టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డేటింగ్లో ఉన్నారన్న ప్రచారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. టీమిండియా పేసర్ మహ్మద్ షమీతో రిలేషన్షిప్ ఉందంటూ ప్రచారమవుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా, బీచ్లో హగ్ చేసుకుంటున్న ఫొటో కూడా ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ ఫొటోకు ఇప్పటికే వేలాది లైకులు, షేర్లు, కామెంట్లు వచ్చాయి. అయితే, దీనిపై నిజానిజాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.
సానియా మీర్జా తన భర్త షోయబ్ మాలిక్ నుంచి విడిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు షమీ కూడా తన భార్య హసీన్ జహాన్తో విడాకుల కేసు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో షమీ, సానియా మధ్య ప్రత్యేక బంధం ఉందంటూ ప్రచారం ఊపందుకుంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ పలు వార్తలు వెలువడ్డాయి.
ఇక వైరల్ ఫొటోను పరిశీలించినప్పుడు, అది పూర్తిగా మార్ఫింగ్ చేసినదని ఫ్యాక్ట్ చెక్లో తేలింది. ఈ ఫొటో ఎక్కడా షమీ, సానియా అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా దీనిని సృష్టించినట్లు తేలింది. ఇలాంటి ఫొటోలు క్రియేట్ చేయడం ద్వారా సెలబ్రిటీల గౌరవాన్ని దెబ్బతీస్తున్న పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న ఈ రూమర్స్ పట్ల అభిమానులు అప్రమత్తంగా ఉండాలి. నిర్ధారణ లేని సమాచారం పట్ల నమ్మకంగా వ్యవహరించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
This post was last modified on December 29, 2024 2:02 pm
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…