నింగ్స్‌లో 89 వికెట్లు సాధించిన అతడు, ఈ సిరీస్‌లో ఐదు వికెట్లు తీస్తే 100 వికెట్ల ఘనత చేరుకుంటాడు. అయితే, టీమిండియా ఇప్పటి వరకు టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రెండో జట్టుగా నిలిచినా, 100 వికెట్లు తీసిన బౌలర్‌ లేని పరిస్థితి ఇప్పుడు ముగియనుంది.

టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల రికార్డ్‌లు:

యుజ్వేంద్ర చాహల్‌: 96

అర్ష్‌దీప్‌ సింగ్‌: 95

భువనేశ్వర్‌ కుమార్‌: 90

జస్ప్రీత్‌ బుమ్రా: 89

హార్దిక్‌ పాండ్యా: 89

This post was last modified on January 21, 2025 6:02 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పవన్, ఫాన్స్ ఉన్నారు… హైప్ వస్తుందిలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…

2 hours ago

డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…

4 hours ago

40 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…

5 hours ago

టికెట్ రేట్ల పెంపు లేదు… అయినా హ్యాపీనే

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…

6 hours ago

SRH ఈ హెచ్చరికలు వినాల్సిందే..

'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…

8 hours ago

మీరు కాల్చండి.. నేను చూసుకుంటా. అని ఎవరన్నారు?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…

12 hours ago