Trends

పేద‌రికం అంటారు.. ప‌నిచేయ‌క‌పోతే ఎలా: నారాయణ‌మూర్తి చుర‌క‌లు

ప్ర‌పంచ ఐటీ దిగ్గ‌జ సంస్థ‌.. ఇన్ఫోసిస్ అధినేత నారాయ‌ణ‌మూర్తి.. చుర‌క‌లు అంటించారు. ఆయ‌న గ‌త కొన్నాళ్లుగా ప‌నిగంట‌ల విష‌యంలో ఓ సూత్రం చెబుతున్నారు. వారానికి 70 గంట‌లు ప‌నిచేయాల‌ని ఆయ‌న సూత్రీక‌రిస్తున్నారు. వాస్త‌వానికి ప్ర‌పంచ దేశాలు స‌హా భార‌త దేశ లెక్క‌ల ప్ర‌కారం.. వారానికి 48 గంట‌లు మాత్ర‌మే ప‌నిచేయాలి. రోజుకు 8 గంట‌ల చొప్పున వారానికి ఆరు రోజులు లెక్క వేస్తారు. దీని ప్ర‌కారం.. 48 గంట‌లు ప‌నిచేస్తే.. సరిపోతుంద‌నేది ఒక లెక్క‌.

ఇక‌, వైట్ కాల‌ర్ జాబ్స్ విష‌యంలో రోజుకు 6.30 గంట‌లు మాత్ర‌మే ప‌నిచేస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు బ్యాంకింగ్‌, స్టాక్స్‌, అడ్మినిస్ట్రేటివ్ రంగాల్లో ఉద్యోగుల‌కు ఇది వ‌ర్తిస్తుంది. అంటే.. వారానికి 38 గంట‌లే ప‌నిచేయాలన్నది నిబంధ‌న‌. అయితే.. దీనిని ఆది నుంచి కూడా నారాయ‌ణ మూర్తి విభేదిస్తున్నారు. వారానికి 70 గంట‌లు ప‌నిచేయాల‌ని ఆయ‌న చెబుతున్నారు. అంటే.. రోజుకు 11-12 గంట‌ల పాటు వ్య‌క్తులు ప‌నిచేయాల‌న్న‌ది ఆయ‌న సూత్రం. కానీ, ఆయ‌న సూత్రాన్ని విభేదించే వారే ఎక్కువ‌గా ఉన్నారు త‌ప్ప‌.. స‌మ‌ర్థించేవారు లేరు.

మ‌రీ ముఖ్యంగా ఇప్ప‌టికిప్పుడు త‌న‌ను ఎవ‌రైనా స‌మ‌ర్థిస్తే.. ఆవెంట‌నే త‌న సూత్రాన్ని ముందుగా.. త‌న సంస్థ అయిన ఇన్ఫోసిస్‌లోనే ప్ర‌వేశ పెట్టాల‌న్న‌ది నారాయ‌ణ మూర్తి క‌ల‌. కానీ, దీనిని స‌మ‌ర్థించ‌డం లేదు. దీంతో త‌ర‌చుగా ఆయ‌న చుర‌క‌లు అంటిస్తున్నారు. తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన నారాయ‌ణ మూర్తి.. ఇదే కోవ‌లో ఆయ‌న రియాక్ట్ అయ్యారు. దేశంలో పేద‌రికం.. ఉందంటారు. మ‌రి ప‌నిచేయ‌క‌పోతే ఎలా? అని నిల‌దీశారు. ప్ర‌స్తుతం ఉన్న గ‌ణాంకాల ప్ర‌కారం.. దేశంలో 80 కోట్ల మంది రేష‌న్‌బియ్యం తీసుకుంటున్నార‌ని.. అంటే.. వీరంతా పేద‌లే క‌దా! అని ప్ర‌శ్నిస్తున్నారు.

దేశంలో పేద‌రికం పోవాలంటే.. ఖ‌చ్చితంగా ప‌నిచేయాల్సిందేన‌ని.. అది కూడా.. ఎక్స్‌ట్రీమ్‌గా క‌ష్ట‌ప‌డాలని నారాయ‌ణ మూర్తి వాద‌న‌. దేశంలో పేద‌రికం ఉంద‌ని ఉప‌న్యాసాలు ఇస్తే కుద‌ర‌ద‌ని వ్యాఖ్యానించారు. దీనిని రూపు మాపాలంటే.. 70 గంట‌లు ప‌నిచేస్తే..ఉత్పాద‌క‌త పెరుగుతుంద‌ని.. త‌ద్వారా.. మాత్ర‌మే పేద‌రిక నిర్మూల‌న సాధ్య‌మ‌వుతుంద‌ని ఆయ‌న చెబుతున్నారు. “మాట‌లు వ‌ద్దు.. చేత‌లకు దిగండి. అప్పుడు మాట‌లు ఉండ‌వు.. ఫ‌లితం క‌నిపిస్తుంది” అని నారాయ‌ణ మూర్తి తెగేసి చెప్పారు.

This post was last modified on December 16, 2024 11:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago