అప్పుడెప్పుడో…2008లో దాయాది దేశం పాకిస్తాన్ లో భారత క్రికెట్ జట్టు పర్యటించింది. అదే ఏడాది పాక్ ఉగ్రవాదులు ముంబై ఫై జరిపిన దాడి నేపథ్యంలో పాక్ టూర్లను బీసీసీఐ దాదాపుగా రద్దు చేసింది. త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ పాక్ లోనే జరుగుతోంది.
అయినా కూడా టీమిండియా ఆ దేశానికి వెళ్లడం లేదు. టీమిండియా ఆడే మ్యాచులను దుబాయ్ లో ప్లాన్ చేసారు. ఫలితంగా పాక్ లో అడుగుపెట్టాల్సిన అవసరం భారత క్రికెటర్లకు లేదు.
జట్టు సభ్యులు పాక్ వెళ్లాల్సిన అవసరం లేకున్నా… జట్టు కెప్టెన్ హోదాలో రోహిత్ శర్మ మాత్రం పాక్ వెళ్లక తప్పేలా లేదు. ఎందుకంటే… ఐసీసీ నిర్వహించే ఏ టోర్నీ అయినా… అందులో పాలు పంచుకునే జట్ల కెప్టెన్ లు అందరు ఓపెనింగ్ వేడుకలకు తప్పనిసరిగా హాజరు అవడం చూస్తున్నదే.
ఈ కారణం గానే భారత జట్టు కెప్టెన్ హోదాలో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలకు రోహిత్ హాజరు కావాల్సి ఉంది. అంటే… 2008 తర్వాత ఓ భారత క్రికెటర్ పాక్ గడ్డపై ఇప్పుడు అడుగుపెట్టబోతున్నాడన్న మాట.
ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానుంది. అంటే… ఫిబ్రవరి 17 గాని, లేదంటే 18న గాని ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. చాల ఏళ్ల తర్వాత పాక్ లో ఐసీసీ ఈవెంట్ జరుగుతున్ననేపథ్యంలో ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ కారణంగానూ రోహిత్ తప్పనిసరిగా పాక్ కు వెళ్లక తప్పదన్న వాదన వినిపిస్తోంది.
This post was last modified on January 15, 2025 11:53 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…