Top Rated

ముకేశ్ కల తీరింది.. రిలయన్స్ అప్పు తీరింది

అప్పులేనోడు ఈ ప్రపంచంలో చాలా తక్కువ. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా.. ఎంతోడికైనా అంతో ఇంతో రుణం ఉండటం మామూలే. మనుషులకే కాదు.. దేవుళ్లకు సైతం అప్పు బాధ తప్పదు. ఎక్కడిదాకానో ఎందుకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి సైతం రుణం తిప్పలు తప్పలేదు. కుబేరుడి దగ్గర తీసుకున్న రుణం ఇంకా తీరలేదంటారు.

అలాంటిది డిజిటల్ యుగంలో ఒక కంపెనీ ముందున్న భారీ అప్పును చెప్పిన సమయానికి ముందే తీర్చేయటం సాధ్యమేనా? అది కూడా ప్రపంచం మొత్తం విపత్తుతో వణికిపోతున్న వేళ.. అంటే అసాధ్యమనే చెప్పాలి. కానీ.. అలాంటి అసాధ్యాల్ని సుసాధ్యం చేయటం రిలయన్స్ అధినేత ముకేశ్ కు మాత్రమే సాధ్యమేమో?

2021 మార్చి నాటికి రిలయన్స్ ను అప్పులు లేని కంపెనీగా మారుస్తానని ఈ మధ్యనే అంబానీ తన వాటాదారులకు మాట ఇచ్చారు. తానిచ్చిన హామీని దాదాపు తొమ్మిది నెలలకు ముందే తీర్చేయటం ద్వారా కార్పొరేట్ సంచలనంగా మారారు. తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయనీ విషయాన్ని వెల్లడించారు. రిలయన్స్ ఇప్పుడు బంగారు దశాబ్దంలో ఉందని ప్రకటించారు.

ఇది గర్వించదగ్గ సందర్భమని.. వాటాదారుల అంచనాలను మళ్లీ మళ్లీ అధిగమించటం రిలయన్స్ డీఎన్ఏలోనే ఉందన్నారు. తన తండ్రి ఆశయాల సాధన.. దేశ శ్రేయస్సు.. సమగ్ర అభివృద్ధిలో మరింత ప్రతిష్ఠాత్మక లక్ష్యాల్ని నిర్దేశించటమే కాదు.. వాటిని సాధిస్తామన్నారు. ఇంతకీ తనకున్న భారీ అప్పును ముకేశ్ ఎలా తీర్చారన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

రుణాన్ని తీర్చటమన్న విషయాన్ని వూహాత్మకంగా వ్యవహరించారని చెప్పాలి. ఏప్రిల్ 22 నుంచి తొమ్మిది వారాల్లో జియో ఫ్లాట్ ఫామ్స్ లో 24.7 శాతం వాటాల్ని వివిధ సంస్థలకు విక్రయించటం ద్వారా రూ.1.156 లక్షల కోట్లను సేకరించింది. మరోవైపు రైట్స్ ఇష్యూ 1.59 సార్లు ఎక్కువగా సబ్ స్కైబ్ కావటంతో మరో రూ.53,124 కోట్లను సాధించింది.

దీంతో ఈ మార్చి 31 నాటికి కంపెనీకి ఉన్న 1.61 లక్షల కోట్ల రూపాయిల రుణం ఉంది. ముకేశ్ విడుదల చేసిన ప్రకటనతో రిలయన్స్ షేరు భారీగా పెరగటమే కాదు.. రికార్డుస్థాయి గరిష్ఠానికి చేరుకుంది. రూ.1684కు చేరుకుంది. ముకేశా.. మజాకానా.

This post was last modified on June 19, 2020 4:36 pm

Share

Recent Posts

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

1 second ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

4 minutes ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

43 minutes ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

4 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

4 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

5 hours ago