Trends

రైల్వే కొత్త నిర్ణయం: టికెట్ రిజర్వేషన్ రూల్ మారింది

ఇప్పటి వరకు రైల్వేల్లో ముందస్తుగా సీట్లు రిజర్వు చేసుకునే గడువు 120 రోజులు ఉండేది. కానీ, నవంబర్ 1 నుండి ఈ గడువును 60 రోజులకు మాత్రమే పరిమితం చేస్తూ రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుతో ప్రయాణికులు ఇకపై కేవలం రెండు నెలల ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైల్వే బోర్డు ఈ నిర్ణయంపై వివరణ ఇస్తూ, 120 రోజుల గడువు ఉండటం వల్ల టికెట్ రద్దులు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పింది.

ముఖ్యంగా 21 శాతం టికెట్లు రద్దు అవుతుండటం గమనార్హం. టికెట్లు బుక్ చేసుకున్నవారు ఆ సమయంలో ప్రయాణం చేయకపోవడం వల్ల సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయని పేర్కొంది. ఇది ప్రయాణికులకు అసౌకర్యంగా మారుతోందని తెలిపింది. దీని వల్ల పలు రకాల మోసాలు జరుగుతున్నాయి. ముందుగానే పెద్ద సంఖ్యలో సీట్లు బుక్ చేసుకొని తర్వాత అక్రమంగా అమ్మడం, లేదా ఇతర ప్రయోజనాల కోసం బ్లాక్ చేయడం వంటి చర్యలకు ఈ గడువు ఎక్కువగా ఉండటం సహకరిస్తోందని రైల్వే బోర్డు తెలిపింది.

తక్కువ గడువు నిర్ణయం వల్ల ఇలాంటి దుర్వినియోగాలను నివారించవచ్చని పేర్కొంది. 60 రోజుల గడువు నిజమైన ప్రయాణికులకు అనువుగా ఉంటుందని, తమ ప్రయాణానికి ఒకటి లేదా రెండు నెలల ముందే ప్లాన్ చేసే వారికి ఇది మరింత సౌకర్యవంతంగా మారుతుందని బోర్డు అభిప్రాయపడింది. అదనంగా, ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉంటే ప్రత్యేక రైళ్లు సులభంగా ఏర్పాటు చేయడం కూడా సాధ్యమవుతుందని వెల్లడించింది.మ్ముఖ్యంగా పండుగలు, సెలవులు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో టికెట్ల డిమాండ్ పెరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో 60 రోజుల ముందస్తు రిజర్వేషన్ విధానం రైల్వే శాఖకు ప్రయోజనకరంగా ఉంటుంది.

This post was last modified on October 18, 2024 3:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 సీట్లు ఎలా వచ్చాయన్నదానిపై కోటి సంతకాలు చేయించాలి

ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్‌లైన్‌ను మళ్లీ…

54 minutes ago

రాజా సాబ్ సంగీతానికి అభిమానుల సూచనలు

సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…

1 hour ago

అమరావతి రైతులు… హ్యాపీనా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క స‌మ‌స్య‌గా ఉన్న రైతుల అంశాన్ని ప్ర‌భుత్వం దాదాపు ప‌రిష్క‌రించింది. ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని…

3 hours ago

కోటి సంతకాలు తెస్తాం.. ఒక్క సంతకం పెట్టండి!

రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…

6 hours ago

అక్కడ మెస్సీ అభిమానుల విధ్వంసం.. ఇక్కడి మ్యాచ్ పై ఉత్కంఠ!

కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…

6 hours ago

శుక్రవారం రికార్డును తొక్కి పడేసింది

బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…

6 hours ago