Trends

టీమిండియాలో తప్పిన క్రమశిక్షణ… గంభీర్ న్యూ రూల్స్?

ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు దారుణ ప్రదర్శనపై బీసీసీఐ ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలకమైన సూచనలు చేశాడు. జట్టులో ఆటగాళ్ల క్రమశిక్షణా రాహిత్యం తమ వైఫల్యాలకు ప్రధాన కారణంగా ఉన్నదని, దీన్ని తక్షణమే సరిచేయాల్సిన అవసరం ఉందని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

గంభీర్ ముఖ్యంగా సుదీర్ఘ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యుల కారణంగా ఆటగాళ్ల దృష్టి మళ్లుతోందని పేర్కొన్నాడు. పర్యటనల సందర్భంగా రెండు వారాలకే కుటుంబ సభ్యులను పరిమితం చేయాలని, కోవిడ్‌ ముందు నిబంధనల ప్రకారం కఠినమైన మార్గదర్శకాలు అమలు చేయాలని సూచించాడు.

బీసీసీఐ ఈ అంశంపై ఆలోచన చేస్తోందని సమాచారం. ఇటువంటి చర్యల వల్ల ఆటగాళ్ల దృష్టి క్రమశిక్షణగా ఉండటమే కాకుండా వారి ప్రదర్శన మెరుగుపడుతుందని గంభీర్ నమ్మకంగా ఉన్నాడు.

సమీక్షా సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కొన్ని కీలకమైన సూచనలు చేశాడు. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు చెల్లింపునకు సంబంధించి ప్రదర్శన ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని, ఫీజు చెల్లింపులో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని రోహిత్ అభిప్రాయపడ్డాడు. ఇది ఆటగాళ్ల ప్రోత్సాహాన్ని పెంచుతుందని, జట్టులో స్ఫూర్తిని పెంచుతుందని రోహిత్ సూచించాడు.

బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో జట్టు సభ్యుల మధ్య సమన్వయం లోపించిందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. కొన్ని సందర్భాల్లో జట్టు మొత్తం కలసి ఉండకపోవడం, డిన్నర్ వంటి సందర్భాల్లో చిన్న గ్రూపులుగా విడిపోయిన ఆటగాళ్ల ప్రవర్తన అతనికి సంతృప్తి కలిగించలేదని తెలుస్తోంది.

ఈ కారణాలతో డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా ప్రతికూలంగా మారిందని కోచ్ అభిప్రాయపడ్డాడు. జట్టులో క్రమశిక్షణ పెంపొందించి, వ్యక్తిగత దృష్టిని జట్టుపై కేంద్రీకరించే దిశగా చర్యలు తీసుకోవాలని గంభీర్ సూచించడంతో బీసీసీఐ ఈ మార్పులను అమలు చేయడంపై దృష్టి సారించింది. మరి ఈ సూచనలు భారత జట్టును మరింత సమర్థవంతంగా మార్చుతాయా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.

Kumar

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

4 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

4 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

5 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

6 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

6 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

6 hours ago