Trends

టీమిండియాలో తప్పిన క్రమశిక్షణ… గంభీర్ న్యూ రూల్స్?

ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు దారుణ ప్రదర్శనపై బీసీసీఐ ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలకమైన సూచనలు చేశాడు. జట్టులో ఆటగాళ్ల క్రమశిక్షణా రాహిత్యం తమ వైఫల్యాలకు ప్రధాన కారణంగా ఉన్నదని, దీన్ని తక్షణమే సరిచేయాల్సిన అవసరం ఉందని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

గంభీర్ ముఖ్యంగా సుదీర్ఘ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యుల కారణంగా ఆటగాళ్ల దృష్టి మళ్లుతోందని పేర్కొన్నాడు. పర్యటనల సందర్భంగా రెండు వారాలకే కుటుంబ సభ్యులను పరిమితం చేయాలని, కోవిడ్‌ ముందు నిబంధనల ప్రకారం కఠినమైన మార్గదర్శకాలు అమలు చేయాలని సూచించాడు.

బీసీసీఐ ఈ అంశంపై ఆలోచన చేస్తోందని సమాచారం. ఇటువంటి చర్యల వల్ల ఆటగాళ్ల దృష్టి క్రమశిక్షణగా ఉండటమే కాకుండా వారి ప్రదర్శన మెరుగుపడుతుందని గంభీర్ నమ్మకంగా ఉన్నాడు.

సమీక్షా సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కొన్ని కీలకమైన సూచనలు చేశాడు. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు చెల్లింపునకు సంబంధించి ప్రదర్శన ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని, ఫీజు చెల్లింపులో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని రోహిత్ అభిప్రాయపడ్డాడు. ఇది ఆటగాళ్ల ప్రోత్సాహాన్ని పెంచుతుందని, జట్టులో స్ఫూర్తిని పెంచుతుందని రోహిత్ సూచించాడు.

బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో జట్టు సభ్యుల మధ్య సమన్వయం లోపించిందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. కొన్ని సందర్భాల్లో జట్టు మొత్తం కలసి ఉండకపోవడం, డిన్నర్ వంటి సందర్భాల్లో చిన్న గ్రూపులుగా విడిపోయిన ఆటగాళ్ల ప్రవర్తన అతనికి సంతృప్తి కలిగించలేదని తెలుస్తోంది.

ఈ కారణాలతో డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా ప్రతికూలంగా మారిందని కోచ్ అభిప్రాయపడ్డాడు. జట్టులో క్రమశిక్షణ పెంపొందించి, వ్యక్తిగత దృష్టిని జట్టుపై కేంద్రీకరించే దిశగా చర్యలు తీసుకోవాలని గంభీర్ సూచించడంతో బీసీసీఐ ఈ మార్పులను అమలు చేయడంపై దృష్టి సారించింది. మరి ఈ సూచనలు భారత జట్టును మరింత సమర్థవంతంగా మార్చుతాయా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.

This post was last modified on January 16, 2025 3:21 pm

Share

Recent Posts

యష్ &  విశాల్… ఇన్ని పోలికలున్నాయా

సరిగ్గా పన్నెండు రోజుల గ్యాప్ లో విడుదల కాబోతున్న టాక్సిక్, మకుటం కొన్ని విషయాల్లో చాలా సారూప్యతలు చూపిస్తున్నాయి. మొదటిది…

51 minutes ago

ఈసారి అసెంబ్లీకి రాకపోతే కష్టమే జగన్

రాష్ట్ర శాసన సభ 7వ సమావేశాలు ఈ నెల 17 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు…

4 hours ago

టాక్సిక్ విధ్వంసం 191 నిమిషాలు ?

ఆగస్ట్ 26 విడుదల కాబోతున్న టాక్సిక్ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయినట్టుగా బెంగళూరు వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఫైనల్ రన్…

6 hours ago

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి విద్యార్థుల సెగ‌.. కేంద్రం మౌనం!

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అంటే.. రాష్ట్ర‌ప‌తి త‌ర్వాత రాష్ట్ర‌ప‌తి అంత‌టి పోస్టు. ఈ ప‌ద‌వికి అనేక మంది వ‌న్నె తెచ్చారు.…

7 hours ago

‘వందేమాత‌రం’ పూర్తిగా పాడం: రాష్ట్రాల అల్టిమేటం

మ‌రో నాలుగు రోజుల్లో దేశ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా కేంద్ర హోం శాఖ…

7 hours ago

పెనిమిటి కోసం తగ్గేదెలే అంటున్న రష్మిక

అన్ని అనుకున్న టైంకి జరిగి ఉంటే విజయ్ దేవరకొండ రణబాలి సెప్టెంబర్ 11 విడుదలకు రెడీ అయ్యేది. అయితే ఇంకా…

7 hours ago