టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డేటింగ్లో ఉన్నారన్న ప్రచారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. టీమిండియా పేసర్ మహ్మద్ షమీతో రిలేషన్షిప్ ఉందంటూ ప్రచారమవుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా, బీచ్లో హగ్ చేసుకుంటున్న ఫొటో కూడా ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ ఫొటోకు ఇప్పటికే వేలాది లైకులు, షేర్లు, కామెంట్లు వచ్చాయి. అయితే, దీనిపై నిజానిజాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.
సానియా మీర్జా తన భర్త షోయబ్ మాలిక్ నుంచి విడిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు షమీ కూడా తన భార్య హసీన్ జహాన్తో విడాకుల కేసు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో షమీ, సానియా మధ్య ప్రత్యేక బంధం ఉందంటూ ప్రచారం ఊపందుకుంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ పలు వార్తలు వెలువడ్డాయి.
ఇక వైరల్ ఫొటోను పరిశీలించినప్పుడు, అది పూర్తిగా మార్ఫింగ్ చేసినదని ఫ్యాక్ట్ చెక్లో తేలింది. ఈ ఫొటో ఎక్కడా షమీ, సానియా అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా దీనిని సృష్టించినట్లు తేలింది. ఇలాంటి ఫొటోలు క్రియేట్ చేయడం ద్వారా సెలబ్రిటీల గౌరవాన్ని దెబ్బతీస్తున్న పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న ఈ రూమర్స్ పట్ల అభిమానులు అప్రమత్తంగా ఉండాలి. నిర్ధారణ లేని సమాచారం పట్ల నమ్మకంగా వ్యవహరించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
This post was last modified on December 29, 2024 2:02 pm
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…