Trends

పేద‌రికం అంటారు.. ప‌నిచేయ‌క‌పోతే ఎలా: నారాయణ‌మూర్తి చుర‌క‌లు

ప్ర‌పంచ ఐటీ దిగ్గ‌జ సంస్థ‌.. ఇన్ఫోసిస్ అధినేత నారాయ‌ణ‌మూర్తి.. చుర‌క‌లు అంటించారు. ఆయ‌న గ‌త కొన్నాళ్లుగా ప‌నిగంట‌ల విష‌యంలో ఓ సూత్రం చెబుతున్నారు. వారానికి 70 గంట‌లు ప‌నిచేయాల‌ని ఆయ‌న సూత్రీక‌రిస్తున్నారు. వాస్త‌వానికి ప్ర‌పంచ దేశాలు స‌హా భార‌త దేశ లెక్క‌ల ప్ర‌కారం.. వారానికి 48 గంట‌లు మాత్ర‌మే ప‌నిచేయాలి. రోజుకు 8 గంట‌ల చొప్పున వారానికి ఆరు రోజులు లెక్క వేస్తారు. దీని ప్ర‌కారం.. 48 గంట‌లు ప‌నిచేస్తే.. సరిపోతుంద‌నేది ఒక లెక్క‌.

ఇక‌, వైట్ కాల‌ర్ జాబ్స్ విష‌యంలో రోజుకు 6.30 గంట‌లు మాత్ర‌మే ప‌నిచేస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు బ్యాంకింగ్‌, స్టాక్స్‌, అడ్మినిస్ట్రేటివ్ రంగాల్లో ఉద్యోగుల‌కు ఇది వ‌ర్తిస్తుంది. అంటే.. వారానికి 38 గంట‌లే ప‌నిచేయాలన్నది నిబంధ‌న‌. అయితే.. దీనిని ఆది నుంచి కూడా నారాయ‌ణ మూర్తి విభేదిస్తున్నారు. వారానికి 70 గంట‌లు ప‌నిచేయాల‌ని ఆయ‌న చెబుతున్నారు. అంటే.. రోజుకు 11-12 గంట‌ల పాటు వ్య‌క్తులు ప‌నిచేయాల‌న్న‌ది ఆయ‌న సూత్రం. కానీ, ఆయ‌న సూత్రాన్ని విభేదించే వారే ఎక్కువ‌గా ఉన్నారు త‌ప్ప‌.. స‌మ‌ర్థించేవారు లేరు.

మ‌రీ ముఖ్యంగా ఇప్ప‌టికిప్పుడు త‌న‌ను ఎవ‌రైనా స‌మ‌ర్థిస్తే.. ఆవెంట‌నే త‌న సూత్రాన్ని ముందుగా.. త‌న సంస్థ అయిన ఇన్ఫోసిస్‌లోనే ప్ర‌వేశ పెట్టాల‌న్న‌ది నారాయ‌ణ మూర్తి క‌ల‌. కానీ, దీనిని స‌మ‌ర్థించ‌డం లేదు. దీంతో త‌ర‌చుగా ఆయ‌న చుర‌క‌లు అంటిస్తున్నారు. తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన నారాయ‌ణ మూర్తి.. ఇదే కోవ‌లో ఆయ‌న రియాక్ట్ అయ్యారు. దేశంలో పేద‌రికం.. ఉందంటారు. మ‌రి ప‌నిచేయ‌క‌పోతే ఎలా? అని నిల‌దీశారు. ప్ర‌స్తుతం ఉన్న గ‌ణాంకాల ప్ర‌కారం.. దేశంలో 80 కోట్ల మంది రేష‌న్‌బియ్యం తీసుకుంటున్నార‌ని.. అంటే.. వీరంతా పేద‌లే క‌దా! అని ప్ర‌శ్నిస్తున్నారు.

దేశంలో పేద‌రికం పోవాలంటే.. ఖ‌చ్చితంగా ప‌నిచేయాల్సిందేన‌ని.. అది కూడా.. ఎక్స్‌ట్రీమ్‌గా క‌ష్ట‌ప‌డాలని నారాయ‌ణ మూర్తి వాద‌న‌. దేశంలో పేద‌రికం ఉంద‌ని ఉప‌న్యాసాలు ఇస్తే కుద‌ర‌ద‌ని వ్యాఖ్యానించారు. దీనిని రూపు మాపాలంటే.. 70 గంట‌లు ప‌నిచేస్తే..ఉత్పాద‌క‌త పెరుగుతుంద‌ని.. త‌ద్వారా.. మాత్ర‌మే పేద‌రిక నిర్మూల‌న సాధ్య‌మ‌వుతుంద‌ని ఆయ‌న చెబుతున్నారు. “మాట‌లు వ‌ద్దు.. చేత‌లకు దిగండి. అప్పుడు మాట‌లు ఉండ‌వు.. ఫ‌లితం క‌నిపిస్తుంది” అని నారాయ‌ణ మూర్తి తెగేసి చెప్పారు.

This post was last modified on December 16, 2024 11:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

48 minutes ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

2 hours ago

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని…

2 hours ago

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago

పేర్ని పాకులాట‌.. ఇమేజ్ కోస‌మేనా.. ?

పేర్ని నాని. వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ నుంచి త‌ప్పుకొని వారసుడు కిట్టుకు…

5 hours ago

అవును… కళ్యాణ్ రామ్ సరసన ఆమెనే

అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…

7 hours ago