Trends

పేద‌రికం అంటారు.. ప‌నిచేయ‌క‌పోతే ఎలా: నారాయణ‌మూర్తి చుర‌క‌లు

ప్ర‌పంచ ఐటీ దిగ్గ‌జ సంస్థ‌.. ఇన్ఫోసిస్ అధినేత నారాయ‌ణ‌మూర్తి.. చుర‌క‌లు అంటించారు. ఆయ‌న గ‌త కొన్నాళ్లుగా ప‌నిగంట‌ల విష‌యంలో ఓ సూత్రం చెబుతున్నారు. వారానికి 70 గంట‌లు ప‌నిచేయాల‌ని ఆయ‌న సూత్రీక‌రిస్తున్నారు. వాస్త‌వానికి ప్ర‌పంచ దేశాలు స‌హా భార‌త దేశ లెక్క‌ల ప్ర‌కారం.. వారానికి 48 గంట‌లు మాత్ర‌మే ప‌నిచేయాలి. రోజుకు 8 గంట‌ల చొప్పున వారానికి ఆరు రోజులు లెక్క వేస్తారు. దీని ప్ర‌కారం.. 48 గంట‌లు ప‌నిచేస్తే.. సరిపోతుంద‌నేది ఒక లెక్క‌.

ఇక‌, వైట్ కాల‌ర్ జాబ్స్ విష‌యంలో రోజుకు 6.30 గంట‌లు మాత్ర‌మే ప‌నిచేస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు బ్యాంకింగ్‌, స్టాక్స్‌, అడ్మినిస్ట్రేటివ్ రంగాల్లో ఉద్యోగుల‌కు ఇది వ‌ర్తిస్తుంది. అంటే.. వారానికి 38 గంట‌లే ప‌నిచేయాలన్నది నిబంధ‌న‌. అయితే.. దీనిని ఆది నుంచి కూడా నారాయ‌ణ మూర్తి విభేదిస్తున్నారు. వారానికి 70 గంట‌లు ప‌నిచేయాల‌ని ఆయ‌న చెబుతున్నారు. అంటే.. రోజుకు 11-12 గంట‌ల పాటు వ్య‌క్తులు ప‌నిచేయాల‌న్న‌ది ఆయ‌న సూత్రం. కానీ, ఆయ‌న సూత్రాన్ని విభేదించే వారే ఎక్కువ‌గా ఉన్నారు త‌ప్ప‌.. స‌మ‌ర్థించేవారు లేరు.

మ‌రీ ముఖ్యంగా ఇప్ప‌టికిప్పుడు త‌న‌ను ఎవ‌రైనా స‌మ‌ర్థిస్తే.. ఆవెంట‌నే త‌న సూత్రాన్ని ముందుగా.. త‌న సంస్థ అయిన ఇన్ఫోసిస్‌లోనే ప్ర‌వేశ పెట్టాల‌న్న‌ది నారాయ‌ణ మూర్తి క‌ల‌. కానీ, దీనిని స‌మ‌ర్థించ‌డం లేదు. దీంతో త‌ర‌చుగా ఆయ‌న చుర‌క‌లు అంటిస్తున్నారు. తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన నారాయ‌ణ మూర్తి.. ఇదే కోవ‌లో ఆయ‌న రియాక్ట్ అయ్యారు. దేశంలో పేద‌రికం.. ఉందంటారు. మ‌రి ప‌నిచేయ‌క‌పోతే ఎలా? అని నిల‌దీశారు. ప్ర‌స్తుతం ఉన్న గ‌ణాంకాల ప్ర‌కారం.. దేశంలో 80 కోట్ల మంది రేష‌న్‌బియ్యం తీసుకుంటున్నార‌ని.. అంటే.. వీరంతా పేద‌లే క‌దా! అని ప్ర‌శ్నిస్తున్నారు.

దేశంలో పేద‌రికం పోవాలంటే.. ఖ‌చ్చితంగా ప‌నిచేయాల్సిందేన‌ని.. అది కూడా.. ఎక్స్‌ట్రీమ్‌గా క‌ష్ట‌ప‌డాలని నారాయ‌ణ మూర్తి వాద‌న‌. దేశంలో పేద‌రికం ఉంద‌ని ఉప‌న్యాసాలు ఇస్తే కుద‌ర‌ద‌ని వ్యాఖ్యానించారు. దీనిని రూపు మాపాలంటే.. 70 గంట‌లు ప‌నిచేస్తే..ఉత్పాద‌క‌త పెరుగుతుంద‌ని.. త‌ద్వారా.. మాత్ర‌మే పేద‌రిక నిర్మూల‌న సాధ్య‌మ‌వుతుంద‌ని ఆయ‌న చెబుతున్నారు. “మాట‌లు వ‌ద్దు.. చేత‌లకు దిగండి. అప్పుడు మాట‌లు ఉండ‌వు.. ఫ‌లితం క‌నిపిస్తుంది” అని నారాయ‌ణ మూర్తి తెగేసి చెప్పారు.

This post was last modified on December 16, 2024 11:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

8 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

9 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

10 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

10 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

10 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

11 hours ago