ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు దారుణ ప్రదర్శనపై బీసీసీఐ ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలకమైన సూచనలు చేశాడు. జట్టులో ఆటగాళ్ల క్రమశిక్షణా రాహిత్యం తమ వైఫల్యాలకు ప్రధాన కారణంగా ఉన్నదని, దీన్ని తక్షణమే సరిచేయాల్సిన అవసరం ఉందని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
గంభీర్ ముఖ్యంగా సుదీర్ఘ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యుల కారణంగా ఆటగాళ్ల దృష్టి మళ్లుతోందని పేర్కొన్నాడు. పర్యటనల సందర్భంగా రెండు వారాలకే కుటుంబ సభ్యులను పరిమితం చేయాలని, కోవిడ్ ముందు నిబంధనల ప్రకారం కఠినమైన మార్గదర్శకాలు అమలు చేయాలని సూచించాడు.
బీసీసీఐ ఈ అంశంపై ఆలోచన చేస్తోందని సమాచారం. ఇటువంటి చర్యల వల్ల ఆటగాళ్ల దృష్టి క్రమశిక్షణగా ఉండటమే కాకుండా వారి ప్రదర్శన మెరుగుపడుతుందని గంభీర్ నమ్మకంగా ఉన్నాడు.
సమీక్షా సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కొన్ని కీలకమైన సూచనలు చేశాడు. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు చెల్లింపునకు సంబంధించి ప్రదర్శన ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని, ఫీజు చెల్లింపులో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని రోహిత్ అభిప్రాయపడ్డాడు. ఇది ఆటగాళ్ల ప్రోత్సాహాన్ని పెంచుతుందని, జట్టులో స్ఫూర్తిని పెంచుతుందని రోహిత్ సూచించాడు.
బోర్డర్ గవాస్కర్ సిరీస్లో జట్టు సభ్యుల మధ్య సమన్వయం లోపించిందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. కొన్ని సందర్భాల్లో జట్టు మొత్తం కలసి ఉండకపోవడం, డిన్నర్ వంటి సందర్భాల్లో చిన్న గ్రూపులుగా విడిపోయిన ఆటగాళ్ల ప్రవర్తన అతనికి సంతృప్తి కలిగించలేదని తెలుస్తోంది.
ఈ కారణాలతో డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా ప్రతికూలంగా మారిందని కోచ్ అభిప్రాయపడ్డాడు. జట్టులో క్రమశిక్షణ పెంపొందించి, వ్యక్తిగత దృష్టిని జట్టుపై కేంద్రీకరించే దిశగా చర్యలు తీసుకోవాలని గంభీర్ సూచించడంతో బీసీసీఐ ఈ మార్పులను అమలు చేయడంపై దృష్టి సారించింది. మరి ఈ సూచనలు భారత జట్టును మరింత సమర్థవంతంగా మార్చుతాయా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.
This post was last modified on January 16, 2025 3:21 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…