Trends

రైల్వే కొత్త నిర్ణయం: టికెట్ రిజర్వేషన్ రూల్ మారింది

ఇప్పటి వరకు రైల్వేల్లో ముందస్తుగా సీట్లు రిజర్వు చేసుకునే గడువు 120 రోజులు ఉండేది. కానీ, నవంబర్ 1 నుండి ఈ గడువును 60 రోజులకు మాత్రమే పరిమితం చేస్తూ రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుతో ప్రయాణికులు ఇకపై కేవలం రెండు నెలల ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రైల్వే బోర్డు ఈ నిర్ణయంపై వివరణ ఇస్తూ, 120 రోజుల గడువు ఉండటం వల్ల టికెట్ రద్దులు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పింది.

ముఖ్యంగా 21 శాతం టికెట్లు రద్దు అవుతుండటం గమనార్హం. టికెట్లు బుక్ చేసుకున్నవారు ఆ సమయంలో ప్రయాణం చేయకపోవడం వల్ల సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయని పేర్కొంది. ఇది ప్రయాణికులకు అసౌకర్యంగా మారుతోందని తెలిపింది. దీని వల్ల పలు రకాల మోసాలు జరుగుతున్నాయి. ముందుగానే పెద్ద సంఖ్యలో సీట్లు బుక్ చేసుకొని తర్వాత అక్రమంగా అమ్మడం, లేదా ఇతర ప్రయోజనాల కోసం బ్లాక్ చేయడం వంటి చర్యలకు ఈ గడువు ఎక్కువగా ఉండటం సహకరిస్తోందని రైల్వే బోర్డు తెలిపింది.

తక్కువ గడువు నిర్ణయం వల్ల ఇలాంటి దుర్వినియోగాలను నివారించవచ్చని పేర్కొంది. 60 రోజుల గడువు నిజమైన ప్రయాణికులకు అనువుగా ఉంటుందని, తమ ప్రయాణానికి ఒకటి లేదా రెండు నెలల ముందే ప్లాన్ చేసే వారికి ఇది మరింత సౌకర్యవంతంగా మారుతుందని బోర్డు అభిప్రాయపడింది. అదనంగా, ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉంటే ప్రత్యేక రైళ్లు సులభంగా ఏర్పాటు చేయడం కూడా సాధ్యమవుతుందని వెల్లడించింది.మ్ముఖ్యంగా పండుగలు, సెలవులు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో టికెట్ల డిమాండ్ పెరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో 60 రోజుల ముందస్తు రిజర్వేషన్ విధానం రైల్వే శాఖకు ప్రయోజనకరంగా ఉంటుంది.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

3 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

4 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

5 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

5 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

5 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

6 hours ago