టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఎందుకనో గానీ ఇటీవలి కాలంలో ఏ ఒక్కటీ కలిసి రావడం లేదు. టీమిండియా జట్టులో కీలక ప్లేయర్ గా రాణించిన గంభీర్.. ఆ తర్వాత ప్రతి విషయంలోనూ ప్రతికూల ఫలితాలనే చవిచూస్తున్నాడు. తాజాగా తన కెరీర్ లోనే టాప్ జాబ్ గా పరిగణిస్తున్న టీమిండియా హెడ్ కోచ్ పదవిని అతడు నిర్దేశిత గడువు కంటే ముందుగానే కోల్పోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాడు.
గతేడాది జులైలో టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గంభీర్… 2027 దాకా ఆ పదవిలో కొనసాగనున్నాడు. ఈ మేరకు బీసీసీఐతో అతడికి అగ్రిమెంట్ కుదిరింది. అయితే కోచ్ గా జట్టుపై గంభీర్ తన ముద్ర వేయలేకపోయాడు.
గంభీర్ కోచ్ గా వచ్చాక జ్జట్టు 10 టెస్ట్ మ్యాచులు ఆడితే… ఏకంగా ఆరింటిలో పరాజయం పాలు అయ్యింది. శ్రీలంకతో వన్డే సిరీస్ ను కోల్పోయింది. ఇక ఇటీవలే ఆస్ట్రేలియాతో కీలకమైన బోర్డర్ గవాస్కర్ సిరీస్ నూ కోల్పోయింది.
ఈ క్రమంలో జట్టు కోచ్ గా గంభీర్ పాత్రపై నీలినీడలు కమ్ముకున్నాయి. త్వరలో జరగనున్న ఛాంపియన్ ట్రోఫీ భారత జట్టుకు అత్యంత కీలకమని చెప్పాలి. ఈ సిరీస్ లో జట్టు ప్రదర్శన బాగుంటే ఓకే.. లేదంటే గంభీర్ పోస్ట్ కు ఊస్టింగ్ తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వెరసి ఛాంపియన్స్ ట్రోఫీ ఫలితం గంభీర్ భవితవ్యాన్ని తేల్చనుందన్న మాట.
అయినా…టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ జట్టు సభ్యుల ప్రతిభ పెంచడానికి బదులుగా ఇతరత్రా విషయాలపై దృష్టి పెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. డ్రెస్సింగ్ రూమ్ లో సూపర్ స్టార్ కల్చర్ ను నిర్మూలించే బాధ్యతను గంభీర్ భుజానికి ఎత్తుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారట.
జట్టు విజయాల్లో ఏమంత కీలకం కానీ ఈ విషయం ఫై అతడు ఎందుకు దృష్టి సారిస్తున్నాడో కూడా అర్థం కావడం లేదని క్రికెట్ పండితులు చెబుతున్నారు. అనవసరమైన విషయాల్లో వేలు పెట్టి ప్రమాదంలో పడటం గంభీర్ కు పరిపాటిగా మారిందని కూడా వారు చెబుతున్నారు.
దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని…
ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడలను ఏకం చేసిన ఉద్యమం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం.. గత రెండు…
విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న కొరియన్ కనకరాజుకి మోక్షం దొరికేసింది. ఆగస్ట్ 7 రిలీజ్ కు రంగం సిద్ధం…
గత వారం భారీ అంచనాల మధ్య ప్రేక్షెకుల ముందుకు వచ్చిన పెద్ది సినిమా తొలి వీకెండ్లో అంచనాలకు తగ్గట్లే భారీ…
జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి. అలాంటిది కాంగ్రెస్ మంత్రితో బీజేపీ ఎంపీ భేటీ…
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి రెండేల్లు అవుతోంది. మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి… 2024 ఎన్నికల్లో అత్యంత కష్టతరమైన…