Trends

పేద‌రికం అంటారు.. ప‌నిచేయ‌క‌పోతే ఎలా: నారాయణ‌మూర్తి చుర‌క‌లు

ప్ర‌పంచ ఐటీ దిగ్గ‌జ సంస్థ‌.. ఇన్ఫోసిస్ అధినేత నారాయ‌ణ‌మూర్తి.. చుర‌క‌లు అంటించారు. ఆయ‌న గ‌త కొన్నాళ్లుగా ప‌నిగంట‌ల విష‌యంలో ఓ సూత్రం చెబుతున్నారు. వారానికి 70 గంట‌లు ప‌నిచేయాల‌ని ఆయ‌న సూత్రీక‌రిస్తున్నారు. వాస్త‌వానికి ప్ర‌పంచ దేశాలు స‌హా భార‌త దేశ లెక్క‌ల ప్ర‌కారం.. వారానికి 48 గంట‌లు మాత్ర‌మే ప‌నిచేయాలి. రోజుకు 8 గంట‌ల చొప్పున వారానికి ఆరు రోజులు లెక్క వేస్తారు. దీని ప్ర‌కారం.. 48 గంట‌లు ప‌నిచేస్తే.. సరిపోతుంద‌నేది ఒక లెక్క‌.

ఇక‌, వైట్ కాల‌ర్ జాబ్స్ విష‌యంలో రోజుకు 6.30 గంట‌లు మాత్ర‌మే ప‌నిచేస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు బ్యాంకింగ్‌, స్టాక్స్‌, అడ్మినిస్ట్రేటివ్ రంగాల్లో ఉద్యోగుల‌కు ఇది వ‌ర్తిస్తుంది. అంటే.. వారానికి 38 గంట‌లే ప‌నిచేయాలన్నది నిబంధ‌న‌. అయితే.. దీనిని ఆది నుంచి కూడా నారాయ‌ణ మూర్తి విభేదిస్తున్నారు. వారానికి 70 గంట‌లు ప‌నిచేయాల‌ని ఆయ‌న చెబుతున్నారు. అంటే.. రోజుకు 11-12 గంట‌ల పాటు వ్య‌క్తులు ప‌నిచేయాల‌న్న‌ది ఆయ‌న సూత్రం. కానీ, ఆయ‌న సూత్రాన్ని విభేదించే వారే ఎక్కువ‌గా ఉన్నారు త‌ప్ప‌.. స‌మ‌ర్థించేవారు లేరు.

మ‌రీ ముఖ్యంగా ఇప్ప‌టికిప్పుడు త‌న‌ను ఎవ‌రైనా స‌మ‌ర్థిస్తే.. ఆవెంట‌నే త‌న సూత్రాన్ని ముందుగా.. త‌న సంస్థ అయిన ఇన్ఫోసిస్‌లోనే ప్ర‌వేశ పెట్టాల‌న్న‌ది నారాయ‌ణ మూర్తి క‌ల‌. కానీ, దీనిని స‌మ‌ర్థించ‌డం లేదు. దీంతో త‌ర‌చుగా ఆయ‌న చుర‌క‌లు అంటిస్తున్నారు. తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన నారాయ‌ణ మూర్తి.. ఇదే కోవ‌లో ఆయ‌న రియాక్ట్ అయ్యారు. దేశంలో పేద‌రికం.. ఉందంటారు. మ‌రి ప‌నిచేయ‌క‌పోతే ఎలా? అని నిల‌దీశారు. ప్ర‌స్తుతం ఉన్న గ‌ణాంకాల ప్ర‌కారం.. దేశంలో 80 కోట్ల మంది రేష‌న్‌బియ్యం తీసుకుంటున్నార‌ని.. అంటే.. వీరంతా పేద‌లే క‌దా! అని ప్ర‌శ్నిస్తున్నారు.

దేశంలో పేద‌రికం పోవాలంటే.. ఖ‌చ్చితంగా ప‌నిచేయాల్సిందేన‌ని.. అది కూడా.. ఎక్స్‌ట్రీమ్‌గా క‌ష్ట‌ప‌డాలని నారాయ‌ణ మూర్తి వాద‌న‌. దేశంలో పేద‌రికం ఉంద‌ని ఉప‌న్యాసాలు ఇస్తే కుద‌ర‌ద‌ని వ్యాఖ్యానించారు. దీనిని రూపు మాపాలంటే.. 70 గంట‌లు ప‌నిచేస్తే..ఉత్పాద‌క‌త పెరుగుతుంద‌ని.. త‌ద్వారా.. మాత్ర‌మే పేద‌రిక నిర్మూల‌న సాధ్య‌మ‌వుతుంద‌ని ఆయ‌న చెబుతున్నారు. “మాట‌లు వ‌ద్దు.. చేత‌లకు దిగండి. అప్పుడు మాట‌లు ఉండ‌వు.. ఫ‌లితం క‌నిపిస్తుంది” అని నారాయ‌ణ మూర్తి తెగేసి చెప్పారు.

This post was last modified on December 16, 2024 11:26 am

Share

Recent Posts

ఏజెంట్‌లో నన్ను చూసి అసహ్యమేసింది – అఖిల్

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…

2 hours ago

దేవర కలెక్షన్లపై డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ

ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…

6 hours ago

కొత్త విద్యా మంత్రిగా జోషి… ఎవరీయన?

కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…

9 hours ago

విజయ్ బలహీనతే కిరణ్ బలం

బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…

9 hours ago

‘స్పైడర్ మ్యాన్’ రచ్చ చేసేలా ఉన్నాడు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…

10 hours ago

జగన్ లాజిక్… ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కి లోకేష్ కు ముడి!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…

10 hours ago