ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ.. ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి.. చురకలు అంటించారు. ఆయన గత కొన్నాళ్లుగా పనిగంటల విషయంలో ఓ సూత్రం చెబుతున్నారు. వారానికి 70 గంటలు పనిచేయాలని ఆయన సూత్రీకరిస్తున్నారు. వాస్తవానికి ప్రపంచ దేశాలు సహా భారత దేశ లెక్కల ప్రకారం.. వారానికి 48 గంటలు మాత్రమే పనిచేయాలి. రోజుకు 8 గంటల చొప్పున వారానికి ఆరు రోజులు లెక్క వేస్తారు. దీని ప్రకారం.. 48 గంటలు పనిచేస్తే.. సరిపోతుందనేది ఒక లెక్క.
ఇక, వైట్ కాలర్ జాబ్స్ విషయంలో రోజుకు 6.30 గంటలు మాత్రమే పనిచేస్తారు. ఉదాహరణకు బ్యాంకింగ్, స్టాక్స్, అడ్మినిస్ట్రేటివ్ రంగాల్లో ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. అంటే.. వారానికి 38 గంటలే పనిచేయాలన్నది నిబంధన. అయితే.. దీనిని ఆది నుంచి కూడా నారాయణ మూర్తి విభేదిస్తున్నారు. వారానికి 70 గంటలు పనిచేయాలని ఆయన చెబుతున్నారు. అంటే.. రోజుకు 11-12 గంటల పాటు వ్యక్తులు పనిచేయాలన్నది ఆయన సూత్రం. కానీ, ఆయన సూత్రాన్ని విభేదించే వారే ఎక్కువగా ఉన్నారు తప్ప.. సమర్థించేవారు లేరు.
మరీ ముఖ్యంగా ఇప్పటికిప్పుడు తనను ఎవరైనా సమర్థిస్తే.. ఆవెంటనే తన సూత్రాన్ని ముందుగా.. తన సంస్థ అయిన ఇన్ఫోసిస్లోనే ప్రవేశ పెట్టాలన్నది నారాయణ మూర్తి కల. కానీ, దీనిని సమర్థించడం లేదు. దీంతో తరచుగా ఆయన చురకలు అంటిస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన నారాయణ మూర్తి.. ఇదే కోవలో ఆయన రియాక్ట్ అయ్యారు. దేశంలో పేదరికం.. ఉందంటారు. మరి పనిచేయకపోతే ఎలా? అని నిలదీశారు. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం.. దేశంలో 80 కోట్ల మంది రేషన్బియ్యం తీసుకుంటున్నారని.. అంటే.. వీరంతా పేదలే కదా! అని ప్రశ్నిస్తున్నారు.
దేశంలో పేదరికం పోవాలంటే.. ఖచ్చితంగా పనిచేయాల్సిందేనని.. అది కూడా.. ఎక్స్ట్రీమ్గా కష్టపడాలని నారాయణ మూర్తి వాదన. దేశంలో పేదరికం ఉందని ఉపన్యాసాలు ఇస్తే కుదరదని వ్యాఖ్యానించారు. దీనిని రూపు మాపాలంటే.. 70 గంటలు పనిచేస్తే..ఉత్పాదకత పెరుగుతుందని.. తద్వారా.. మాత్రమే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని ఆయన చెబుతున్నారు. “మాటలు వద్దు.. చేతలకు దిగండి. అప్పుడు మాటలు ఉండవు.. ఫలితం కనిపిస్తుంది” అని నారాయణ మూర్తి తెగేసి చెప్పారు.
గొడవలు కానీ మనస్పర్థలతో కానీ భార్యతో భర్త మాట్లాడకపోవటం గృహ హింస కిందకు వస్తుందా? మాట్లాడకుండా ఉండటం వేధింపులకు గురి…
‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…
అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…