Trends

సిడ్నీ టెస్ట్‌… టీమిండియాకు మరో ఎదురుదెబ్బ

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య కీలకమైన ఐదవ టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఆసీస్‌ ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో భారత్‌ ఈ మ్యాచ్‌ను గెలవాల్సిన అవసరం ఉంది. మరోవైపు, మ్యాచ్ డ్రా అయినా, రద్దు అయినా సిరీస్ ఆసీస్‌ వశమే అవుతుంది. ఈ క్రమంలో టీమిండియాకు బ్యాడ్ న్యూస్‌ వచ్చింది. టీమిండియా పేసర్ ఆకాశ్ దీప్ వెన్ను గాయంతో చివరి టెస్ట్‌కు అందుబాటులో ఉండడని కోచ్ గౌతమ్ గంభీర్ ప్రకటించాడు.

గౌతమ్ గంభీర్ గురువారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆకాశ్‌ దీప్ చివరిదైన రెండు టెస్ట్ మ్యాచులలో భారత్‌కు కీలకంగా సేవలు అందించాడు. అయితే, ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడం వల్ల అతనికి వెన్ను నొప్పి రావడం టీమిండియాకు పెద్ద దెబ్బే అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. సిడ్నీ పిచ్‌ను పరిశీలించి తుది జట్టును నిర్ణయిస్తామని, ఆకాశ్ స్థానంలో హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం కల్పించవచ్చని పేర్కొన్నాడు.

ఆకాశ్‌ దీప్ ఈ సిరీస్‌లో బ్రిస్బేన్‌ మరియు మెల్‌బోర్న్‌ టెస్టులలో 87.5 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. అతని వేగం, లైన్స్ ద్వారా ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తిడిలో పెట్టినప్పటికీ, ఫీల్డర్లు అతని బౌలింగ్‌పై పలు క్యాచ్‌లు జారవిడిచారు. వెన్నునొప్పి కారణంగా అతని ఎంపిక ఇకపై సందేహాస్పదంగా మారిందని సమాచారం. ఇప్పటికే బౌలింగ్ విభాగంలో స్ట్రైక్‌ బౌలర్‌గా ఉన్న జస్ప్రీత్‌ బుమ్రా, షమీపై టీమిండియా ఎక్కువగా ఆధారపడుతోంది. ఇప్పుడు ఆకాశ్‌ కూడా గాయంతో దూరమవడం పేస్‌ డిపార్ట్మెంట్‌ కోసం కష్టంగా మారింది.

ఈ తరుణంలో టీమిండియా తుది జట్టు ఎంపికపై ఆశలు పెట్టుకున్న ప్రేక్షకులలో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. భారత్ విజయం సాధిస్తే సిరీస్ సమం అవుతుంది. దీంతో సిడ్నీ టెస్ట్ మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారింది. గాయం కారణంగా దూరమైన ఆకాశ్‌కు బదులుగా అవకాశం పొందిన ఆటగాడు టీమిండియాకు విజయాన్ని అందించగలడేమో చూడాలి.

మరోవైపు సంచలనంగా మారిన డ్రెస్సింగ్ రూమ్ డిస్కషన్ గురించి గంభీర్ ను అడగగా “డ్రెస్సింగ్ రూమ్ లో జరిగే డిస్కషన్స్ అక్కడి వరకే ఉంటే మంచిది.” అని పెద్ద బాంబు పేల్చడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

This post was last modified on January 2, 2025 10:58 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

3 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

3 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

5 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

7 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

8 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

8 hours ago