Trends

సిడ్నీ టెస్ట్‌… టీమిండియాకు మరో ఎదురుదెబ్బ

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య కీలకమైన ఐదవ టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఆసీస్‌ ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో భారత్‌ ఈ మ్యాచ్‌ను గెలవాల్సిన అవసరం ఉంది. మరోవైపు, మ్యాచ్ డ్రా అయినా, రద్దు అయినా సిరీస్ ఆసీస్‌ వశమే అవుతుంది. ఈ క్రమంలో టీమిండియాకు బ్యాడ్ న్యూస్‌ వచ్చింది. టీమిండియా పేసర్ ఆకాశ్ దీప్ వెన్ను గాయంతో చివరి టెస్ట్‌కు అందుబాటులో ఉండడని కోచ్ గౌతమ్ గంభీర్ ప్రకటించాడు.

గౌతమ్ గంభీర్ గురువారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆకాశ్‌ దీప్ చివరిదైన రెండు టెస్ట్ మ్యాచులలో భారత్‌కు కీలకంగా సేవలు అందించాడు. అయితే, ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడం వల్ల అతనికి వెన్ను నొప్పి రావడం టీమిండియాకు పెద్ద దెబ్బే అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. సిడ్నీ పిచ్‌ను పరిశీలించి తుది జట్టును నిర్ణయిస్తామని, ఆకాశ్ స్థానంలో హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం కల్పించవచ్చని పేర్కొన్నాడు.

ఆకాశ్‌ దీప్ ఈ సిరీస్‌లో బ్రిస్బేన్‌ మరియు మెల్‌బోర్న్‌ టెస్టులలో 87.5 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. అతని వేగం, లైన్స్ ద్వారా ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తిడిలో పెట్టినప్పటికీ, ఫీల్డర్లు అతని బౌలింగ్‌పై పలు క్యాచ్‌లు జారవిడిచారు. వెన్నునొప్పి కారణంగా అతని ఎంపిక ఇకపై సందేహాస్పదంగా మారిందని సమాచారం. ఇప్పటికే బౌలింగ్ విభాగంలో స్ట్రైక్‌ బౌలర్‌గా ఉన్న జస్ప్రీత్‌ బుమ్రా, షమీపై టీమిండియా ఎక్కువగా ఆధారపడుతోంది. ఇప్పుడు ఆకాశ్‌ కూడా గాయంతో దూరమవడం పేస్‌ డిపార్ట్మెంట్‌ కోసం కష్టంగా మారింది.

ఈ తరుణంలో టీమిండియా తుది జట్టు ఎంపికపై ఆశలు పెట్టుకున్న ప్రేక్షకులలో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. భారత్ విజయం సాధిస్తే సిరీస్ సమం అవుతుంది. దీంతో సిడ్నీ టెస్ట్ మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారింది. గాయం కారణంగా దూరమైన ఆకాశ్‌కు బదులుగా అవకాశం పొందిన ఆటగాడు టీమిండియాకు విజయాన్ని అందించగలడేమో చూడాలి.

మరోవైపు సంచలనంగా మారిన డ్రెస్సింగ్ రూమ్ డిస్కషన్ గురించి గంభీర్ ను అడగగా “డ్రెస్సింగ్ రూమ్ లో జరిగే డిస్కషన్స్ అక్కడి వరకే ఉంటే మంచిది.” అని పెద్ద బాంబు పేల్చడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

This post was last modified on January 2, 2025 10:58 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

58 minutes ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

3 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

6 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

7 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

8 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

8 hours ago